Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Ex-CFO Bribe Allegation Post Goes Viral in Bengaluru1
‘నా కుమార్తె చనిపోయిందన్న కనికరంలేదు వీళ్లకి.. లంచం పేరుతో కాల్చుకు తిన్నారు’!

సాక్షి,బెంగళూరు: గుండెను మెలిపెట్టే ఓ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషాద ఘటనలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉన్నత ఉద్యోగి ఒక్కగానొక్క కుమార్తె మరణించిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చేసేందుకు లంచాలు ఇచ్చారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ నుంచి ఉన్నతస్థాయి పోలీసు అధికారి వరకు ఎలా లంచాలు అడిగారో? అందుకు తాను లంచాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో?లింక్డిన్‌ పోస్టులో సుదీర్ఘంగా వివరించారు. ఆ పోస్టును కొద్దిసేపటికే డిలీట్‌ చేశారు. అప్పటికే ఆ పోస్టు వైరల్‌గా మారింది.ఆ లింక్డిన్‌ పోస్టులో..బెంగళూరులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)కె.శివకుమార్ కుమార్తె అక్షయ శివకుమార్‌(34). కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్‌, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ పెట్టుబడుల సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ ఎనిమిదేళ్లు పనిచేశారు. ఇతర సంస్థల్లో మూడేళ్లు పనిచేశారు.అయితే ఈ క్రమంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లో విధులు నిర్వహిస్తున్న అక్షయ గతనెల సెప్టెంబర్ 18 మెదడు రక్తస్రావం కారణంగా ఇంట్లోనే మరణించారు. అక్షయ మరణించిన తర్వాత అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. ఆ సమయంలో పలువురు తన వద్ద నుంచి లంచం డిమాండ్‌ చేశారని, మరికొందరు తనపట్ల దారుణంగా వ్యవహరించారని వాపోయారు. https://t.co/yJRWH989TU— DCP Whitefield Bengaluru (@dcpwhitefield) October 30, 2025 ‘నా కుమార్తె మరణం తర్వాత..అవసరమైన ఫార్మాలటీస్‌లను పూర్తిచేసేందుకు అవసరమైన పత్రాలను పొందడానికి అంబులెన్స్ ఆపరేటర్‌ నుంచి పోలీసు అధికారుల వరకు..శ్మశానవాటిక నుంచి బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) కార్యాలయ సిబ్బంది వరకు దాదాపు అందరికీ లంచాలు చెల్లించాల్సి వచ్చింది.పోలీస్ స్టేషన్‌లో కూడా తనను నగదు రూపంలో చెల్లించమని బలవంతం చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌,పోస్టుమార్టం నివేదిక కాపీని ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పోలిస్‌స్టేషన్‌ చుట్టూ నాలుగు రోజులు తిరిగాం. పనికాలేదు. పోలీసులు స్టేషన్‌లోని బహిరంగంగా నన్ను లంచం డిమాండ్‌ చేశారు. ఆ లంచాన్ని కూడా పోలిస్‌ స్టేషన్‌లోనే ఇచ్చారు. నేను నా ఏకైక బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉంటే.. ఈ సమాజం సానుభూతి లేకుండా నన్ను లంచం పేరుతో కాల్చుకు తిన్నది. ఇది దారుణం. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను చెల్లించాను. మరి పేదల పరిస్థితి ఏంటి?నా కుమార్తె భౌతికకాయాన్ని కసవనహళ్లిలోని ఓ ఆస్పత్రి నుంచి కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. ఇందుకోసం అంబులెన్స్ డ్రైవర్ రూ.3వేలు డిమాండ్‌ చేశాడు. పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాపట్ల కుమార్తె చనిపోయిందన్న కనికరం కూడా చూపించలేదు పోలీసు అధికారులు లంచం అడిగారు. అసభ్యంగా మాట్లాడారు. ‘(తన గురించి మాట్లాడుతూ..)ఒక వ్యక్తి ఇప్పటికే మానసికంగా కుంగిపోయి, భావోద్వేగంగా తల్లడిల్లుతున్న సమయంలో పోలీసులు డబ్బులు డిమాండ్ చేయడం,నిర్లక్క్ష్యంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం. వాళ్లకు కుటుంబం లేదా? వారికి బావోద్వేగాలు ఉండవా? ఇది అక్కడితో ఆగలేదు. బీబీఎంపీ నుంచి డెత్‌ సర్టిఫికెట్‌ పొందడానికి చాలా ఇబ్బంది పడ్డా. డెత్‌ సర్టిఫికెట్‌ కోసం బీబీఎంపీ కార్యాలయానికి ఐదురోజుల పాటు కాళ్లరిగేలా తిరగా. కొనసాగుతున్న ‘కుల సర్వే’ కారణంగా ఎవరూ అందుబాటులో లేరు. చివరికి బీబీఎంపీ సీనియర్‌ అధికారిని సంప్రదించిన తర్వాతే డెత్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇందుకోసం సదరు అధికారి నా వద్ద నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన రుసుము కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిలో.. ఈ అరాచకం నుంచి బెంగళూరును రక్షించగలరా? నారాయణ మూర్తి, అజీమ్ ప్రేమ్‌జీ, మజుందార్ షాలు బిలియన్ల కొద్దీ డబ్బున్న పెద్దలు ఈ నగరాన్ని రక్షించగలరా? వారు చాలా మాట్లాడతారు కానీ...అని ముగించారు.ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో బెంగళూరు వైట్‌ఫీల్డ్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. శివకుమార్ ట్వీట్‌లో పేర్కొన్న సంఘటనకు సంబంధించి, బెల్లందూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పీఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అసభ్యకరమైన లేదా అనుచితమైన ప్రవర్తనను సహించదు’అని పోలీసులు తెలిపారు.

 India put on abysmal fielding show in Australia semifinal2
టీమిండియా కొంప‌ముంచిన చెత్త ఫీల్డింగ్‌..

మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2025లో భాగంగా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఉతికారేశారు.లిచ్‌ఫీల్డ్ సూపర్ సెంచరీ..తొలుత ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ మెరుపు సెంచరీతో చెలరేగింది. 22 ఏళ్ల లిచ్‌ఫీల్డ్‌ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించింది. 93 బంతులు ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్‌.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 119 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎల్లీస్‌ పెర్రీ(88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77), గార్డెనర్‌(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు.బౌలర్లు విఫలం..ఈ కీల‌క పోరులో భార‌త బౌల‌ర్లు చెతులేత్తేశారు. స్పిన్న‌ర్ శ్రీచ‌ర‌ణి మిన‌హా మిగితా బౌల‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ దీప్తీ శ‌ర్మ బంతితో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 9.5 ఓవ‌ర్లు బౌలిగ్ చేసిన దీప్తీ.. రెండు వికెట్లు ప‌డ‌గొట్టిన‌ప్ప‌టికి ఏకంగా 73 ప‌రుగులు స‌మ‌ర్పించుకుంది. ఆమెతో పాటు రాధా యాద‌వ్‌, అమ‌న్ జ్యోత్ కౌర్ కూడా భారీగా ప‌రుగులిచ్చారు. భార‌త బౌలింగ్‌ను కంగారులు ఓ ఆట ఆడుకున్నారు. చరణి మాత్రం తన 10 ఓవర్ల కోటాలో 49 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించింది.చెత్త ఫీల్డింగ్‌..ఇక ఫీల్డింగ్‌లో టీమిండియా తీరు ఏ మాత్రం మార‌లేదు. ఈ మ్యాచ్‌లో కూడా ఫీల్డింగ్‌లో భార‌త్ తీవ్ర నిరాశ‌ప‌రిచింది. తొలుత హ‌ర్మన్ ప్రీత్ విడిచిపెట్టిన క్యాచ్ నుంచి మొద‌లైన ఫీల్డింగ్ క‌ష్టాలు మ్యాచ్ ఆఖ‌రి వ‌ర‌కు కొన‌సాగాయి. ఈ మ్యాచ్‌లో మిస్ ఫీల్డ్స్‌, బంతిని స‌రిగ్గా అందుకోక‌పోవ‌డం, ఓవ‌ర్ త్రోస్ వంటి త‌ప్పిదాల‌ను భార‌త ఫీల్డ‌ర్లు చేశారు. అందుకు భార‌త్ భారీ మూల్యం చెల్సించుకోవాల్సి వ‌చ్చింది. టీమిండియా ప్లేయ‌ర్లు స‌రిగ్గా ఫీల్డింగ్ చేసి ఉంటే ఆసీస్ స్కోర్ 300 ప‌రుగుల మార్క్‌ను దాటక‌పోయేది.ఈ టోర్నీలో భారత జట్టు ఫీల్డింగ్ గణాంకాలు పట్టిన క్యాచ్‌లు- 35 వదిలేసిన క్యాచ్‌లు-18 క్యాచింగ్ సామర్థ్యం- 66% మిస్ అయిన స్టంపింగ్‌లు- 3 మిస్‌ఫీల్డ్‌లు - 74 ఓవర్‌త్రోలు అయిన బంతులు- 6 చదవండి: IND vs SA: టీమిండియాతో మ్యాచ్‌.. సౌతాఫ్రికా కెప్టెన్‌ ఫెయిల్‌! అయినా భారీ స్కోర్‌

SS Rajamouli speech at Prasad Imax at Baahubali The Epic show3
'పదేళ్లైనా ఎక్కడా తగ్గలేదు'.. రాజమౌళి స్పీచ్ వైరల్

దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో సందడి చేశారు. బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ షో సందర్భంగా ఆడియన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. బాహుబలి రిలీజై పదేళ్లయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదన్నారు. ఇదంతా మీవల్లే సాధ్యమైందని కామెంట్స్ చేశారు. మహిస్మతి రాజ్యంలోని ప్రజలంతా బాగున్నారా? అంటూ అభిమానులను పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మీ అందరి ప్రేమ వల్లే మరోసారి మీ ముందుకు తీసుకొస్తున్నామని రాజమౌళి అన్నారు. పదేళ్లుగా మీరు ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జై మహిస్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. కాగా.. బాహుబలి రెండు పార్టులను కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాహుబలి ది ఎపిక్(Baahubali: The Epic) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. THE DIRECTOR addressing the audience at @PrasadsCinemas PCX screen!! It’s SHOW TIME.. #BaahubaliTheEpic #Baahubali pic.twitter.com/1dY6hj7cYE— Baahubali (@BaahubaliMovie) October 30, 2025

Uttarakhand Kandhar Village Imposes Limit on Gold Jewelry4
ఒంటినిండా నగలు ధరిస్తే.. రూ. 50వేలు జరిమానా!

బంగారు నగలు ఉంటే.. ఎవరికైనా ధరించుకోవాలని, ఓ నలుగురికి చూపించుకోవాలని ఉంటుంది. అయితే ఇలాంటి ఆడంబరాలకు స్వస్తి పలకడానికి.. ఉత్తరాఖండ్‌లోని జౌన్సర్-బావర్ గిరిజన ప్రాంతంలోని కంధర్ గ్రామ నివాసితులు ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఉల్లంఘించిన వారికి రూ. 50వేలు జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.ఆడంబరాలను అరికట్టడానికి మాత్రమే కాకుండా.. ఆర్ధిక అసమానతలను తగ్గించడానికి గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి మహిళలు కూడా స్వాగతించారు. ఇకపై అక్కడి మహిళలు వివాహాది శుభకార్యాలకు వెళ్లినా.. కేవలం చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలి. ఇవి కాదని ఎవరైనా ఇతర బంగారు నగలను ధరిస్తే.. వారికి రూ. 50,000 జరిగిమానా విధించనున్నట్లు గ్రామపెద్దలు హెచ్చరించారు.బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. డబ్బున్నవారు గోల్డ్ కొనుగోలు చేస్తారు. పేదరికంలో ఉన్నవారికి ఇది సాధ్యం కాదు. బంగారం కొనాలని అప్పులు చేస్తే.. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో అప్పులు పెరుగుతాయని కంధర్ గ్రామపెద్దలు.. కొత్త నిర్ణయం తీసుకున్న సందర్భంగా వివరించారు.వివాహం అనేది ఒక పవిత్రమైన ఆచారం. అది ప్రదర్శించడానికి వేదిక కాదు. ఆడంబరాలు/ప్రదర్శనలు అనే గోడలను కూల్చివేసినప్పుడే.. నిజమైన సమానత్వం సాధించబడుతుందని అక్కడి నివాసితులు నమ్ముతున్నారు. కొత్తగా తీసుకున్న నిర్ణయం.. ధనిక & పేద కుటుంబాల మధ్య పోల్చుకోవడం కొంత తగ్గుతుంది. అనవసరమైన ఖర్చులను అరికట్టవచ్చు. ఇది సామాజిక ఐక్యతను పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి

Doctors Put Living Person In Mortuary In Mahabubabad Govt Hospital5
దారుణం.. బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన వైద్యులు

సాక్షి, మహబూబాబాద్‌: వైద్యం కోసం వచ్చిన రోగిని ఆధార్ కార్డు లేదనే నెపంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఆసుపత్రి ఆవరణలో రోగి.. వైద్యం కోసం రెండు రోజుల పాటు పడిగాపులు కాస్తూ నిరీక్షించి నీరసించడంతో సిబ్బంది మృతి చెందాడనే అనుమానంతో మార్చురీలో భద్రపరిచిన అమానవీయ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వి.రవి మూత్ర పిండాల వ్యాధితో ఇబ్బంది పడుతూ మూడు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చాడు. రోగికి తోడుగా ఎవ్వరు ఉండక పోవడంతో పాటు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించారు. దీంతో రోగి 2 రోజుల పాటు ఆస్పత్రి ఆవరణలో పడిగాపులు పడి.. నీరసించి ఆ చేతనంగా మారిపోయాడు. రోగి మృతి చెందాడనే అనుమానంతో వైద్య సిబ్బంది ఆసుపత్రిలోని మార్చూరికి తరలించి భద్ర పరిచారు.మరుసటి రోజు మార్చురిని శుభ్ర పరచడానికి వచ్చిన స్వీపర్లు.... రోగి కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని రోగిని వైద్యం చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఇంత దారుణం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు.. మానవత్వం మంటగలిపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rabri Devi on Tej Pratap Yadav contesting Bihar elections6
Bihar Elections: కుమారుల పోటీపై రబ్రీ సంచలన వ్యాఖ్యలు

పట్నా: బీహార్‌లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇంతలో ఆర్జేడీ చీఫ్‌ లాలూ భార్య రబ్రీదేవి తన కుమారుల పోటీపై వ్యాఖ్యానించారు. తన కుమారుడు, జనశక్తి జనతాదళ్ (జేజేడీ)అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆమె మాట్లాడుతూ, ఆయనను పోటీ చేయనివ్వాలని, ఆయన తన ప్రాతినిధ్య స్థానం నుంచే పోటీ చేస్తున్నారని అన్నారు.ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాన్ని అమ్మేసిందని, డబ్బంతా ప్రధాని మోదీ ఇంటికి చేరిందని రబ్రీదేవి వ్యాఖ్యానించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ. 70 వేల కోట్ల మోసానికి పాల్పడ్డారని, కానీ దానిపై ఎక్కడా చర్చ జరగలేదన్నారు. లాలూ ఎలాంటి తప్పు చేయలేదని, తాము కోర్టులో కేసును ఎదుర్కొంటామన్నారు. తన మరో కుమారుడు, మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ విజయంపై రబ్రీ దేవి నమ్మకం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. #WATCH | Raghopur East, Bihar | #BiharElection2025 | RJD leader Rabri Devi says, "Nitish Kumar will not become the Chief Minister of Bihar..."On her son and Janshakti Janata Dal (JJD) Chief Tej Pratap Yadav contesting elections, she says, "It is fine, let him contest, he is… pic.twitter.com/Uo7C55up3e— ANI (@ANI) October 30, 2025రఘోపూర్ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తేజస్వి యాదవ్‌ను బీహార్ ముఖ్యమంత్రిని చేస్తారని రబ్రీ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రఘోపూర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. కాగా మహాకూటమి తాజాగా ‘బీహార్ కా తేజస్వి ప్రాణ్’ అనే పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. దానిలో ప్రజలకు పలు హామీలనిచ్చింది. బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీలలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నారు.ఇది కూడా చదవండి: కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలో మృతి

SC Key Instruction to  Vundavalli Aruna Kumar Margadarsi Case7
మార్గదర్శి కేసు.. ఉండవల్లికి సుప్రీం కోర్టు కీలక సూచన

సాక్షి, ఢిల్లీ: మార్గదర్శి కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ఆర్బీఐ నిబంధనలను ఆ కంపెనీ ఉల్లంఘించిన అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించాలని మాజీ ఎంపీ, అడ్వొకేట్‌ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టు గురువారం సూచింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఇవాళ వాదనలు వింది. వర్చువల్‌గా విచారణకు హాజరైన ఉండవల్లి ‘‘ఇది డిపాజిట్ల కలెక్షన్, పేమెంట్స్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించిందని.. దీనిపైన విచారణ జరగాలని’’ కోరారు. అయితే.. ఈ అంశాలన్నీ హైకోర్టు ముందున్న ప్రధాన పిటిషన్ విచారణ సందర్భంగా వినిపించాలని ఆయనకు ధర్మాసనం సూచించింది. ప్రస్తుతం తాము కేసు మెరిట్ లోకి వెళ్లడం లేదని.. హైకోర్టు స్టే ఇవ్వనన్న అంశంపై మాత్రమే విచారణ చేస్తున్నామని స్పష్టం చేసింది. ఇక.. ఈ కేసులో ఉండవల్లి అసలు ప్రతివాది కాదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఆ సమయంలోనూ తాము ఎలాంటి వ్యాఖ్యానం చేయదలచుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. మార్గదర్శి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదిస్తూ.. తాము చెల్లించాల్సిన 2,300 కోట్ల రూపాయల డిపాజిట్లలో సింహభాగం చెల్లించామని, ఎస్క్రో ఖాతాలో 5.43 కోట్ల రూపాయలు ఉన్నాయని.. డిపాజిట్ల మెచ్యూరిటీ ఆధారంగా వాటిని చెల్లించాలని కోరారు.

Hit and run case filed in Gujarat8
కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లి.. ప్రాణం తీసిన టీచర్‌

గాంధీనగర్‌: ఓ టీచర్‌ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. బైక్‌ను ఢీకొట్టి, దానిపై ఉన్న వారిని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. ఆపై ప్రాణం తీశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని మోడస లునావాడ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల ‍కథనం ప్రకారం.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే టీచర్‌ అతడి సోదరుడు పూటుగా మద్యం సేవించారు. కన్ను మిన్ను కానరాకుండా రెచ్చిపోయి మరీ డ్రైవింగ్‌ చేశారు. మద్యం తాగి ఒళ్లు తెలియని మైకంలో కారు నడుపుతోన్న టీచర్ ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఆపై బైక్‌ను ఢీకొట్టిన విషయాన్ని గుర్తించడకుండా బానెట్‌పై పడిన వ్యక్తిని అలాగే 1.5 కి.మీ మేర ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత మితిమీరిన వేగం దాటికి బానెట్‌పై ఉన్న బాధితుడు కిందపడ్డాడు. ఈ హిట్‌ అండ్‌ రన్‌ కేసు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొంతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదానికి సంబంధించిన సోషల్‌ మీడియాలో వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ వీడియో ఆధారంగా ఈ దుర్ఘటన మహిసాగర్ జిల్లాలోని మోడాసా-లునావాడ నేషల్‌ హైవే 48లో జరిగినట్లు గుర్తించారు. హిట్‌ అండ్‌ రన్‌ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మనీశ్‌ పటేల్‌, మెహుల్ పటేల్‌గా పోలీసులు గుర్తించారు. ఇక గాయపడిన ఇద్దరు బాధితులను లునావాడాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. #Mahisagar: મોડાસા લુણાવાડા રોડ પર હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના આવી સામે, કાર ચાલકે બાઈક ચાલકને અકસ્માત સર્જી બચાવવાની જગ્યાએ ૩-૪ કિલોમીટર સુધી કાર ઉપર ઢસડીને લઈ ગયો.. અન્ય કારચાલકો દ્વારા કારચાલકને રોકી પોલીસના હવાલે કર્યો..#Gujarat #ViralVideo pic.twitter.com/7H5HUQYlFW— 🇮🇳Parth Amin (@Imparth_amin) October 29, 2025

Satellite Images Show Mass Killings In War Ravaged Sudan9
Sudan: ఉపగ్రహ చిత్రాల్లో సామూహిక రక్తపాత దృశ్యాలు

న్యూఢిల్లీ: అంతర్యుద్ధంలో దెబ్బతిన్న సూడాన్‌లో భారీగా రక్తపాతం జరిగినట్లు అంతరిక్షం నుండి వెలువడిన దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన హ్యుమానిటేరియన్ రీసెర్చ్ ల్యాబ్ (హెచ్‌ఆర్‌ఎల్‌) విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో గత వారంలో ఎల్ ఫాషర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తిరుగుబాటు సంస్థ సామూహిక హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.రెండు సంవత్సరాలకు పైగా సాగుతున్న అంతర్యుద్ధంలో సూడాన్ అతలాకుతలమైంది. సుడానీస్ ఆర్మీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) మధ్య యుద్ధం 2023 ఏప్రిల్‌లో మొదలయ్యింది. గతంలో అధికారాన్ని పంచుకున్న ఈ రెండు యూనిట్లు ప్రజాస్వామ్యం వైపు మళ్లే సమయంలో, తమ బలగాలను ఏకీకృతం చేసే ప్రణాళికల విషయంలో విఫలమయ్యాయి. అక్టోబర్ 26న, ఉత్తర డార్ఫర్‌లోని ఎల్-ఫాషర్ నగరంలోని ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర​్‌ఎస్‌ఎఫ్‌ తెలిపింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) తెలిపిన వివరాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో దాదాపు 40 వేల మంది మృతి చెందారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 🚨HUMAN SECURITY EMERGENCY🚨 El-Fasher has fallen to RSF. HRL finds evidence of mass killings including door-to-door clearance operations and objects consistent with reported bodies on berm entrapping El-Fasher.#KeepEyesOnSudan🛰️@AirbusSpace @Maxarhttps://t.co/1HApllgNL5 pic.twitter.com/yrCbM5HxeP— Humanitarian Research Lab (HRL) at YSPH (@HRL_YaleSPH) October 27, 2025సూడాన్‌లో సగం మందికిపైగా ప​్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాధులు చుట్టుముట్టాయి. సోమవారం ప్రచురితమైన ఒక నివేదికలో ఎల్-ఫాషర్‌లోని దరాజా ఔలా పరిసరాల్లో వ్యూహాత్మకంగా మోహరించిన ఆర్‌ఎస్‌ఎఫ్‌ వాహనాలను హెచ్‌ఆర్‌ఎల్‌ గమనించింది. చిత్ర విశ్లేషణలో ఆర్‌ఎస్‌ఫ్‌ వాహనాల దగ్గర నేలపై పడివున్న మానవ శరీరాల పరిమాణానికి అనుగుణంగా ఉన్న వస్తువులు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఐదు ఎర్రటి రంగులో కనిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎఫ్‌ సెప్టెంబర్ 19న డ్రోన్‌లతో దాడి చేసి దాదాపు 78 హత్య చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం యేల్ హెచ్‌ఆర్‌ఎల్‌.. ఎల్-ఫాషర్ నుండి పారిపోతున్న సమయంలో పౌరులు మరణించడాన్ని కూడా కనుగొంది. ఈ ప్రాంతం పూర్తిగా ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఆధీనంలో ఉంది. వారి కార్యకలాపాల స్థావరంగా దీనిని ఉపయోగిస్తున్నారని యేల్ తన నివేదికలో పేర్కొంది. ఇది కూడా చదవండి: Varanasi: ఉమ్మినా.. కుక్క మలాన్ని కడగకున్నా..

MLA komatireddy rajagopal reddy Clarity On Party Change Circulations10
నాపై కాంగ్రెస్‌ వాళ్లే తప్పుడు ప్రచారం: రాజగోపాల్‌ రెడ్డి

సాక్షి, యాదాద్రి భువనగిరి: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఖండించారు. రాజకీయంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పు అంటూ తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం, రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ..‘చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపుదిద్దబోతున్నాం. చౌటుప్పల్ చెరువుకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరద నీటిని డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని తెలిపారు.పార్టీ మార్పుపై.. పార్టీ మారుతున్నానని సొంత పార్టీ వాళ్లు, బయట పార్టీ వాళ్లు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు దుష్ప్రచారాలను ఎవరు నమ్మవద్దు. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటిస్తాను. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను, ఎమ్మెల్యేను.. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తాను. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటా. నా ముందు మునుగోడు అభివృద్ది తప్ప, మరో ఆలోచన లేదు. నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దు అంటూ కామెంట్స్‌ చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement