Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Afghanistan Earthquake Live Updates Latest Telugu News1
శవాలదిబ్బగా అఫ్ఘనిస్తాన్‌!

భారీ భూకంపంతో అఫ్ఘనిస్తాన్‌ అతలాకుతలం అయ్యింది. ఇప్పటిదాకా 800 మందికి పైనే మరణించినట్లు అల్‌జజీరాతో పాటు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్‌ దానిని ధృవీకరించింది. భూకంపంతో వేల మంది గాయపడినట్లు(1500 మందికిపైనే) అక్కడి పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. శిథిలాల తొలగింపు సహాయక చర్యలు కొనసాగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1, 2025 రాత్రి(ఆదివారం 11.47గం. సమయంలో) సమయంలో హిందూ కుష్ పర్వత ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గంట వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంప కేంద్రం పాకిస్థాన్ సరిహద్దులోని నంగర్హార్‌ ప్రావిన్స్‌ జలాలాబాద్‌ సమీపంలో 10 కి.మీ లోతులో నమోదైనట్లు తెలుస్తోంది. #BREAKING : Afghanistan’s government spokesman Mawlawi Zabihullah Mujahid says the death toll now stands at 800, with 2,500 injured#Afghanistan #AfghanistanEarthquake #earthquake #afghanistanquake pic.twitter.com/Tx18Rv0xYd— upuknews (@upuknews1) September 1, 2025అఫ్గానిస్థాన్‌లోని కునార్‌, నోరిస్థాన్‌, నంగర్హార్‌ ప్రావిన్స్‌లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి జీవితం అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉంది. అసమర్థ తాలిబన్‌ ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా లేదు. ఈ సమయంలో కునార్‌ ప్రజలకు సాయం అత్యవసరం. అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలి. అవసరమైన ఆహారం అందించి.. ఆశ్రయం కల్పించాలి. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి అని వార్దక్‌ ప్రావిన్స్‌ మాజీ మేయర్‌ జరీఫా ఘఫ్పారీ ఓ పోస్టు పెట్టారు. ఘోర విపత్తు కారణంగా కునార్‌ ప్రావిన్స్‌ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. పలు కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్టులు పెడుతున్నారు.భూకంపం కారణంగా పలువురు మరణించారనే వార్త విని తాను చలించిపోయానని క్రికెటర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ ఓ పోస్టు చేశారు. బాధితుల కుటుంబం కోసం ప్రార్థిస్తున్నానని.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొండ ప్రాంతాల్లోని జనావాసాల్లో భూకంపం రావడంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు స్పష్టమవుతోంది. భారీ పరిమాణంలోని కొండ రాళ్లు దొర్లిపడడంతో.. సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు సమాచారం.🇦🇫 Report from #Afghanistan: More than 500 dead ‼️ and 1,000 injured ‼️ following the earthquake in the eastern part of the country https://t.co/T1zF4VkEw0— War & Political News (@Elly_bar_bkup) September 1, 2025 Deadly Earthquake in Afghanistan 🚨▪️ 622 dead▪️ 1,300+ injured▪️ Remote villages destroyedRescue teams struggle to reach survivors near Jalalabad.Afghanistan faces tragedy on top of conflict. 💔#Afghanistan #Earthquake pic.twitter.com/xSunHdB40A— Epoch - Global (@epochglobalnews) September 1, 2025మరోవైపు.. ఈ ప్రకంపనలు 350 కిలోమీటర్ల దూరంలోనూ ప్రభావం చూపించాయి. ఫలితంగా.. ఉత్తర భారతదేశం, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. అఫ్గనిస్తాన్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి, ముఖ్యంగా హిందూ కుష్ ప్రాంతం భౌగోళికంగా చురుకుగా ఉండటంతో ఇది సాధారణమని నిపుణులు చెబుతున్నారు.

MLC Kavitha Sensational Comments On harish rao2
కాళేశ్వరంపై బాంబ్‌ పేల్చిన కల్వకుంట్ల కవిత

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు,మాజీ మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరంపై కవిత బాంబ్‌ పేల్చారు. కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్‌రావుది మేజర్‌ పాత్ర లేదా? హరీష్‌ రావు,సంతోష్‌ వెనక సీఎం రేవంత్‌ ఉన్నారు. హరీష్‌ రావు,సంతోష్‌ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్‌ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది. ఇదంతా హరీష్‌ వల్లే జరిగింది. కేసీఆర్‌కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్‌ మీద విచారణ తర్వాత బీఆర్‌ఎస్‌ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు.

Cap Controversy At US Open: Who is Piotr Szczerek Tennis3
కుబేరుడి ‘చిల్లర’ చేష్టలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఆయనొక ప్రముఖ కంపెనీకి సీఈవో. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చిల్లర చేష్టలకు దిగాడు. ఓ చిన్నారి అపురూపంగా భావించిన కానుకను హఠాత్తుగా లాగేసుకున్నాడు. పాపం.. దాని కోసం ఆ చిన్నారి ఆయన్ని బతిమిలాడుకోవడమూ వీడియో రూపేణా ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది. దీంతో ఆ కుబేరుడిని నెటిజన్లు తెగ తిట్టిపోస్తున్నారు. యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో జరిగిన ఓ ఘటన.. నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలాండ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ కామిల్ మజ్చ్‌శాక్ (Kamil Majchrzak) తన గెలుపు అనంతరం అక్కడున్న అభిమానులతో సందడి చేశాడు. ఆ సమయంలో ఓ చిన్నపిల్లాడికి క్యాప్ ఇవ్వబోయాడు. అయితే.. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆ క్యాప్‌ను లాగేసుకుని తన పక్కనే ఉన్న మహిళ బ్యాగులో దాచేశాడు. ఆ పిల్లాడు ఆ క్యాప్‌ కోసం బతిమాలినా పట్టించుకోలేదు. పైగా తన చేతిలో ఉన్న పెన్నును మాత్రం ఆ పిల్లాడికి అప్పజెప్పాడు. దీంతో ఆ చిన్నారి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. I wonder if this douche canoe grown man at the U.S. Open is worried that he will be recognized after he snatched a hat away from the boy on his left? pic.twitter.com/Q48ATFDoT7— Brick Suit (@Brick_Suit) August 29, 2025దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్‌ అయ్యింది. ఆ చిన్నారి చేతుల్లోంచి క్యాప్‌ను లాగేసుకున్న వ్యక్తిని.. పోలాండ్‌కు చెందిన డ్రాగ్‌బ్రుక్ కంపెనీ CEO పియోటర్ షెరెక్ (Piotr Szczerek)గా గుర్తించారు. ఈ ఘటనతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మజ్చ్‌శాక్ స్పందనఈ వివాదంపై కామిల్ మజ్చ్‌శాక్ స్పందించాడు. సోషల్ మీడియా ద్వారా ఆ చిన్నపిల్లాడిని వెతికి.. అతనికి కొత్తగా సంతకం చేసిన క్యాప్‌తో పాటు ఇతర టెన్నిస్ గిఫ్ట్స్ కూడా అందించారు. ‘‘ఈ క్యాప్ గుర్తుందా?’’ అని మజ్చ్‌శాక్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.విమర్శల తరుణంలో.. షెరెక్ సోషల్ మీడియా ఖాతాలు డీయాక్టివేట్ అయినప్పటికీ.. ఆయన పేరుతో గోవర్క్‌ఫోరం(Gowork) నుంచి ఒక ప్రకటన వైరల్‌ అవుతోంది. లైఫ్‌ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్.. అనే తత్వాన్ని ప్రస్తావిస్తూ ‘ఇది కేవలం ఒక టోపీ మాత్రమే. అంత పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అలాగే, తనపై దూషణలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే అది ఆయన నుంచి వెలువడిన ప్రకటనేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.అయితే.. టోపీ వివాదం(Cap Controversy) దెబ్బకు షెరెస్‌ సీఈవోగా పని చేస్తున్న డ్రాగ్‌బ్రుక్ కంపెనీకి పెద్ద దెబ్బే పడింది. ఓ ఉద్యోగ రివ్యూ ఫోరంలో వేలాది మంది కంపెనీకి నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చారు. కంపెనీ సేవలను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చారు. దీంతో షేర్‌ వాల్యూ గణనీయంగా పడిపోయి.. కంపెనీకి భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అమెరికా ఆస్ట్రానమర్ కంపెనీ సీఈవో ఆండీ బైరోన్‌ అదే కంపెనీలో హెచ్‌ఆర్‌ విభాగంలో పని చేసే ఓ ఉద్యోగిణితో క్రిస్‌ మార్టిన్‌ కోల్డ్‌ప్లే షోలో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కంపెనీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనకు భారీ ప్యాకేజీ ఇచ్చి వదిలించుకుంది కంపెనీ. అయితే ఆ మహిళా ఉద్యోగిణిని మాత్రం లాంగ్‌​ లీవ్‌లో పంపించేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఎఫైర్‌ ఆయన వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించలేదు.

SC tells political parties to activate themselves over Bihar SIR4
‘సర్‌’పై నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు చేసిన స్సెషల్‌ ఇన్సిటివ్‌ రివిజన్‌(సర్‌)పై గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు(సోమవారం, సెప్టెంబర్‌ 1వ తేదీ) సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఓటర్ల ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించడానికి సీఈసీ విధించిన డెడ్‌లైన్‌ గడువు సెప్టెంబర్‌ 1 తేదీని పొడిగించాలంటూ బీహార్‌ రాజకీయ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు చేసిన ‘సర్‌’ నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. ‘సర్‌’ అంశానికి సంబంధించి గందరగోళ పరిస్థితులు చక్కబడాలంటే రాజకీయం పార్టీలు తమను తాము యాక్టివేట్‌ చేసుకుని సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించింది. అభ్యర్థనలు, ఫిర్యాదులకు డెడ్‌లైన్‌ అనేది అవసరం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అభ్యర్థనలకు సెప్టెంబర్‌1 వ తేదీ చివరి తేదీగా ఉన్నప్పటికీ క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, దిద్దుబాట్లను దాఖలు చేయడం వంటి అంశాలకు సంబంధించి ఈసీ నిర్దేశించిన డెడ్‌లైన్‌ ముగింపు తేదీ తర్వాత కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తమ ఉత్తర్వులో పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేకంగా డెడ్‌లైన్‌ పొడిగింపు తేదీ అంటూ ఏమీ అవసరం లేదని తెలిపింది. ఫలితంగా అభ్యంతరాలను యథావిధిగా స్వీకరిస్తామని కోర్టుకు ఈసీ హామీ ఇచ్చింది. నామినేషన్‌ చివరి తేదీ వరకూ కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని సుప్రీంకోర్టుకు సీఈసీ తెలిపింది. అదే సమయంలో పారా లీగల్‌ వాలంటీర్లను నియమించాలని బీహార్‌ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీకి కోర్టు ఆదేశించింది. ఓటర్లకు సహాయం చేసే క్రమంలో పారా లీగల్‌ వాలంటీర్లను నియమించడమే సరైనదిగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పారా లీగల్‌ వాలంటీర్లు ఇచ్చే రిపోర్ట్‌ను జిల్లా స్థాయి జడ్జిలు సమీక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులకు ఆధార్‌ను ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా ఉపయోగించవచ్చని, కానీ అది పౌరసత్వం నిర్ధారణకు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, బీహార్‌లో ‘సర్‌’ తొలగించిన 65లక్షల ఓట్లతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. దీన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వం కుట్రగా అభివర్ణించింది. ఇది ఎన్నికల కమిషన్‌తో కలిసి కేంద్రం చేస్తున్న ఓట్‌ చోరీ అంశంగా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓట్‌ అధికార్‌ యాత్ర పేరుతో ఇప్పటికే బీహార్‌లో రాహుల్‌ గాంధీ యాత్ర చేశారు. మరొకసారి ఇదే అంశానికి సంబంధించి ఇండియా కూటమి పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమైంది. నేడు ఓట్‌ అధికార్‌ యాత్ర పాట్నాలో ప్రారంభమైంది. ‘సర్‌’లో ఎన్నో అవకతవకలు ఉన్నాయని, దానిని తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.

Chinese Humanoid Robot Opinion About India At SCO Summit5
భారత్‌పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం

చైనాలోని తియాన్‌జిన్‌లో షాంఘై సహకార సదస్సు (SCO) జరుగుతోంది. ఈ సదస్సులో రిసెప్షన్ వద్ద చైనీస్ హ్యుమానాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడి అతిధులు అడిగే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెబుతూ ఎంతగానో ఆకట్టుకుంది.ఎస్‌సీవో సదస్సులో హ్యుమానాయిడ్ రోబో సమాధానాలు చెప్పడానికి సిద్ధం కావడానికి ముందు.. "నేను ఈ రోజు నా గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాను. నన్ను ప్రశ్నలు అడుగుతున్నందుకు ధన్యవాదాలు'' అని చెప్పింది.భారతదేశంపై నీ ఆలోచలను చెప్పమని అడిగినప్పుడు.. నేను ఒక ఏఐ రోబోను. దేశాలు, రాజకీయ పరిణాలను గురించి నేను చెప్పలేనని స్పష్టం చేసింది. అయితే ఎస్‌సీవో సదస్సుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇది ఇంగ్లీష్, చైనీస్, రష్యన్ భాషలు మాట్లాడుతుంది. View this post on Instagram A post shared by Firstpost (@firstpost)

Annamalai Reconciled with AIADMK General Secretary EPS6
రాజీ కుదిరింది.. ఎన్డీయే తమిళనాడు సీఎం అభ్యర్థిగా ఆయనే!

తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నన్ అన్నామలై, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తమ మధ్య విబేధాలను పక్కనపెట్టి ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి ఒకే వేదికపై సందడి చేయడమే కాదు.. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపైనా స్పష్టత ఇచ్చేశారు. గతంలో ఈపీఎస్‌ మీద అన్నామలై ఏ స్థాయిలో విరుచుకుపడిందో తెలిసిందే. ‘‘పళనిస్వామి ఓ తెలివితక్కువోడు’’.. అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారాయన. దీనికి కౌంటర్‌గా ‘‘అన్నామలై బుద్ధిహీనుడని, ఆస్పత్రిలో చేర్పించాలి’’ అని ఈపీఎస్‌ వర్గం కౌంటర్‌ ఇచ్చింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఏ ఎన్డీయే మీటింగ్‌లోనూ కలిసి మెలిగినట్లు కనిపించేది కూడా కాదు. అలాంటిది.. శనివారం చెన్నైలో జరిగిన జీకే మూపనార్ వర్ధంతి కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థి ఎడపాడి పళనిస్వామి ఇప్పుడు మాట్లాడారు అంటూ అన్నామలై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘2026లో మార్పు రావాలి, పేదల అభివృద్ధికి ప్రభుత్వం పని చేయాలి. ఎన్డీయే సీఎం అభ్యర్థిగా ఈపీఎస్‌ ఉన్నారు’’ అని అన్నారు. దీంతో వీళ్ల రాజకీయ ఐక్యతపై చర్చకు దారి తీసింది. పళనిస్వామి (EPS), అన్నామలై మధ్య విభేదాలు తమిళనాడు ఎన్డీయే కూటమిలో రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపించాయి. వ్యక్తిగత విమర్శలతో పాటు అన్నాడీఎంకే అవసరం ఎన్డీయేకు లేదన్నట్లుగా అన్నామలై వ్యవహరించారు. పైగా సీఎం అభ్యర్థిగా ఈపీఎస్‌ వర్గం చేసిన ప్రకటనను ఖండించారు. ఈ తీరుతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. అయితే.. ఈ రాజకీయంతో ఈపీఎస్‌ వర్గం బలపడగా.. బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో.. అన్నామలై వైఖరినే మార్చాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. అందుకే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహం మార్చి.. ఈపీఎస్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అన్నామలై కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ EPS కు మద్దతు ప్రకటించినట్లు ఆయన మాటల్లోనే తెలుస్తోంది.వీళ్ల కలయికపై ఆదివారం అన్నామలైకి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘పార్టీ చెప్పింది, ప్రధాని మోదీ చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహించడం కేడర్‌గా నా బాధ్యత. అది అర్థం చేసుకోండి’’ అని అన్నామలై వ్యాఖ్యానించారు. గత విమర్శలపై ప్రశ్నించగా.. వ్యక్తిగత అభిప్రాయాలు వేరే. పార్టీ కేడర్‌గా క్రమశిక్షణ పాటించాలి కదా. ఉదాహరణకు డీఎంకే మంత్రిపై నాకు ఎంత కోపం ఉన్నా.. వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని నేను గౌరవిస్తాను. ఇది అంతే. పార్టీ చెప్పినట్లే అన్నామలై వింటాడు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.అన్నామలై 2011 బ్యాచ్‌కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన పోలీసాధికారిగా సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. ‘సింగం’గా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది.తాజా పరిణామం.. అన్నాడీఎంకే బీజేపీల మధ్య విభేదాలు తొలిగాయనడానికి సంకేతంగా నిలిచింది. 2026 ఎన్నికల కోసం ఈపీఎస్‌ నాయకత్వంలో కూటమి ముందుకు సాగుతుందన్న సంకేతాలు స్పష్టంగా అందిస్తోంది.

KTR Satyameva Jayate Tweet After Revanth Govt Kaleswaram CBI Probe7
‘‘మిస్టర్‌ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?’’

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ద్వారా విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకట ఆధారంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్‌పై సెటైర్లు సంధించారు. సత్యమేవ జయతే అం‍టూ కేటీఆర్‌ ఓ ఆసక్తికర ట్వీట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అందులో.. ‘‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కరెన్సీ మేనేజర్‌(CM) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్‌గా సీబీఐని గతంలో రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. మిస్టర్‌ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అయితే.. The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBIThe very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJPHave you any clue Mr. Gandhi on what your CM is doing? Bring it on, whatever it… pic.twitter.com/3vBYbf5Atd— KTR (@KTRBRS) September 1, 2025ఎన్ని కుట్రలు చేసినా సరే.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని, న్యాయయ వ్యవస్థ, ప్రజలపై మాకు నమ్మకం ఉంది అని ట్వీట్‌లో పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందని చేసిన ట్వీట్‌ తాలుకా స్క్రీన్‌ షాట్‌ను కేటీఆర్‌ తన ట్వీట్‌లో పోస్ట్‌ చేశారు. సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలపై టార్గెట్ చేస్తున్నారని గతంలో రాహుల్‌ గాంధీ పలుమార్లు ఆరోపించారు. తద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తీవ్రవ్యాఖ్యలే చేశారాయన.

Womens World Cup 2025 winners to get higher prize money compared to Men’s 2023 team8
వ‌న్డే వరల్డ్ కప్‌కు రికార్డుస్థాయి ప్రైజ్‌మనీ.. ఎన్ని కోట్లంటే?

ఐసీసీ మ‌హిళల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2025కు స‌మయం అస‌న్న‌మ‌వుతోంది. సెప్టెంబ‌ర్ 30 నుంచి భార‌త్ వేదిక‌గా ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. అయితే పాకిస్తాన్ మాత్రం త‌మ మ్యాచ్‌ల‌ని శ్రీలంక వేదిక‌గా ఆడనుంది. ఇక ఇది ఇలా ఉండ‌గా.. తాజాగా ఈ మెగా ఈవెంట్ కోసం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ICC) ప్రైజ్‌మ‌నీ ప్ర‌క‌టించింది.మొత్తం ప్రైజ్‌ మనీని రికార్డు స్థాయిలో 13.88 మిలియన్ డాలర్లు(భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 122 కోట్లు)గా ఖరారు చేసింది. న్యూజిలాండ్ వేదిక‌గా జరిగిన చివ‌రి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌(2022)తో పోలిస్తే ఈ ప్రైజ్‌మనీ 300 శాతం అధికం కావ‌డం గ‌మ‌నార్హం. అప్పుడు ప్రైజ్‌మ‌నీ కేవ‌లం రూ. 30 కోట్ల మాత్ర‌మే. అదేవిధంగా పురుషుల వన్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2023 కంటే అధికం కావ‌డం విశేషం. భార‌త్ వేదిక‌గా జ‌రిగిన ఈ మెగా టోర్నీకి ఐసీసీ రూ. 88 కోట్లు కేటాయించింది. ఇప్పుడు మ‌హిళ‌ల ప్రైజ్‌మ‌నీ పురుషుల టోర్నీని మించిపోయింది.విజేత‌కు ఎంతంటే?ఇక ఈ మెగా టోర్నీ విజేత‌గా నిలిచే జ‌ట్టుకు 4.48 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 కోట్లు) న‌గ‌దు బ‌హుమ‌తి అంద‌నుంది. ఇది 2023 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ విజేత ఆస్ట్రేలియా అందుకున్న దానికంటే 239 శాతం ఎక్కువ. ఆ స‌మ‌యంలో ఆసీస్ కేవ‌లం రూ. 11 కోట్లు మాత్ర‌మే బ‌హుమ‌తిగా ల‌భించింది.ఈ ఏడాది మహిళల ప్ర‌పంచ‌క‌ప్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచే జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 19 కోట్లు) లభిస్తాయి. సెమీ ఫైన‌లిస్ట్‌లు ఒక్కొక్కరికి 1.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 9 కోట్లు) ద‌క్క‌నుంది. అంతేకాకుండా ప్ర‌తీ గ్రూపు మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించిన జట్టుకు సైతం ఐసీసీ ప్రైజ్‌మ‌నీ కేటాయించింది. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు 34,314 డాలర్లు (దాదాపు రూ. 30 లక్షలు) అందనుంది. అదేవిధంగా ఐదు, ఆరు స్ధానాల్లో నిలిచే జ‌ట్లకు 700,000 డాల‌ర్లు (సుమారు రూ. 6 కోట్లు), ఏడు ఎనిమిది స్ధానాల్లో నిలిచే జ‌ట్ల‌కు 280,000 డాల‌ర్లు (సుమారు రూ. 2.5 కోట్లు) అందనుంది.ఇక ఈ ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొన్నందుకు ప్ర‌తీ జ‌ట్టుకు 2,50,000 డాలర్లు (సుమారు రూ. 2 కోట్లు) ప్రైజ్ మనీ లభించ‌నుంది. మహిళల క్రికెట్ ప్రయాణంలో ఇది ఒక చారిత్రక మైలురాయి అని ఐసీసీ చైర్మెన్ జైషా ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.చదవండి: IPL 2026: కేకేఆర్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్‌..!?

Varudu Kalyani Asks Questions Pawan Lokesh Over Sugali Preethi Case9
జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా?: వరుదు కల్యాణి

సుగాలి ప్రీతి కేసులో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధికారంలో ఉండికూడా ఏం చేయలేకపోతున్నారని.. మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ.. ‘‘2017 ఆగస్టు 19వ తేదీన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగాయి. చంద్రబాబు హయాంలోనే ఈ ఘటన జరిగింది. న్యాయం జరగలేదు సరికదా.. పరిహారం కూడా అందలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, వైఎస్ జగన్ హయాంలో చట్టపరమైన న్యాయం చేశారు... 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు. రుషికొండ భవనాలు చూడానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్‌కి.. సుగాలి ప్రీతి కేసు కనిపించ లేదా?. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసు మీద పెట్టిన శ్రద్ద.. ఈ గిరిజన బాలిక గురించి పట్టదా?. న్యాయం కోసం నిలదీస్తే.. నా చేతిలో ఏం లేదని పవన్‌ చెప్పడం అసలు ఏంటి?. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లాక.. రాజ్యాంగం పట్టుకుని లోకేష్‌ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా?. నారా లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా? మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చంద్రబాబు.. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఈ కేసును కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం, పవన్‌ కల్యాణ్‌ వాడుకున్నారు. పవన్‌ మాటలకు చేతలకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది. న్యాయం సంగతి పక్కనపెడితే.. జనసేన ఎమ్మెల్యేలు తిరిగి ఆమె కుటుంబం పైనే ఎదురుదాడికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం విడనాడి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్‌, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది అని వరుదు కళ్యాణి అన్నారు.ఇదీ చదవండి: వామ్మో.. చింతమనేని!

BJP MP Laxman Satirical Comments On CM Revanth10
రేవంత్‌.. కొండను తవ్వి ఎలుకను పట్టారా?: లక్ష్మణ్‌ సెటైర్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్‌. ఇదే సమయంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్‌ కమిషన్‌ వేశారా? అని ప్రశ్నించారు. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు. కాళేశ్వరం అవినీతి రుజువులన్నీ సీబీఐకి అప్పగించాలి. 22 నెలల తర్వాత రేవంత్‌కు కనువిప్పు కలిగింది. ఆరు నెలల్లో నిగ్గు తేల్చుతామని అన్నవారు ఎందుకు కాలయాపన చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్‌ కమిషన్‌ వేశారా?. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు. ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు?. బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్‌ పార్టీ డీఎన్‌ఏలోనే ఉంది. నెహ్రు నుంచి రాహుల్‌ గాంధీ వరకు కాంగ్రెస్‌ నేతలు బీసీలను మోసం చేశారు. కాలయాపన కొరకే ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు.సీబీఐకి అన్ని ఆధారాలు ఇవ్వాలి. లేదంటే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది. ప్రజలకు ఉన్న అనుమానాలు నివృతి చేయాలి. కాంగ్రెస్ బీసీ బిల్లుపై మొదటి నుంచి ద్వంద్వ వైఖరి పాటిస్తుంది. ఒక్కసారేమో ఆర్డినెన్సు అన్నారు. ఇంకోసారి ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి ధర్నా చేశారు. అసలు న్యాయపరమైన చిక్కులకు మీరు తీసుకున్న చర్యలు ఏంటి?. నెపంతో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. బీసీల కొరకు సర్వే చేశారా? ముస్లిం కొరకు సర్వే చేశారా?. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది. బిల్లు పెట్టడమే కాదు బిల్లు పాస్ అయ్యేలా సీఎం రేవంత్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. బీజేపీ బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది’ అని చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement