ప్రధాన వార్తలు

శవాలదిబ్బగా అఫ్ఘనిస్తాన్!
భారీ భూకంపంతో అఫ్ఘనిస్తాన్ అతలాకుతలం అయ్యింది. ఇప్పటిదాకా 800 మందికి పైనే మరణించినట్లు అల్జజీరాతో పాటు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ దానిని ధృవీకరించింది. భూకంపంతో వేల మంది గాయపడినట్లు(1500 మందికిపైనే) అక్కడి పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. శిథిలాల తొలగింపు సహాయక చర్యలు కొనసాగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1, 2025 రాత్రి(ఆదివారం 11.47గం. సమయంలో) సమయంలో హిందూ కుష్ పర్వత ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గంట వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంప కేంద్రం పాకిస్థాన్ సరిహద్దులోని నంగర్హార్ ప్రావిన్స్ జలాలాబాద్ సమీపంలో 10 కి.మీ లోతులో నమోదైనట్లు తెలుస్తోంది. #BREAKING : Afghanistan’s government spokesman Mawlawi Zabihullah Mujahid says the death toll now stands at 800, with 2,500 injured#Afghanistan #AfghanistanEarthquake #earthquake #afghanistanquake pic.twitter.com/Tx18Rv0xYd— upuknews (@upuknews1) September 1, 2025అఫ్గానిస్థాన్లోని కునార్, నోరిస్థాన్, నంగర్హార్ ప్రావిన్స్లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి జీవితం అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉంది. అసమర్థ తాలిబన్ ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా లేదు. ఈ సమయంలో కునార్ ప్రజలకు సాయం అత్యవసరం. అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలి. అవసరమైన ఆహారం అందించి.. ఆశ్రయం కల్పించాలి. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి అని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ ఓ పోస్టు పెట్టారు. ఘోర విపత్తు కారణంగా కునార్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. పలు కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్టులు పెడుతున్నారు.భూకంపం కారణంగా పలువురు మరణించారనే వార్త విని తాను చలించిపోయానని క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఓ పోస్టు చేశారు. బాధితుల కుటుంబం కోసం ప్రార్థిస్తున్నానని.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొండ ప్రాంతాల్లోని జనావాసాల్లో భూకంపం రావడంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు స్పష్టమవుతోంది. భారీ పరిమాణంలోని కొండ రాళ్లు దొర్లిపడడంతో.. సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు సమాచారం.🇦🇫 Report from #Afghanistan: More than 500 dead ‼️ and 1,000 injured ‼️ following the earthquake in the eastern part of the country https://t.co/T1zF4VkEw0— War & Political News (@Elly_bar_bkup) September 1, 2025 Deadly Earthquake in Afghanistan 🚨▪️ 622 dead▪️ 1,300+ injured▪️ Remote villages destroyedRescue teams struggle to reach survivors near Jalalabad.Afghanistan faces tragedy on top of conflict. 💔#Afghanistan #Earthquake pic.twitter.com/xSunHdB40A— Epoch - Global (@epochglobalnews) September 1, 2025మరోవైపు.. ఈ ప్రకంపనలు 350 కిలోమీటర్ల దూరంలోనూ ప్రభావం చూపించాయి. ఫలితంగా.. ఉత్తర భారతదేశం, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. అఫ్గనిస్తాన్లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి, ముఖ్యంగా హిందూ కుష్ ప్రాంతం భౌగోళికంగా చురుకుగా ఉండటంతో ఇది సాధారణమని నిపుణులు చెబుతున్నారు.

కాళేశ్వరంపై బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ముఖ్యనేతలు,మాజీ మంత్రి హరీష్రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరంపై కవిత బాంబ్ పేల్చారు. కేసీఆర్పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్రావుది మేజర్ పాత్ర లేదా? హరీష్ రావు,సంతోష్ వెనక సీఎం రేవంత్ ఉన్నారు. హరీష్ రావు,సంతోష్ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది. ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్ మీద విచారణ తర్వాత బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు.

కుబేరుడి ‘చిల్లర’ చేష్టలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
ఆయనొక ప్రముఖ కంపెనీకి సీఈవో. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చిల్లర చేష్టలకు దిగాడు. ఓ చిన్నారి అపురూపంగా భావించిన కానుకను హఠాత్తుగా లాగేసుకున్నాడు. పాపం.. దాని కోసం ఆ చిన్నారి ఆయన్ని బతిమిలాడుకోవడమూ వీడియో రూపేణా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. దీంతో ఆ కుబేరుడిని నెటిజన్లు తెగ తిట్టిపోస్తున్నారు. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో జరిగిన ఓ ఘటన.. నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలాండ్ టెన్నిస్ ప్లేయర్ కామిల్ మజ్చ్శాక్ (Kamil Majchrzak) తన గెలుపు అనంతరం అక్కడున్న అభిమానులతో సందడి చేశాడు. ఆ సమయంలో ఓ చిన్నపిల్లాడికి క్యాప్ ఇవ్వబోయాడు. అయితే.. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆ క్యాప్ను లాగేసుకుని తన పక్కనే ఉన్న మహిళ బ్యాగులో దాచేశాడు. ఆ పిల్లాడు ఆ క్యాప్ కోసం బతిమాలినా పట్టించుకోలేదు. పైగా తన చేతిలో ఉన్న పెన్నును మాత్రం ఆ పిల్లాడికి అప్పజెప్పాడు. దీంతో ఆ చిన్నారి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. I wonder if this douche canoe grown man at the U.S. Open is worried that he will be recognized after he snatched a hat away from the boy on his left? pic.twitter.com/Q48ATFDoT7— Brick Suit (@Brick_Suit) August 29, 2025దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ చిన్నారి చేతుల్లోంచి క్యాప్ను లాగేసుకున్న వ్యక్తిని.. పోలాండ్కు చెందిన డ్రాగ్బ్రుక్ కంపెనీ CEO పియోటర్ షెరెక్ (Piotr Szczerek)గా గుర్తించారు. ఈ ఘటనతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మజ్చ్శాక్ స్పందనఈ వివాదంపై కామిల్ మజ్చ్శాక్ స్పందించాడు. సోషల్ మీడియా ద్వారా ఆ చిన్నపిల్లాడిని వెతికి.. అతనికి కొత్తగా సంతకం చేసిన క్యాప్తో పాటు ఇతర టెన్నిస్ గిఫ్ట్స్ కూడా అందించారు. ‘‘ఈ క్యాప్ గుర్తుందా?’’ అని మజ్చ్శాక్ తన పోస్ట్లో పేర్కొన్నారు.విమర్శల తరుణంలో.. షెరెక్ సోషల్ మీడియా ఖాతాలు డీయాక్టివేట్ అయినప్పటికీ.. ఆయన పేరుతో గోవర్క్ఫోరం(Gowork) నుంచి ఒక ప్రకటన వైరల్ అవుతోంది. లైఫ్ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్.. అనే తత్వాన్ని ప్రస్తావిస్తూ ‘ఇది కేవలం ఒక టోపీ మాత్రమే. అంత పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అలాగే, తనపై దూషణలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే అది ఆయన నుంచి వెలువడిన ప్రకటనేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.అయితే.. టోపీ వివాదం(Cap Controversy) దెబ్బకు షెరెస్ సీఈవోగా పని చేస్తున్న డ్రాగ్బ్రుక్ కంపెనీకి పెద్ద దెబ్బే పడింది. ఓ ఉద్యోగ రివ్యూ ఫోరంలో వేలాది మంది కంపెనీకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. కంపెనీ సేవలను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చారు. దీంతో షేర్ వాల్యూ గణనీయంగా పడిపోయి.. కంపెనీకి భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అమెరికా ఆస్ట్రానమర్ కంపెనీ సీఈవో ఆండీ బైరోన్ అదే కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పని చేసే ఓ ఉద్యోగిణితో క్రిస్ మార్టిన్ కోల్డ్ప్లే షోలో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కంపెనీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనకు భారీ ప్యాకేజీ ఇచ్చి వదిలించుకుంది కంపెనీ. అయితే ఆ మహిళా ఉద్యోగిణిని మాత్రం లాంగ్ లీవ్లో పంపించేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఎఫైర్ ఆయన వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించలేదు.

‘సర్’పై నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బీహార్లో ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్సిటివ్ రివిజన్(సర్)పై గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 1వ తేదీ) సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఓటర్ల ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించడానికి సీఈసీ విధించిన డెడ్లైన్ గడువు సెప్టెంబర్ 1 తేదీని పొడిగించాలంటూ బీహార్ రాజకీయ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు చేసిన ‘సర్’ నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. ‘సర్’ అంశానికి సంబంధించి గందరగోళ పరిస్థితులు చక్కబడాలంటే రాజకీయం పార్టీలు తమను తాము యాక్టివేట్ చేసుకుని సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించింది. అభ్యర్థనలు, ఫిర్యాదులకు డెడ్లైన్ అనేది అవసరం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అభ్యర్థనలకు సెప్టెంబర్1 వ తేదీ చివరి తేదీగా ఉన్నప్పటికీ క్లెయిమ్లు, అభ్యంతరాలు, దిద్దుబాట్లను దాఖలు చేయడం వంటి అంశాలకు సంబంధించి ఈసీ నిర్దేశించిన డెడ్లైన్ ముగింపు తేదీ తర్వాత కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తమ ఉత్తర్వులో పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేకంగా డెడ్లైన్ పొడిగింపు తేదీ అంటూ ఏమీ అవసరం లేదని తెలిపింది. ఫలితంగా అభ్యంతరాలను యథావిధిగా స్వీకరిస్తామని కోర్టుకు ఈసీ హామీ ఇచ్చింది. నామినేషన్ చివరి తేదీ వరకూ కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని సుప్రీంకోర్టుకు సీఈసీ తెలిపింది. అదే సమయంలో పారా లీగల్ వాలంటీర్లను నియమించాలని బీహార్ లీగల్ సర్వీసెస్ అధారిటీకి కోర్టు ఆదేశించింది. ఓటర్లకు సహాయం చేసే క్రమంలో పారా లీగల్ వాలంటీర్లను నియమించడమే సరైనదిగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పారా లీగల్ వాలంటీర్లు ఇచ్చే రిపోర్ట్ను జిల్లా స్థాయి జడ్జిలు సమీక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులకు ఆధార్ను ఐడెంటిటీ ఫ్రూఫ్గా ఉపయోగించవచ్చని, కానీ అది పౌరసత్వం నిర్ధారణకు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, బీహార్లో ‘సర్’ తొలగించిన 65లక్షల ఓట్లతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. దీన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం కుట్రగా అభివర్ణించింది. ఇది ఎన్నికల కమిషన్తో కలిసి కేంద్రం చేస్తున్న ఓట్ చోరీ అంశంగా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓట్ అధికార్ యాత్ర పేరుతో ఇప్పటికే బీహార్లో రాహుల్ గాంధీ యాత్ర చేశారు. మరొకసారి ఇదే అంశానికి సంబంధించి ఇండియా కూటమి పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమైంది. నేడు ఓట్ అధికార్ యాత్ర పాట్నాలో ప్రారంభమైంది. ‘సర్’లో ఎన్నో అవకతవకలు ఉన్నాయని, దానిని తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

భారత్పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం
చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సదస్సు (SCO) జరుగుతోంది. ఈ సదస్సులో రిసెప్షన్ వద్ద చైనీస్ హ్యుమానాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడి అతిధులు అడిగే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెబుతూ ఎంతగానో ఆకట్టుకుంది.ఎస్సీవో సదస్సులో హ్యుమానాయిడ్ రోబో సమాధానాలు చెప్పడానికి సిద్ధం కావడానికి ముందు.. "నేను ఈ రోజు నా గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాను. నన్ను ప్రశ్నలు అడుగుతున్నందుకు ధన్యవాదాలు'' అని చెప్పింది.భారతదేశంపై నీ ఆలోచలను చెప్పమని అడిగినప్పుడు.. నేను ఒక ఏఐ రోబోను. దేశాలు, రాజకీయ పరిణాలను గురించి నేను చెప్పలేనని స్పష్టం చేసింది. అయితే ఎస్సీవో సదస్సుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇది ఇంగ్లీష్, చైనీస్, రష్యన్ భాషలు మాట్లాడుతుంది. View this post on Instagram A post shared by Firstpost (@firstpost)

రాజీ కుదిరింది.. ఎన్డీయే తమిళనాడు సీఎం అభ్యర్థిగా ఆయనే!
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నన్ అన్నామలై, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తమ మధ్య విబేధాలను పక్కనపెట్టి ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి ఒకే వేదికపై సందడి చేయడమే కాదు.. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపైనా స్పష్టత ఇచ్చేశారు. గతంలో ఈపీఎస్ మీద అన్నామలై ఏ స్థాయిలో విరుచుకుపడిందో తెలిసిందే. ‘‘పళనిస్వామి ఓ తెలివితక్కువోడు’’.. అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారాయన. దీనికి కౌంటర్గా ‘‘అన్నామలై బుద్ధిహీనుడని, ఆస్పత్రిలో చేర్పించాలి’’ అని ఈపీఎస్ వర్గం కౌంటర్ ఇచ్చింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఏ ఎన్డీయే మీటింగ్లోనూ కలిసి మెలిగినట్లు కనిపించేది కూడా కాదు. అలాంటిది.. శనివారం చెన్నైలో జరిగిన జీకే మూపనార్ వర్ధంతి కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థి ఎడపాడి పళనిస్వామి ఇప్పుడు మాట్లాడారు అంటూ అన్నామలై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘2026లో మార్పు రావాలి, పేదల అభివృద్ధికి ప్రభుత్వం పని చేయాలి. ఎన్డీయే సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నారు’’ అని అన్నారు. దీంతో వీళ్ల రాజకీయ ఐక్యతపై చర్చకు దారి తీసింది. పళనిస్వామి (EPS), అన్నామలై మధ్య విభేదాలు తమిళనాడు ఎన్డీయే కూటమిలో రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపించాయి. వ్యక్తిగత విమర్శలతో పాటు అన్నాడీఎంకే అవసరం ఎన్డీయేకు లేదన్నట్లుగా అన్నామలై వ్యవహరించారు. పైగా సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ వర్గం చేసిన ప్రకటనను ఖండించారు. ఈ తీరుతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. అయితే.. ఈ రాజకీయంతో ఈపీఎస్ వర్గం బలపడగా.. బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో.. అన్నామలై వైఖరినే మార్చాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. అందుకే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహం మార్చి.. ఈపీఎస్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అన్నామలై కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ EPS కు మద్దతు ప్రకటించినట్లు ఆయన మాటల్లోనే తెలుస్తోంది.వీళ్ల కలయికపై ఆదివారం అన్నామలైకి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘పార్టీ చెప్పింది, ప్రధాని మోదీ చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహించడం కేడర్గా నా బాధ్యత. అది అర్థం చేసుకోండి’’ అని అన్నామలై వ్యాఖ్యానించారు. గత విమర్శలపై ప్రశ్నించగా.. వ్యక్తిగత అభిప్రాయాలు వేరే. పార్టీ కేడర్గా క్రమశిక్షణ పాటించాలి కదా. ఉదాహరణకు డీఎంకే మంత్రిపై నాకు ఎంత కోపం ఉన్నా.. వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని నేను గౌరవిస్తాను. ఇది అంతే. పార్టీ చెప్పినట్లే అన్నామలై వింటాడు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.అన్నామలై 2011 బ్యాచ్కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన పోలీసాధికారిగా సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. ‘సింగం’గా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది.తాజా పరిణామం.. అన్నాడీఎంకే బీజేపీల మధ్య విభేదాలు తొలిగాయనడానికి సంకేతంగా నిలిచింది. 2026 ఎన్నికల కోసం ఈపీఎస్ నాయకత్వంలో కూటమి ముందుకు సాగుతుందన్న సంకేతాలు స్పష్టంగా అందిస్తోంది.

‘‘మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?’’
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ద్వారా విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకట ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్పై సెటైర్లు సంధించారు. సత్యమేవ జయతే అంటూ కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో.. ‘‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కరెన్సీ మేనేజర్(CM) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్గా సీబీఐని గతంలో రాహుల్ గాంధీ అభివర్ణించారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే.. The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBIThe very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJPHave you any clue Mr. Gandhi on what your CM is doing? Bring it on, whatever it… pic.twitter.com/3vBYbf5Atd— KTR (@KTRBRS) September 1, 2025ఎన్ని కుట్రలు చేసినా సరే.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని, న్యాయయ వ్యవస్థ, ప్రజలపై మాకు నమ్మకం ఉంది అని ట్వీట్లో పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందని చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్ను కేటీఆర్ తన ట్వీట్లో పోస్ట్ చేశారు. సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలపై టార్గెట్ చేస్తున్నారని గతంలో రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించారు. తద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తీవ్రవ్యాఖ్యలే చేశారాయన.

వన్డే వరల్డ్ కప్కు రికార్డుస్థాయి ప్రైజ్మనీ.. ఎన్ని కోట్లంటే?
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025కు సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 30 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. అయితే పాకిస్తాన్ మాత్రం తమ మ్యాచ్లని శ్రీలంక వేదికగా ఆడనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రైజ్మనీ ప్రకటించింది.మొత్తం ప్రైజ్ మనీని రికార్డు స్థాయిలో 13.88 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 122 కోట్లు)గా ఖరారు చేసింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన చివరి వన్డే ప్రపంచకప్(2022)తో పోలిస్తే ఈ ప్రైజ్మనీ 300 శాతం అధికం కావడం గమనార్హం. అప్పుడు ప్రైజ్మనీ కేవలం రూ. 30 కోట్ల మాత్రమే. అదేవిధంగా పురుషుల వన్డే వరల్డ్కప్-2023 కంటే అధికం కావడం విశేషం. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీకి ఐసీసీ రూ. 88 కోట్లు కేటాయించింది. ఇప్పుడు మహిళల ప్రైజ్మనీ పురుషుల టోర్నీని మించిపోయింది.విజేతకు ఎంతంటే?ఇక ఈ మెగా టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు 4.48 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 కోట్లు) నగదు బహుమతి అందనుంది. ఇది 2023 వరల్డ్కప్ విజేత ఆస్ట్రేలియా అందుకున్న దానికంటే 239 శాతం ఎక్కువ. ఆ సమయంలో ఆసీస్ కేవలం రూ. 11 కోట్లు మాత్రమే బహుమతిగా లభించింది.ఈ ఏడాది మహిళల ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచే జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 19 కోట్లు) లభిస్తాయి. సెమీ ఫైనలిస్ట్లు ఒక్కొక్కరికి 1.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 9 కోట్లు) దక్కనుంది. అంతేకాకుండా ప్రతీ గ్రూపు మ్యాచ్లోనూ విజయం సాధించిన జట్టుకు సైతం ఐసీసీ ప్రైజ్మనీ కేటాయించింది. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్కు 34,314 డాలర్లు (దాదాపు రూ. 30 లక్షలు) అందనుంది. అదేవిధంగా ఐదు, ఆరు స్ధానాల్లో నిలిచే జట్లకు 700,000 డాలర్లు (సుమారు రూ. 6 కోట్లు), ఏడు ఎనిమిది స్ధానాల్లో నిలిచే జట్లకు 280,000 డాలర్లు (సుమారు రూ. 2.5 కోట్లు) అందనుంది.ఇక ఈ ఈ మెగా ఈవెంట్లో పాల్గొన్నందుకు ప్రతీ జట్టుకు 2,50,000 డాలర్లు (సుమారు రూ. 2 కోట్లు) ప్రైజ్ మనీ లభించనుంది. మహిళల క్రికెట్ ప్రయాణంలో ఇది ఒక చారిత్రక మైలురాయి అని ఐసీసీ చైర్మెన్ జైషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.చదవండి: IPL 2026: కేకేఆర్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్..!?

జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా?: వరుదు కల్యాణి
సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండికూడా ఏం చేయలేకపోతున్నారని.. మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ.. ‘‘2017 ఆగస్టు 19వ తేదీన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగాయి. చంద్రబాబు హయాంలోనే ఈ ఘటన జరిగింది. న్యాయం జరగలేదు సరికదా.. పరిహారం కూడా అందలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, వైఎస్ జగన్ హయాంలో చట్టపరమైన న్యాయం చేశారు... 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు. రుషికొండ భవనాలు చూడానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్కి.. సుగాలి ప్రీతి కేసు కనిపించ లేదా?. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసు మీద పెట్టిన శ్రద్ద.. ఈ గిరిజన బాలిక గురించి పట్టదా?. న్యాయం కోసం నిలదీస్తే.. నా చేతిలో ఏం లేదని పవన్ చెప్పడం అసలు ఏంటి?. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లాక.. రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా?. నారా లోకేష్ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా? మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చంద్రబాబు.. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఈ కేసును కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్ వాడుకున్నారు. పవన్ మాటలకు చేతలకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది. న్యాయం సంగతి పక్కనపెడితే.. జనసేన ఎమ్మెల్యేలు తిరిగి ఆమె కుటుంబం పైనే ఎదురుదాడికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం విడనాడి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది అని వరుదు కళ్యాణి అన్నారు.ఇదీ చదవండి: వామ్మో.. చింతమనేని!

రేవంత్.. కొండను తవ్వి ఎలుకను పట్టారా?: లక్ష్మణ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ బిల్లుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్. ఇదే సమయంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా? అని ప్రశ్నించారు. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు. కాళేశ్వరం అవినీతి రుజువులన్నీ సీబీఐకి అప్పగించాలి. 22 నెలల తర్వాత రేవంత్కు కనువిప్పు కలిగింది. ఆరు నెలల్లో నిగ్గు తేల్చుతామని అన్నవారు ఎందుకు కాలయాపన చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా?. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ది లేదు. ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు?. బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉంది. నెహ్రు నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు బీసీలను మోసం చేశారు. కాలయాపన కొరకే ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు.సీబీఐకి అన్ని ఆధారాలు ఇవ్వాలి. లేదంటే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుంది. ప్రజలకు ఉన్న అనుమానాలు నివృతి చేయాలి. కాంగ్రెస్ బీసీ బిల్లుపై మొదటి నుంచి ద్వంద్వ వైఖరి పాటిస్తుంది. ఒక్కసారేమో ఆర్డినెన్సు అన్నారు. ఇంకోసారి ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి ధర్నా చేశారు. అసలు న్యాయపరమైన చిక్కులకు మీరు తీసుకున్న చర్యలు ఏంటి?. నెపంతో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. బీసీల కొరకు సర్వే చేశారా? ముస్లిం కొరకు సర్వే చేశారా?. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. బిల్లు పెట్టడమే కాదు బిల్లు పాస్ అయ్యేలా సీఎం రేవంత్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. బీజేపీ బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది’ అని చెప్పుకొచ్చారు.
కాళేశ్వరంపై బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత
టాప్-5 క్రికెటర్లలో కోహ్లికి నో ఛాన్స్.. సారీ చెప్పిన డివిలియర్స్
తప్పుకొన్న తిలక్ వర్మ.. జట్టులోకి గుంటూరు కుర్రాడు
‘సర్’పై నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి: సుప్రీంకోర్టు
అనుష్క శెట్టి ఘాటి ప్రమోషన్స్.. క్యూట్గా చిట్టి అనుష్క వీడియో!
వృద్ధ తల్లిపై నటి దాడి! ఏ నుయ్యో గొయ్యో చూసుకునేవాళ్లం..
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
కొత్తవారికే కోటిన్నర జీతం.. కానీ ఒక్కటే కండీషన్..
'అంకుల్ అలా చేయడం అనవసరం అనిపించింది'
ఆగస్టులో రూ.24 లక్షల కోట్లు: యూపీఐ ఆల్టైమ్ రికార్డ్
సాయిధన్సికతో విశాల్ పెళ్లి.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పసిడి హైజంప్: కొత్త గరిష్టానికి బంగారం ధర
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
మహిళలకు ఫ్రీ బస్సు హామీ - ఆంక్షల మధ్య అరకొరగా అమలు
ఈ రాశి వారు నూతన వస్తువులు, ఇళ్లు కొంటారు
ఎన్నయినా చెప్పండీ! సారుకు ఈ విషయంలో వచ్చినంత పేరు.. ఇంకెవరికీ రాలేదు!!
అల్లు అర్జున్ ‘ఇంటి’ పేరు ‘అల్లు’ కాదా?. మహేశ్ ‘ఇంటి’పేరు ఘట్టమనేని కాదా?
చిరంజీవి, బన్నీ, చరణ్లతో 'అల్లు కనకరత్నమ్మ' (ఫోటోలు)
'నా కెరీర్లో సెహ్వాగ్ త్యాగం మరువలేనిది.. ఎప్పుడూ రుణపడి ఉంటా'
దీంట్లో కూడా ఈసీ పాత్ర ఉందంటారా!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలలో పురోగతి
కళ్లు బైర్లు కమ్మేలా.. ఈ ‘ఇటుకలు’ చాలా కాస్ట్లీ గురూ..!
'కూలీ' కల్యాణికి బంపరాఫర్.. లోకేశ్ పక్కన హీరోయిన్గా!
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం..
చరిత్ర సృష్టించిన పొలార్డ్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఇంకాస్త ఓర్చుకో!
బాలయ్యను చూస్తే ఏదో ఒకటి తీసి కొట్టాలనిపిస్తుంది : తమన్ కామెంట్స్
అల్లు అరవింద్ కుటుంబంలో విషాదం
ఆర్టీసీ ఆదాయానికి టి‘కట్’
కాళేశ్వరంపై బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత
టాప్-5 క్రికెటర్లలో కోహ్లికి నో ఛాన్స్.. సారీ చెప్పిన డివిలియర్స్
తప్పుకొన్న తిలక్ వర్మ.. జట్టులోకి గుంటూరు కుర్రాడు
‘సర్’పై నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి: సుప్రీంకోర్టు
అనుష్క శెట్టి ఘాటి ప్రమోషన్స్.. క్యూట్గా చిట్టి అనుష్క వీడియో!
వృద్ధ తల్లిపై నటి దాడి! ఏ నుయ్యో గొయ్యో చూసుకునేవాళ్లం..
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
కొత్తవారికే కోటిన్నర జీతం.. కానీ ఒక్కటే కండీషన్..
'అంకుల్ అలా చేయడం అనవసరం అనిపించింది'
ఆగస్టులో రూ.24 లక్షల కోట్లు: యూపీఐ ఆల్టైమ్ రికార్డ్
సాయిధన్సికతో విశాల్ పెళ్లి.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పసిడి హైజంప్: కొత్త గరిష్టానికి బంగారం ధర
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
మహిళలకు ఫ్రీ బస్సు హామీ - ఆంక్షల మధ్య అరకొరగా అమలు
ఈ రాశి వారు నూతన వస్తువులు, ఇళ్లు కొంటారు
ఎన్నయినా చెప్పండీ! సారుకు ఈ విషయంలో వచ్చినంత పేరు.. ఇంకెవరికీ రాలేదు!!
అల్లు అర్జున్ ‘ఇంటి’ పేరు ‘అల్లు’ కాదా?. మహేశ్ ‘ఇంటి’పేరు ఘట్టమనేని కాదా?
'నా కెరీర్లో సెహ్వాగ్ త్యాగం మరువలేనిది.. ఎప్పుడూ రుణపడి ఉంటా'
దీంట్లో కూడా ఈసీ పాత్ర ఉందంటారా!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలలో పురోగతి
కళ్లు బైర్లు కమ్మేలా.. ఈ ‘ఇటుకలు’ చాలా కాస్ట్లీ గురూ..!
'కూలీ' కల్యాణికి బంపరాఫర్.. లోకేశ్ పక్కన హీరోయిన్గా!
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం..
చరిత్ర సృష్టించిన పొలార్డ్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఇంకాస్త ఓర్చుకో!
బాలయ్యను చూస్తే ఏదో ఒకటి తీసి కొట్టాలనిపిస్తుంది : తమన్ కామెంట్స్
అల్లు అరవింద్ కుటుంబంలో విషాదం
ఆర్టీసీ ఆదాయానికి టి‘కట్’
‘రిచ్ డాడ్..’ రాబర్ట్ కియోసాకి మరో ముఖ్యమైన హెచ్చరిక..
సినిమా

ప్రసాదం లేదంటే చంపేస్తారా.. మనం రాక్షసులుగా మారిపోయాం: ప్రముఖ నటి
ఢిల్లీ నగరంలోని ప్రసిద్ధ కల్కాజీ ఆలయంలో జరిగిన ఘోరమైన సంఘటన గురించి బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తీవ్రంగా స్పందించారు. రెండురోజుల క్రితం ఆలయంలో ప్రసాదం పంపిణీ సమయంలో భక్తుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రసాదం స్టాక్ అయిపోయిందని ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్(35) చెప్పడంతో సహించలేని కొందరు యువకులు గొడవకు దిగారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం పెద్దది కావడంతో యోగేంద్రను బయటకు లాగి, అతను చనిపోయేంత వరకు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. తను ప్రాణాలు వదిలేసిన సరే కర్రలతో కొడుతూనే ఉన్నారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ సంఘటనపై నటి స్వర భాస్కర్ రియాక్ట్ అయ్యారు.ఈ సంఘటనపై తాజాగా నటి స్వర భాస్కర్ ఇలా రియాక్ట్ అయ్యారు.' ఇది చాలా దారుణం, భయంకరమైన సంఘటన. ప్రజలను కొట్టి చంపడం భారతదేశంలో ఒక ఆనవాయితీగా మారింది. ఈ సంఘటన చాలా హృదయ విదారకంగా ఉంది. అందరికీ చిరాకు తెప్పించేలా ఉంది. సిగ్గుచేటు, మన సమాజం గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. మనం రాక్షసులుగా మారిపోయాం.' అని ఆమె రాసింది.దాడిలో తీవ్రంగా గాయపడిన యోగేంద్ర సింగ్ను AIIMS ట్రామా సెంటర్కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం మొత్తం అతనిపైనే ఆధారపడి జీవిస్తుంది. CCTV ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక నిందితుడు అతుల్ పాండేను అరెస్ట్ చేశారు, మరిన్ని అరెస్టులు జరుగుతున్నాయి.Warning ⚠️ This video is from Kalkaji Mandir where people murdered seva dar for not giving chunni in parsad. These people are seriously mad. Strict action should be taken. #KalkajiMandir #kalkaji #KalkajiTemple #Delhi #DelhiNCR #delhi @gupta_rekha pic.twitter.com/Xp6cvbtAQu— Sachin Bharadwaj (@sbgreen17) August 30, 2025

రుక్మిణి వసంత్.. నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్?
రుక్మిణి వసంత్. ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. ఎందుకంటే ఈమె స్వతహాగా కన్నడ. కానీ 'సప్త సాగరాలు దాటి' అనే డబ్బింగ్ మూవీతో మనోళ్లకు కాస్త పరిచయం. అలాంటిది ఇప్పుడు 'మదరాశి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇది కాదు అసలు విషయం. ఈమె చేతిలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ లైనప్ చూస్తేనే మిగతా హీరోయిన్స్ అసూయ పడతారేమో అనిపిస్తుంది.శివకార్తికేయన్-మురుగదాస్ కాంబోలో తీసిన 'మదరాశి'లో రుక్మిణి వసంత్ హీరోయిన్. అయితే ఈ సినిమాలో ఈమె పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందనేది తెలీదు. బేసిగ్గా ఈ మూవీపై పెద్దగా అంచనాల్లేవు. కానీ ఆదివారం రాత్రి హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన నిర్మాత ఎన్వీ ప్రసాద్.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ అని బయటకు చెప్పేశారు. అలానే కాంతార సీక్వెల్, యష్ 'ట్యాక్సిక్'లోనూ ఈమెనే కథానాయిక అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకుని బిగ్బాస్ జంట సర్ప్రైజ్)ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో హిట్స్ కొడుతూ వరస సినిమాలు చేస్తున్న హీరోయిన్ అంటే అందరికీ రష్మికనే గుర్తొస్తుంది. కానీ రుక్మిణి వసంత్ లైనప్ చూస్తుంటే రష్మికలానే ఈమె కూడా నెక్స్ట్ పాన్ ఇండియా సెన్సేషన్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే నెలలో రాబోతున్న 'కాంతార' సీక్వెల్లో ఈమె యువరాణి పాత్ర చేసింది. అలానే వచ్చే ఏడాది మార్చిలో ట్యాక్సిక్, వేసవిలో నీల్-తారక్ మూవీ థియేటర్లలోకి రానుంది. ఇవన్నీ కచ్చితంగా హిట్ బొమ్మల్లానే కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మాత్రం రుక్మిణి.. మోస్ట్ వాంటెడ్ అయిపోవడం గ్యారంటీ.రీసెంట్గా మొదలైన వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమాలోనూ హీరోయిన్గా రుక్మిణి వసంత్ని తీసుకోవాలని అనుకుంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావొచ్చు. కెరీర్ ప్రారంభం నుంచి చాలా సెలక్టివ్గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ భవిష్యత్తు.. రాబోయే 10 నెలల్లో ఏ మేరకు మారబోతుందో చూడాలి?(ఇదీ చదవండి: సూపర్స్టార్ సినిమాని దాటేసిన 'కొత్త లోక'.. కలెక్షన్ ఎంతంటే?)

సూపర్స్టార్ సినిమాని దాటేసిన 'కొత్త లోక'.. కలెక్షన్ ఎంతంటే?
గతవారం వినాయక చవితి సందర్భంగా లాంగ్ వీకెండ్ వచ్చింది. కానీ స్టార్ హీరోలు, మిడ్ హీరోల చిత్రాలేవి థియేటర్లలోకి రాలేదు. త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి, సుందరకాండ తదితర చిన్న మూవీస్ వచ్చాయి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. మరోవైపు స్క్రీనింగ్ సమస్యలు ఎదుర్కొని, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా విడుదలైన 'కొత్త లోక' అనే డబ్బింగ్ సినిమా.. మౌత్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపిస్తోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఓవరాల్గా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఎంత?మలయాళ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు సూపర్ హీరో యూనివర్స్ సృష్టించారు. అందులో వచ్చిన తొలి సినిమానే 'లోక'. దీన్ని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. పురాణగాథల్లో ఉన్న యక్షిణి పాత్రని తీసుకుని, సూపర్ హీరో కాన్సెప్ట్ జోడించడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే మలయాళంతో పాటు తెలుగులోనూ పాజిటివ్ టాక్ వచ్చింది.(ఇదీ చదవండి: 'కొత్త లోక' రివ్యూ)మలయాళంలో ఆగస్టు 28న రిలీజ్ కాగా.. ఓ రోజు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. ఇప్పటివరకు నాలుగు రోజులు పూర్తి కాగా దాదాపు రూ.40-45 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం తెలుగులోనే రూ.3.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం. ప్రస్తుతానికైతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తోంది.మలయాళంలో దీనితో పాటు సూపర్స్టార్ మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా కూడా రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ దీనికి రూ.11-15 కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే 'కొత్త లోక'నే ముందంజలో ఉంది. అయితే ఈ సినిమాని కేవలం రూ.30-40 కోట్ల బడ్జెట్తోనే తీశారట. అంటే లాంగ్ రన్లో ఈ సినిమాకు మంచి లాభాలు రావడం గ్యారంటీ.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకుని బిగ్బాస్ జంట సర్ప్రైజ్)

'కల్కి 2' మరింత ఆలస్యం.. కారణం ఇదే: నాగ్ అశ్విన్
ప్రభాస్ మూవీ 'కల్కి 2' షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుంది అంటూ సోషల్మీడియలో పలు ప్రశ్నలు కనిపిస్తూనే ఉన్నాయి. కల్కి 2898 AD సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ అందుకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. మూవీ షూటింగ్, విడుదల ఎప్పుడు ఉండొచ్చు అనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు.‘కల్కి 2’ షూటింగ్ ఎప్పుడనేదానిపై నాగ్ అశ్విన్ ఇలా చెప్పారు.. '2025 చివరి నాటికి కల్కి 2 చిత్రీకరణ ప్రారంభించాలని ప్లాన్ సిద్ధం చేశాం. అయితే, దానికి చాలా అంశాలు కలిసిరావాలి. ఈ ప్రాజెక్ట్లో నటిస్తున్న నటీనటులు చాలా బిజీగా ఉన్నారు. ఆపై ఈ సినిమాలో ఎక్కువగా విజువల్ వండర్ సీక్వెన్స్ ఎక్కువగా ఉన్నాయి.. ఆపై భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి. కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది. ఇదే ఏడాదిలో ప్రారంభం అవుతుందని కూడ ఖచ్చితంగా చెప్పలేను. ఇందులో నటించే ముఖ్యమైన వారందరూ చాలా బిజీగా ఉన్నారు.' అని ఆయన అన్నారు.షూటింగ్ ప్రారంభం అయ్యేందుకు కొంత సమయం పడుతుందని, ఆపై పోస్ట్ ప్రొడక్షన్కు సాధారణంగా ఎక్కువ సమయం పడుతుందని నాగ్ అశ్విన్ అన్నారు. ఇంకో 2 లేదా 3 సంవత్సరాలలో పెద్ద స్క్రీన్పై ఈ సినిమాను చూడొచ్చన్నారు. అంటే 2028లో కల్కి2 చూడొచ్చని ఒక అంచనాతో అభిమానులు ఎదురుచూడాల్సిందే. ఖచ్చితంగా కాస్త ఎక్కువ సమయమే పడుతుందని నాగ్ అశ్విన్ ఒక క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. ది రాజా సాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్రెడ్డి వంగా 'స్పిరిట్' త్వరలోనే ప్రారంభించాలనే ప్లాన్లో ఉన్నారు. వెనువెంటనే ప్రశాంత్ నీల్తో ‘సలార్2: శౌర్యంగ పర్వం’ ఉంది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. అయితే, మొదట స్పిరిట్ మూవీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాస్ ఎక్కువ డేట్స్ సందీప్ రెడ్డికే ఇచ్చినట్లు సమాచరం.
న్యూస్ పాడ్కాస్ట్

కాళేశ్వరం కేసు సీబీఐకి. కాళేశ్వరం నివేదికపై తెలంగాణ శాసనసభలో చర్చ తర్వాత ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి

తెలంగాణలో రిజర్వేషన్లపై 50 శాతం గరిష్ట పరిమితి ఎత్తివేత... పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం

స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

భారత్-జపాన్ సంబంధాల్లో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం... ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ.. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో ద్వైపాక్షిక భేటీ

తెలంగాణలో జల విలయం... కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి... భారీ వర్షాలతో మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల తదితర జిల్లాలు అతలాకుతలం

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు... 8 జిల్లాలకు ఆరెంజ్, 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్... కామారెడ్డి జిల్లాలో రైలు, రోడ్డు మార్గాలు మూసివేత

అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై మరో 25 శాతం టారిఫ్లు నేటి నుంచే అమల్లోకి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపు, అర్జీలు.

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఠా బార్ల దందా... టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా అన్ని బార్లను కట్టబెట్టే కుట్ర

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం... చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుపట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి
క్రీడలు

‘నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సృష్టికర్త లలిత్ మోదీపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్వార్థ ప్రయోజనాల కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారంటూ ఫైర్ అయ్యాడు. మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజమని.. అయితే, అందుకు పశ్చాత్తాపపడిన తర్వాత కూడా పదే పదే అదే ఘటన గుర్తుచేయడం సరికాదన్నాడు.శ్రీశాంత్ చెంపపై కొట్టాడుఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది ‘స్లాప్గేట్’. అరంగేట్ర సీజన్లో అంటే.. 2008లో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh)- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) పేసర్ శ్రీశాంత్ (Sreesanth) మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో భజ్జీ.. శ్రీశాంత్ చెంపపై కొట్టాడు.క్షమాపణలు చెప్పిన భజ్జీఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ యాజమాన్యం.. భజ్జీ ఆ ఎడిషన్లో తదుపరి మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధించింది. అయితే, ఈ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన హర్భజన్ ఇప్పటికే శ్రీశాంత్కు వివిధ వేదికలపై క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలూ లేవు.కానీ లలిత్ మోదీ.. నాటి ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేసి పాత గాయాన్ని మళ్లీ రేపాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో భజ్జీ.. శ్రీశాంత్పై చెంప దెబ్బ కొట్టిన వీడియోను లలిత్ మోదీ రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి.. ‘‘మీకసలు మానవత్వం ఉందా?’’ అంటూ తీవ్ర స్థాయిలో లలిత్ మోదీ, క్లార్క్లపై ఫైర్ అయ్యారు.నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడుతాజాగా హర్భజన్ సింగ్ కూడా లలిత్ మోదీ చర్యపై స్పందించాడు. ‘‘వీడియోను లీక్ చేసిన విధానం తప్పు. అసలు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. దీని వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.పద్దెనిమిదేళ్ల క్రితం జరిగిన ఘటన. దాని గురించి అందరూ ఎప్పుడో మర్చిపోయారు. కానీ వీళ్లు మరోసారి ప్రజలకు దీనిని కావాలనే గుర్తుచేస్తున్నారు’’ అని భజ్జీ ఫైర్ అయ్యాడు. ‘నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడు’ అన్నట్లుగా లలిత్ మోదీ తీరును తప్పుబట్టాడు.ఇప్పటికే ఎన్నోసార్లు ఒప్పుకొన్నాఅదే విధంగా.. ‘‘నాడు జరిగిన ఘటన నన్నెంతో వేదనకు గురిచేసింది. మ్యాచ్ ఆడే క్రమంలో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోనవుతారు. తప్పులు జరగడం సహజం. అందుకు సిగ్గుపడాలి. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. అదో దురదృష్టకర ఘటన. నేను ఆరోజు తప్పుచేశానని ఇప్పటికే ఎన్నోసార్లు ఒప్పుకొన్నాను. ఇంకోసారి తప్పు చేయనని.. ఒకవేళ తప్పు చేస్తే దానిని సరిదిద్దుకునేలా చేయమని ఆ గణేశుడిని ప్రార్థిస్తున్నా’’ అని హర్భజన్ సింగ్ ఉద్వేగానికి లోనయ్యాడు.చదవండి: తొలి మ్యాచ్లోనే ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్

వన్డే వరల్డ్ కప్కు రికార్డుస్థాయి ప్రైజ్మనీ.. ఎన్ని కోట్లంటే?
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025కు సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 30 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. అయితే పాకిస్తాన్ మాత్రం తమ మ్యాచ్లని శ్రీలంక వేదికగా ఆడనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రైజ్మనీ ప్రకటించింది.మొత్తం ప్రైజ్ మనీని రికార్డు స్థాయిలో 13.88 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 122 కోట్లు)గా ఖరారు చేసింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన చివరి వన్డే ప్రపంచకప్(2022)తో పోలిస్తే ఈ ప్రైజ్మనీ 300 శాతం అధికం కావడం గమనార్హం. అప్పుడు ప్రైజ్మనీ కేవలం రూ. 30 కోట్ల మాత్రమే. అదేవిధంగా పురుషుల వన్డే వరల్డ్కప్-2023 కంటే అధికం కావడం విశేషం. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీకి ఐసీసీ రూ. 88 కోట్లు కేటాయించింది. ఇప్పుడు మహిళల ప్రైజ్మనీ పురుషుల టోర్నీని మించిపోయింది.విజేతకు ఎంతంటే?ఇక ఈ మెగా టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు 4.48 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 కోట్లు) నగదు బహుమతి అందనుంది. ఇది 2023 వరల్డ్కప్ విజేత ఆస్ట్రేలియా అందుకున్న దానికంటే 239 శాతం ఎక్కువ. ఆ సమయంలో ఆసీస్ కేవలం రూ. 11 కోట్లు మాత్రమే బహుమతిగా లభించింది.ఈ ఏడాది మహిళల ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచే జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 19 కోట్లు) లభిస్తాయి. సెమీ ఫైనలిస్ట్లు ఒక్కొక్కరికి 1.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 9 కోట్లు) దక్కనుంది. అంతేకాకుండా ప్రతీ గ్రూపు మ్యాచ్లోనూ విజయం సాధించిన జట్టుకు సైతం ఐసీసీ ప్రైజ్మనీ కేటాయించింది. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్కు 34,314 డాలర్లు (దాదాపు రూ. 30 లక్షలు) అందనుంది. అదేవిధంగా ఐదు, ఆరు స్ధానాల్లో నిలిచే జట్లకు 700,000 డాలర్లు (సుమారు రూ. 6 కోట్లు), ఏడు ఎనిమిది స్ధానాల్లో నిలిచే జట్లకు 280,000 డాలర్లు (సుమారు రూ. 2.5 కోట్లు) అందనుంది.ఇక ఈ ఈ మెగా ఈవెంట్లో పాల్గొన్నందుకు ప్రతీ జట్టుకు 2,50,000 డాలర్లు (సుమారు రూ. 2 కోట్లు) ప్రైజ్ మనీ లభించనుంది. మహిళల క్రికెట్ ప్రయాణంలో ఇది ఒక చారిత్రక మైలురాయి అని ఐసీసీ చైర్మెన్ జైషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.చదవండి: IPL 2026: కేకేఆర్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్..!?

తొలి మ్యాచ్లోనే ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్
జార్ఘండ్కు చెందిన 21 ఏళ్ల మానిషి తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్లోనే ప్రపంచ రికార్డు సమం చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన అతడు.. తాజాగా జరిగిన మ్యాచ్లో (దులీప్ ట్రోఫీ మొదటి క్వార్టర్ ఫైనల్) ఈస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తూ.. నార్త్ జోన్పై 6 వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో) తీశాడు.మానిషి తీసిన ఈ 6 వికెట్లు ఎల్బీడబ్ల్యూ రూపంలో రావడం విశేషం. ఈ కారణంగానే అతని పేరిట ప్రపంచ రికార్డు నమోదైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో మానిషికి ముందు కేవలం ఐదుగురు మాత్రమే ఓ ఇన్నింగ్స్లో ఆరుగురిని ఎల్బీడబ్ల్యూ చేశారు. వీరిలో భారతీయులు ఒక్కరు కూడా లేరు.దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్గా మానిషి చరిత్ర సృష్టించాడు. అలాగే మార్క్ ఇలాట్ (1995), చమింద వాస్ (2005), తబిష్ ఖాన్ (2012), ఓలీ రాబిన్సన్ (2021), క్రిస్ రైట్తో (2021) కలిసి ప్రపంచ రికార్డును పంచుకున్నాడు. ఇలాట్, వాస్, తబిష్ ఖాన్, రాబిన్సన్, క్రిస్ రైట్ కూడా మానిషిలాగే ఒకే ఇన్నింగ్స్లో ఆరుగురిని ఎల్బీడబ్ల్యూ చేశారు.మానిషి ఈ మ్యాచ్లో శుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్, యశ్ ధుల్, కన్హయ్య వధవాన్, ఆకిబ్ నబీ, హర్షిత్ రాణాను ఎల్బీడబ్ల్యూ చేశాడు. మానిషి తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో (22.2-2-111-6) చెలరేగినా రెండో ఇన్నింగ్స్లో (34-3-166-0) తేలిపోయాడు. ఈ మ్యాచ్లో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా సెమీస్కు అర్హత సాధించింది.జంషెడ్పూర్లో జన్మించిన మానిషికి ఇది తొలి దులీప్ ట్రోఫీ మ్యాచే అయినప్పటికీ.. ఇదివరకే 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 2023-24 రంజీ సీజన్లో అతను అత్యుత్తమంగా (22 వికెట్లు) రాణించాడు. మానిషి 2019లో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్లో అతను ఐదు వికెట్ల ప్రదర్శన సహా 7 వికెట్లు తీశాడు. తాజా ప్రదర్శన తర్వాత మానిషిపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు దృష్టి సారించవచ్చు.

కేకేఆర్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్..!?
రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్గా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025కు ముందు రాయల్స్ ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. కేవలం ఒక్క సీజన్కే తన పదవికి రాజీనామా చేశాడు.అయితే ఫ్రాంచైజీలో అంతర్గత విభేదాల కారణంగా ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. కానీ రాజస్తాన్ మాత్రం అతడు తప్పుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు ద్రవిడ్ తదుపరి అడుగు ఏంటన్న చర్చ క్రికెట్ వర్గాల్లో నెలకొంది.కేకేఆర్ హెడ్ కోచ్గా.. ఐపీఎల్-2026కు ముందు రాహుల్ ద్రవిడ్ను తమ జట్టు హెడ్కోచ్గా నియమించుకోవాలని కోల్కతా నైట్రైడర్స్ భావిస్తుందంట. ఈ ఏడాది సీజన్ తర్వాత కేకేఆర్ ప్రధాన కోచ్ పదవి నుంచి చంద్రకాంత్ పండిత్ తప్పుకొన్నాడు. ప్రస్తుతం కేకేఆర్ హెడ్కోచ్ పదవి ఖాళీగా ఉంది.దీంతో అతడి స్ధానాన్నిఅనుభవజ్ఞుడైన ద్రవిడ్తో భర్తీ చేయాలని కోల్కతా యాజయాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ కరేబియన్ దీవుల నుంచి వచ్చిన వెంటనే ద్రవిడ్తో సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. కానీ ద్రవిడ్ కేకేఆర్ ఆఫర్ను అంగీకరిస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే గత ఏడు ఎనిమిదేళ్ల నుంచి వివిధ జట్లకు కోచింగ్ ఇస్తూ ద్రవిడ్ బీజీబీజీగా గడిపాడు. అతడు ప్రస్తుతం తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో భారత హెడ్కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకొన్నాడు. అయితే కేకేఆర్ అతడికి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఆఫర్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఐపీఎల్-2025లో అట్టర్ ప్లాప్..కాగా ఈ ఏడాది సీజన్లో అజింక్య రహానే సారథ్యంలోని కోల్కతా జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ 14 మ్యాచ్లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో నైట్రైడర్స్ నిలిచింది. కెప్టెన్ రహానేపై కూడా వేటు పడే అవకాశముంది.చదవండి: Ashes 2025: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. బుమ్రాను ఫాలో కానున్న కమ్మిన్స్!?
బిజినెస్

బ్యాంకులో 14 ఏళ్లు ఎక్స్పీరియన్స్.. రోడ్డుపై బిచ్చగాడిలా..
పైన ఫొటోలో మీరు చూస్తున్న వ్యక్తికి బ్యాంకింగ్ రంగంలో 14 ఏళ్ల అనుభవం ఉందట. కానీ ప్రస్తుతం నిలువ నీడ లేకుండా, చేతిలో చిల్ల గవ్వ లేకుండా రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్నాడు. ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడ్డిట్ లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇది జాబ్ మార్కెట్, సామాజిక పరిస్థితులపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్న ఆ వ్యక్తి ఫొటోలను షేర్ చేస్తూ, ఒక రెడ్డిటర్ ఇలా రాసుకొచ్చారు..‘ఈ వ్యక్తిని ఒక ప్రముఖ బెంగళూరు సిగ్నల్ వద్ద చూశాను. ఆయనను చూస్తే ఎంతో హృదయవిదారకంగా ఉంది. ఇది సమాజ వైఫల్యమా లేక వ్యక్తిగత నిర్ణయాల ఫలితమా అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను.’రెడ్డిటర్ షేర్ చేసిన ఫొటోల్లో మొదటి దాంట్లో ఆ వ్యక్తిని రోడ్డు పక్కన ఫుట్పాత్పై బిచ్చగాడిలా కనిపించారు. రెండో ఫొటోలో ఆ వ్యక్తి చేతిలో ఉన్న నోట్ను చూపించారు. అందులో 'నాకు ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, దయచేసి సహాయం చేయండి. నాకు బ్యాంకింగ్ లో 14 ఏళ్ల అనుభవం ఉంది’ అని రాసిఉంది.ఈ పోస్ట్పై రెడ్డిటర్స్ మధ్య చర్చ సాగింది. బెంగళూరు వంటి నగరంలో నిరుద్యోగం ఏంటి అని కొందరు ప్రశ్నించారు. అయితే అతని శారీరక వైకల్యం ఉందేమోనని సందేహం వ్యక్తం చేశారు. 'శారీరకంగా సామర్థ్యం ఉంటే డెలివరీ లేదా డ్రైవింగ్ వంటి ఏదో ఒక పని చేసుకోవచ్చని చాలా మంది చెబుతుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఎక్కువ కాలం నిరుద్యోగులుగా ఉంటే, మానసికంగా విచ్ఛిన్నమై, నిరాశకు గురయ్యే అవకాశం ఉంది’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు.

ఆర్మీ ట్రెయినింగ్ కమాండ్తో ఐఐటీ-హైదరాబాద్ ఒప్పందం
భారత సైన్యం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్), ఇండియన్ ఆర్మీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను ప్రారంభించనున్నాయి. ఈమేరకు ఐఐటీ హైదరాబాద్ సిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ (ఏఆర్టీఆర్ఏసీ), సిమ్యులేటర్ డెవలప్మెంట్ డివిజన్ (ఎస్డీడీ)తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. స్వదేశీ సాంకేతిక స్వావలంబనకు ఇది కీలకం కానుందని అధికారులు చెప్పారు.‘విగ్రహ’(వర్చువల్, ఇంటెలిజెంట్, గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ఇన్ ఏఆర్/వీఆర్ అండ్ హైటెక్ అప్లికేషన్స్ ఫర్ ఇండియన్ ఆర్మీ) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ) భారత నైన్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇరు వర్గాలు తెలిపాయి.‘విగ్రహ’ లక్ష్యం ఏమిటి?భారత సైన్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని శిక్షణ, యుద్ధ సన్నద్ధతకు ఉపయోగించడం ద్వారా సైనిక సంసిద్ధతను నిర్ధారించాలని విగ్రాహ భావిస్తోంది.రియలిస్టిక్ మిలిటరీ ట్రైనింగ్ సిమ్యులేషన్స్ కోసం అడ్వాన్స్డ్ ఏఆర్/వీఆర్ ప్లాట్ఫామ్స్ ఉపయోగపడుతాయి.సంక్లిష్ట భూభాగాల్లో సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడం, స్వయంప్రతిపత్తి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఏఐ, రోబోటిక్స్, మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు ఈ సెంటర్ తోడ్పడుతుంది.భారత సైన్యం ఆపరేషనల్ మెలకువలు, వ్యూహాత్మక అవసరాలను తీర్చడానికి బ్యాటిల్ ఫీల్డ్ సిమ్యులేషన్ టూల్స్ను ఏర్పాటు చేయనున్నారు.ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ..‘ఈ కేంద్రం కేవలం టెక్ ల్యాబ్ మాత్రమే కాదు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణలతో భారతదేశ రక్షణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాలనే మా ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు. బ్రిగేడియర్ ఏకే చతుర్వేది మాట్లాడుతూ..‘ఈ సహకారం తదుపరి తరం సామర్థ్యాలను స్వీకరించడానికి, స్వదేశీ సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి సైన్యం నిబద్ధతకు హైలైట్ చేస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: భారత్ మూడంచెల ప్లాన్..

రూ.200 లోపు మంత్లీ ప్లాన్.. అదీ రోజుకు 2 జీబీ డేటాతో..
ప్రైవేట్ టెలికం కంపెనీలన్నీ తమ ఎంట్రీ లెవల్ మంత్లీ ప్లాన్లను మార్చేశాయి. తక్కువ ధర రీచార్జ్ ప్లాన్లను తొలగించాయి. రోజువారీ డేటాతో కూడిన ప్లాన్లు కావాలంటే కనీసం రూ.300 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కానీ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే అధిక సేవలను అందించే మరో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను లాంచ్ చేసింది. రూ.200 లోపు మంత్లీ ప్లాన్.. అదీ రోజుకు 2 జీబీ డేటాతో..ప్రైవేటు సంస్థలకు పెద్ద సవాలు విసురాలనే లక్ష్యంతో బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. 30 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, ఉచిత కాలింగ్ అందించే ఈ ప్లాన్ ధర రూ.200 లోపే. ఈ రీఛార్జ్ ప్యాక్ లో బీఎస్ఎన్ఎల్ అందించే ప్రయోజనాలను వివరంగా చూద్దాం.బీఎస్ఎన్ఎల్ రూ.199 ప్లాన్పై 30 రోజుల ఆకర్షణీయమైన వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా మరో ఆకర్షణ. వీటన్నింటితో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను కూడా అందిస్తుంది. దేశంలోని ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే రూ .199 ప్లాన్ ఆర్థిక ప్రయోజనాలు, అధిక ప్రయోజనాలను కలిగి ఉందని పేర్కొంటూ బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్యాక్ను ప్రవేశపెట్టింది.ఇదే రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ అందించే ప్లాన్కు ఒక ఆపరేటర్ నెలకు రూ.379 వసూలు చేస్తుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. మరో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అదే సౌకర్యాలతో 28 రోజుల ప్లాన్ కోసం రూ .365 వసూలు చేస్తుంది. మరోవైపు రూ.199 ప్లాన్తో మరో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్లకు 14 రోజుల వాలిడిటీని మాత్రమే అందిస్తుందని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది.

భారత్ మూడంచెల ప్లాన్..
భారతీయ ఎగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి వ్యూహాత్మక ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టారిఫ్ల వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక ఉపశమనం కోసం దేశ ఎగుమతి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి మూడంచెల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తున్నందుకు భారత్పై అమెరికా తీసుకున్న ఈ టారిఫ్ చర్య 60 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, లెదర్, రసాయనాలు వంటి కార్మిక ఆధారిత రంగాలపై ప్రభావం చూపుతుంది. వీటిలో చాలా వరకు ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్) పరిధిలోకి రానివే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.స్వల్పకాలిక చర్యలు..చాలా సంస్థలకు వడ్డీ రాయితీ పథకాలు అందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు లేని రుణాలను సులభతరం చేయాలని యోచిస్తోంది. సెజ్ యూనిట్ల ఆర్డర్ వాల్యూమ్లను నిర్వహించడానికి, ఉద్యోగాలను రక్షించడంలో సహాయపడటానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బ్రాండింగ్, ప్యాకేజింగ్, వేర్హౌజింగ్, లాజిస్టిక్స్పై పట్టుసాధించేందుకు సాయం అందించాలని చూస్తోంది. టెక్స్టైల్స్, హస్తకళల్లో చిన్న ఎగుమతిదారులకు లిక్విడిటీ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా ఉంది. ఈ సమస్య పరిష్కరించేందుకు స్వల్పకాలిక చర్యలు కీలకం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.మీడియం స్ట్రాటజీరాబోయే 12-24 నెలల్లో అమెరికాకు చేసే ఎగుమతులను వైవిధ్య పరచాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను పొందేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఇప్పటికే చర్చలు వేగవంతం చేసింది. ఎగుమతి వ్యాపారాన్ని సులభతరం చేయడానికి పన్ను రిఫండ్లను క్రమబద్ధీకరించడం, ఖర్చులను తగ్గించేలా చర్యలు తీసుకుంటోంది. యూరప్, ఆఫ్రికా వంటి కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడానికి ట్రేడ్ ఫెయిర్లను ఏర్పాటు చేస్తుంది.దీర్ఘకాలిక దృష్టిఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎగుమతి ప్రోత్సాహక మిషన్ను ప్రారంభించింది. దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్లను వైవిధ్య పరిచేందుకు చర్యలు తీసుకుంటుంది. సరళీకృత లాజిస్టిక్స్, కస్టమ్స్ క్లియరెన్స్, జీఎస్టీ రిఫండ్ విధానాలతో డిజిటల్ వాణిజ్యంలో ఎంఎస్ఎంఈలకు మరింత అవకాశాన్ని కల్పించాలని చూస్తుంది. భారతీయ ఎగుమతులకు గ్లోబల్ బ్రాండ్ విశ్వసనీయతను పెంచడానికి స్కిల్లింగ్, ఆర్ అండ్ డీ, క్వాలిటీ సర్టిఫికేషన్లో పెట్టుబడులు పెంచాలని చూస్తుంది.ఇదీ చదవండి: రూ.50 లక్షలు ఆదాయం ఉన్నా స్కూల్ ఫీజు భారం!
ఫ్యామిలీ

రాతిపై చెక్కిన అద్భుతం..!
జోర్డాన్లోని పెట్రా నగరం– పర్యాటకుల్ని ఆకర్షించే పురాతన, చారిత్రక ప్రాంతం! దీనిని నబేటియన్ తెగవారు సుమారు 2 వేల సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ నగరం మొత్తం ఎర్రటి ఇసుకరాతి పర్వతాలను తొలిచి నిర్మించడంతో ఈ ప్రదేశమంతా చాలా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. పెట్రా ప్రధాన మార్గంలో ఉండే ‘అల్–ఖజ్నే’ అనేది ఇక్కడున్న అతిపెద్ద కట్టడాల్లో ఒకటి. ఇక్కడున్న సిక్ అనే పొడవైన, ఇరుకైన లోయ గుండా వెళితేనే పెట్రా నగరంలోకి ప్రవేశించగలం. అలాగే ఇక్కడ కొన్ని భారీ రాతి సమాధులు ఉంటాయి. వాటిని ‘రాయల్ టూంబ్స్’ అంటారు. అవి నబేటియన్ల కళా నైపుణ్యానికి నిదర్శనం. భూకంపాలు, వర్తక మార్గాల మార్పులతో ఈ నగరం దాదాపు వెయ్యి సంవత్సరాలు మరుగునపడింది. తిరిగి 1812లో దీనిని కనుగొన్నారు. ఈ అద్భుతమైన నగరం ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.ప్రతిభకు సంబరాలు! హెల్సింకీ ఫెస్టివల్ – ఇది ఫిలండ్లోని అతిపెద్ద మల్టీ–ఆర్ట్ ఫెస్టివల్! ఇది హెల్సింకీ నగరంలో జరుగుతుంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలను సెప్టెంబర్ 1 వరకు నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్లో సంగీతం, డ్యాన్స్, విజువల్ ఆర్ట్స్, సినిమా వంటి వివిధ కళా రూపాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి దేశీయ, అంతర్జాతీయ కళాకారులను, ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఈ ఫెస్టివల్లో ప్రతి ఒక్కరికీ నచ్చేలా అనేక కార్యక్రమాలు ఉంటాయి. క్లాసికల్ సంగీతం దగ్గర నుంచి పాప్, రాక్ వంటి ఆధునిక సంగీతం వరకు వివిధ శైలులలో ప్రదర్శనలు జరుగుతాయి.అంతర్జాతీయంగా పేరు పొందిన ప్రముఖ బ్యాండ్లు ఈ ఫెస్టివల్లో పాల్గొంటాయి. థియేటర్ ప్రదర్శనలు, నత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతర్జాతీయ బందాలు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తాయి. ఫెస్టివల్లో భాగంగా నగరంలోని వివిధ గ్యాలరీలలో విజువల్ ఆర్ట్స్ ప్రదర్శనలు జరుగుతాయి. ఇది స్థానిక, అంతర్జాతీయ కళాకారులకు తమ సజనాత్మకతను ప్రదర్శించడానికి మంచి అవకాశం.ఓపెన్–ఎయిర్ సినిమా ప్రదర్శనలు, సాహిత్యం ఈ ఫెస్టివల్లో భాగంగా ఉంటాయి. హెల్సింకీ ఫెస్టివల్లో అత్యంత ముఖ్యమైన, విశేషమైన భాగం నైట్ ఆఫ్ ది ఆర్ట్స్. ఇది ఈ పదిహేను రోజుల్లో ఒకే రోజు జరుగుతుంది. ఆ రోజున హెల్సింకీ నగరం కళల వెలుగులతో నిండిపోతుంది. మ్యూజియమ్లు, గ్యాలరీలు, థియేటర్లు, బుక్షాప్లు రాత్రి పొడవునా తెరిచి ఉంటాయి. ప్రజలు వీథుల్లో కళా ప్రదర్శనలను, ప్రత్యక్ష సంగీత కచేరీలను ఉచితంగా ఆస్వాదిస్తారు.(చదవండి: స్క్రీన్ అడిక్షన్ హద్దుల్లేకుంటే ఇక్కట్లు తప్పవు)

ఈ సండే సింగోడి హల్వా చేసేద్దాం ఇలా..!
సింగోడీ హల్వాకావలసినవి: కోవా– 2 కప్పులు, బెల్లం తురుము– రుచికి సరిపడాబాదం పొడి– 2 టేబుల్ స్పూన్లు (బాదం దోరగా వేయించి, పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి), పచ్చికొబ్బరి తురుము– పావు కప్పు, ఏలకుల పొడి– అర టీ స్పూన్, బాదం– గార్నిష్ కోసం (నేతిలో వేయించాలి)తయారీ: కోవాను మెత్తగా చేత్తో బాగా కలిపి, ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కళాయిలో కోవా, ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము వేసి చిన్న మంట మీద పెట్టి, గరిటెతో కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగి, కోవాలో కలిసిపోయిన తర్వాత, పచ్చి కొబ్బరి తురుము, బాదం పొడి వేసి బాగా కలపాలి. తీపి సరిపోయిందో లేదో చూసుకుని, మరికాస్త బెల్లం తురుము వేసుకోవచ్చు. మళ్లీ వేసుకున్న బెల్లం తురుము బాగా కరిగి, ఈ మిశ్రమమంతా చిన్నమంట మీద బాగా ఉడకాలి. తర్వాత ఏలకుల పొడి వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మి్రÔè మం కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని, వేయించిన బాదంతో కలిసి సర్వ్ చేసుకోవచ్చు.టేస్టీ మీల్మేకర్ బాల్స్కావలసినవి: మీల్మేకర్– 2 కప్పులు పైనే (శుభ్రం చేసుకుని, మెత్తగా ఉడికించి, తురుములా చేసుకోవాలి), గోధుమ పిండి– 3 టేబుల్ స్పూన్లు, గడ్డ పెరుగు– సరిపడా, ఉల్లిపాయ గుజ్జు– 2 టేబుల్ స్పూన్లు (నూనెలో దోరగా వేయించుకుని చల్లారనివ్వాలి), కారం, గరం మసాలా– 2 టీ స్పూన్లు చొప్పున, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, అల్లం తురుము– పావు టీ స్పూన్ చొప్పున, ఉప్పు– తగినంత, స్ప్రింగ్ రోల్ షీట్స్ – 2 (బాగా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)తయారీ: ముందుగా ఒక బౌల్లో మీల్మేకర్ తురుము, కారం, గోధుమ పిండి, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం తురుము, వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, ఉల్లిపాయ గుజ్జు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని బాగా కలపాలి. అవసరం అయితే మరింత పెరుగు కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ప్రతి ఉండకు కొద్దికొద్దిగా స్ప్రింగ్ రోల్ షీట్స్ ముక్కలను చిత్రంలో ఉన్నవిధంగా చుట్టి, బాగా ఒత్తి, నూనెలో దోరగా వేయించి సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.కొరియన్ ఫ్రైడ్ పొటాటోకావలసినవి: పెద్ద బంగాళదుంపలు– 3 (తొక్క తీసి, పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు– ఒక టేబుల్ స్పూన్ (సన్నగా, పొడవుగా తరగాలి), పచ్చిమిర్చి ముక్కలు– కొద్దిగా, వెల్లుల్లి తురుము– రెండు టీ స్పూన్లు, టమాటో సాస్, సోయా సాస్– 5 టేబుల్ స్పూన్లు చొప్పున, క్యారట్– ఒకటి (సన్నగా కట్ చేసుకోవాలి), పంచదార, నూనె– సరిపడా, నువ్వులు– ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు– కొన్ని(గార్నిష్కి)తయారీ: ముందుగా బంగాళదుంప ముక్కలను నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని, దోరగా వేయించుకుని, ఆ తర్వాత వెల్లుల్లి తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి. వెంటనే వేగిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని కలపాలి. ఈలోపు ఒక చిన్న బౌల్లో సోయా సాస్, టమాటో సాస్, పంచదార వేసుకుని బాగా కలిపి, వేగుతున్న మిశ్రమంలో వేయాలి. ఆపై నువ్వులు జల్లి బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసి, సర్వ్ చేసుకోవచ్చు.

సిలికాన్ ఫేషియల్ క్లీనర్ నల్లమచ్చలను ఇట్టే తొలగిస్తుంది..!
వయసు పెరిగే కొద్ది ముఖానికి మరింత సంరక్షణ తప్పనిసరి అంటారు సౌందర్య నిపుణులు. అందుకు చాలామంది సాధారణ ఫేషియల్ క్లీనర్లు, మాన్యువల్ బ్రష్లనే ఎంచుకుంటారు. అయితే, తక్కువ ఖర్చులో మంచి ఫలితాన్ని పొందాలనుకునే వారికి ఈ సిలికాన్ ఫేషియల్ క్లీనర్ చక్కగా పని చేస్తుంది. ఇది చర్మాన్ని మరింత లోతుగా శుభ్రం చేయడానికి, మసాజ్ చేయడానికి సహాయపడుతుంది. ముఖంపై పేరుకుపోయిన మురికిని, మేకప్ను, నల్లమచ్చలను ఇట్టే తొలగిస్తుంది.ఈ క్లీనర్ చాలా సున్నితమైన సిలికాన్ కుచ్చులతో రూపొందింది. అవి చర్మాన్ని సుతారంగా శుభ్రం చేసి, ముఖాన్ని సుమనోహరంగా మెరిపిస్తాయి. ఈ బ్రష్ క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్, మసాజ్, బ్లాక్హెడ్ తొలగింపు వంటి నాలుగు రకాల పనులకు ఉపయోగపడుతుంది. చర్మ రంధ్రాల్లోని మురికిని తొలగించి, నల్ల మచ్చలను తగ్గిస్తుంది. ఇది సులభంగా పట్టుకుని, ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. దీన్ని తేలికగా వేలికి తొడుక్కుని సులభంగా వాడుకోవచ్చు. ప్రయాణాల్లో కూడా దీన్ని సులభంగా వెంట తీసుకెళ్లవచ్చు. దీంతో శుభ్రపరచుకోవడం కూడా తేలికే! ఇది రెండు వందల రూపాయల నుంచి ఆన్లైన్లో లభిస్తుంది. చాలా రంగుల్లో దొరుకుతున్నాయి.చిరునవ్వు మెరిసేలా!పంటి సమస్యలను పరిష్కరించడానికి అనేక రకాలుగా దంత చికిత్సలుంటాయి. అయితే వాటిలో సాధారణ చికిత్స– జనరల్ చెకప్ స్కేలింగ్. రోజుల తరబడి దంతాలపై పేరుకుపోయిన గారలను పోగొట్టే పద్ధతి ఇది. దంతాలపై ఏర్పడే బ్యాక్టీరియాతో కూడిన జిగురు లాంటి, రంగులేని పొరను బ్రష్తో సరిగ్గా క్లీన్ చేయలేప్పుడు, అది పుచ్చిపోవడం లేదా చిగుళ్ల వ్యాధికి దారి తీయడం మనకు తెలిసిందే! అలా పసుపు, గోధుమ రంగులో మారిన గారను.. డెంటల్ హైజీనిస్ట్ అల్ట్రాసోనిక్ స్కేలర్ అనే ప్రత్యేకమైన పరికరంతో శుభ్రపరుస్తారు. పంటి ఉపరితలంపై, చిగుళ్ల ఇరుకుల్లో గారను తొలగించే ఈ ప్రక్రియ– సాధారణంగా నొప్పి లేకుండానే జరుగుతుంది. ఈ స్కేలింగ్ చికిత్స తర్వాత, దంతాల ఉపరితలాన్ని నునుపుగా చేయడానికి పాలిష్ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ప్లాక్ సులభంగా పళ్లను అంటుకోకుండా ఉంటుంది. ఈ చికిత్స చేయించుకోవడంతో పళ్లు త్వరగా పుచ్చిపోకుండా, నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. (చదవండి: స్క్రీన్ అడిక్షన్ హద్దుల్లేకుంటే ఇక్కట్లు తప్పవు)

త్రినేత్రుడు రెడీ..!
భూమి పైనుంచి భారీ టెలిస్కోప్ ఒకటి ఈ విశ్వాంతరాళంలో కలియదిరిగేందుకు సిద్ధమౌతోంది! కొత్త గెలాక్సీలను, ప్రమాదకరమైన గ్రహ శకలాలను, ఆఖరికి గ్రహాంతర జీవుల ఉనికిని సైతం అది కనిపెట్టనుంది! ఈ ఏడాదిలో పని ప్రారంభించనున్న ఆ టెలిస్కోప్, వచ్చే పదేళ్లలో 2 వేల కోట్ల గెలాక్సీల ఆచూకీని కనిపెట్టనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే – ‘లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్’ ప్రాజెక్టులో భాగం చిలీలోని రూబిన్ అబ్జర్వేటరీ తన ‘సిమోన్యీ సర్వే టెలిస్కోప్’లో అమర్చిన అతి శక్తిమంతమైన మూడు కళ్ల కెమెరా... చుక్కల్లో చెడుగుడు ఆడబోతోంది. దిక్కుల దాగుడు మూతల్ని తెరవబోతోంది! చిలీలోని ‘వీరా సి రూబిన్’ అంతరిక్ష పరిశోధన శాల (అబ్జర్వేటరీ) తన చరిత్రాత్మకమైన ఖగోళ పరిశోధనకు చేసుకుంటున్న ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. రహస్య నక్షత్ర మండలాలు, భూమిని ఢీకొట్టగల గ్రహ శకలాలు, అంతుచిక్కని గ్రహాంతర జీవుల ఉనికిని నైతం కనిపెట్టేందుకు రూబిన్ అబ్జర్వేటరీ ఈ అండ పిండ బ్రహ్మాండమైన ప్రాజెక్టును చేపట్టింది. అందుకోసం అత్యంత శక్తిమంతమైన మూడు కళ్ల ‘ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా’ను తన టెలిస్కోప్లో అమర్చుకుంది. తొలి ప్రయోగం సక్సెస్ఈ ఏడాది జూన్ 23 న, ప్రయోగాత్మకంగా రూబిన్ కెమెరా (ఇదే ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా) ఖగోళ శాస్త్రవేత్తలనే అబ్బురపరచే ఫొటోలను తీసింది. ఆ అపూర్వమైన ఛాయా చిత్రాలలో గెలాక్సీ సమూహాలు, సుదూర నక్షత్రాలు, నెబ్యులా (ప్రకాశవంతమైన అంతరిక్ష మేఘం) ఉన్నాయి. ఒక కారు సైజులో 3.2 గిగాపిక్సెల్తో ఉండే ఆ కెమెరా తీసిన ఒక ఫొటోలో 4,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నెబ్యూలా కనిపించింది! అబ్జర్వేటరీకి ఉండే టెలిస్కోప్ వేగంగా వెంటవెంటనే చిత్రాలను తీస్తుంది కాబట్టి, అందులోని కెమెరా అంతరిక్ష మండలానికి ఆవల ఉన్న నక్షత్రాల గుంపు నుండి కూడా కదిలే వస్తువులను పట్టుకోగలదు. ఒక అంతరిక్ష శిల భూమి వైపు వస్తుంటే కనిపెట్టేయనూగలదు. హబుల్, జేమ్స్ల కన్నా పవర్ఫుల్ మానవాళిని అప్రమత్తం చేసే విషయమై ఇప్పటికే ఇతర శక్తిమంతమైన టెలిస్కోప్లు పనిలో ఉన్నాయి. ఉదాహరణకు, ‘జేమ్స్ వెబ్’ టెలిస్కోప్ భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో స్థిరంగా ఒక చోట ఉంటుంది. అంతరిక్షంలోని నిర్దిష్ట లక్ష్యాలను దగ్గరగా చూడటమే ఈ టెలిస్కోప్ ప్రధాన విధి. జేమ్స్ వెబ్ కన్నా ముందున్న ‘హబుల్ టెలిస్కోప్’ ప్రస్తుతం భూమికి 500 కి.మీ కంటే ఎక్కువ ఎత్తులో కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంది. 1995లో హబుల్ దాదాపు ఒక వారం పాటు ఛాయా చిత్రాల్ని ఒడిసిపట్టి ‘హబుల్ డీప్ ఫీల్డ్ ఇమేజ్గా’ ప్రస్తుతం ప్రసిద్ధిలో ఉన్న ఫొటోను తీసింది. విశ్వాంతరాళాల్లోని 3,000 కు పైగా గెలాక్సీలు ఆ ఫొటోలో పడ్డాయి. దానికి మించిందే తాజా రూబిన్ ప్రాజెక్ట్ కెమెరా. 40 చంద్రుళ్లు పట్టేస్తారురూబిన్ అబ్జర్వేటరీ, ఏప్రిల్లో తన మొదటి టెస్ట్ రన్ సమయంలో, కొన్ని గంటల్లోనే కోటి గెలాక్సీలను ఫొటో తీసింది. రూబిన్కు ఉన్న ప్రత్యేకత వల్లనే ఆ స్థాయిలో ఫొటో తీయటానికి సాధ్యమైంది. జేమ్స్ వెబ్, హబుల్ టెలిస్కోపులు మాదిరిగా కాకుండా, ఆకాశంలోని చిన్న భాగాలను చూడగల రూబిన్ సిమోన్యీ ఒక సర్వే టెలిస్కోప్. అంటే ఇది నిర్దిష్ట వస్తువులను కాకుండా మొత్తం పెద్ద చిత్రాన్ని చూపిస్తుంది. ఇది తీసే చిత్రం 40 నిండు పున్నమిలకు సమానమైన ఆకాశం మొత్తాన్ని చుట్టేస్తుంది. అదే జేమ్స్ వెబ్కు ఉన్న కెమెరాలు పౌర్ణమి కంటే తక్కువ విస్తృతి కలిగిన ఆకాశ క్షేత్రానికి పరిమితం అవుతాయి. రూబిన్ నుండి తీసిన ఒక ఫొటో చాలా పెద్దదిగా ఉంటుంది. దానిని పూర్తి స్థాయిలో చూడటానికి 400 అల్ట్రా హెచ్.డి. టీవీ స్క్రీన్లు అవసరం అవుతాయి. ‘టైమ్–లాప్స్’ సాంకేతికతఆకాశంలోని అసాధారణ విశేషాలను కనిపెట్టేందుకు 10 ఏళ్ల కాలపరిమితి గల ‘లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్’ (ఎల్.ఎస్.ఎస్.టి.) అనే ఈ ప్రాజెక్టు రూబిన్ రూపొందించింది. ఇందులోని టెలిస్కోప్ 300 టన్నులకు పైగా బరువైన ఉక్కు, గాజుతో తయారైంది. కార్బన్ డైఆకైడ్తో ఒక తీరుగా శుభ్రం అవుతుంటుంది. రాబోయే దశాబ్ద కాలంలో ఈ టెలిస్కోప్, అందులోని భారీ ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా ప్రతి 3–4 రాత్రులకు దక్షిణార్ధ గోళ ఆకాశాన్ని ఫొటోలు తీస్తుంది. ఇది ఈ మహా విశ్వాన్ని మునుపెన్నడూ లేని విధంగా నిర్ణీత వ్యవధిల్లో ఫ్రేమ్ల క్రమాన్ని తీసుకునే ‘టైమ్–లాప్స్’ సాంకేతికతతో ఫొటో తీస్తుంది. ‘‘మేము ప్రతి 30 సెకన్లకు రాత్రిపూట ఆకాశాన్ని గమనిస్తుంటాము కాబట్టి ఒక్కొక్కటి 15 సెకన్ల రెండు వరుస చిత్రాలలో, దాని స్థానం లేదా ప్రకాశాన్ని మార్చుకున్న ఏ వస్తువునైనా మేము పట్టుకోగలం’’ అని రూబిన్ ఏడాది పాటు పని చేసిన క్షితిజ కేల్కర్ తెలిపారు. చిలీలోని సెర్రో పాచోన్ పర్వతంపై రూబిన్ అబ్జర్వేటరీ ఉంటుంది. దీని వల్ల– స్థానికంగా వాతావరణ పొరలోని వెచ్చని గాలుల్లో, పై నుంచి వచ్చే శీతల పవనాలు కలిసిపోయి, తద్వారా ఏర్పడే కల్లోల వాయువుల ప్రభావం అబ్జర్వేటరీ వరకు రాదు. దాంతో నత్రాలను స్పష్టంగా చూడొచ్చు. 800 మిలియన్ డాలర్ల ఖర్చుతో, 20 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న రూబిన్కు ప్రస్తుతం తుది తనిఖీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి లోగా ఎప్పుడైనా రూబిన్ పని అధికారికంగా ఆరంభం కావచ్చు. భూమిపై అతి పెద్ద కెమెరా అయిన ఎల్.ఎస్.ఎస్.టి మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని అణువణువున పట్టి బంధించబోతోంది.4 వేల కోట్లువచ్చే 10 ఏళ్ల నిర్దిష్ట కాలానికి రూబిన్ అబ్జర్వేటరీ కనిపెట్టనున్న అంతరిక్ష విశేషాలు. ఇంత భారీగా ఖగోళ సమాచారాన్ని ఇప్పటి వరకు రాబట్టింది లేదు రూబిన్ అబ్జర్వేటరీలో ‘సిమోన్యీ సర్వే టెలిస్కోప్’ లోపలి ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా5 అ. 5 అం.: ఎల్.ఎస్.ఎస్.టి. ఎత్తు3 : ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా లోపల ఉన్న లెన్సులు;5 అడుగులు : మూడు లెన్సులలో పెద్ద లెన్సు వ్యాసం40 కెమెరా దృష్టి క్షేత్రంలో పట్టే పూర్ణ చంద్రుళ్లు 3,200 రూబిన్ కెమెరా మెగా పిక్సెల్స్ 12–50 మామూలు కెమెరాల మెగా పిక్సెల్స్ రూబిన్ అబ్జర్వేటరీ ఒక రౌండుకు 20 లక్షలకు పైగా చిత్రాలను తీస్తుంది. ప్రతి రాత్రి 20 టెరాబైట్ల సమాచారాన్ని సంగ్రహిస్తుంది. అది 50 ఏళ్ల మొత్తం డిజిటల్ మ్యూజిక్కి, ఒక లక్ష హై రిజల్యూషన ఆర్ట్ వర్క్లకు, లేదా 70 లక్షల 70 వేల ఇ–బుక్లకు సమానం. సాక్షి, స్పెషల్ డెస్క్(చదవండి: స్క్రీన్ అడిక్షన్ హద్దుల్లేకుంటే ఇక్కట్లు తప్పవు)
ఫొటోలు


‘మధరాసి’ సినిమా ప్రీ రిలీజ్ మెరిసిన హీరోయిన్ రుక్మిణీ వసంత్ (ఫొటోలు)


నటుడి కుమారుడి పెళ్లిలో కార్తీ, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ (ఫోటోలు)


‘మధరాసి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


మహా గణపతి దర్శనం..లక్షలాదిగా తరలివచ్చిన జనం (ఫొటోలు)


‘మిస్ విశాఖ’గా డాక్టర్ సృజన (ఫొటోలు)


తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు (ఫొటోలు)


‘మిరాయ్’ హీరోయిన్ అందానికి ఫిదా అవుతున్న యూత్ (ఫొటోలు)


వీకెండ్ రష్ ..భక్తజన సంద్రంగా ఖైరతాబాద్ (ఫొటోలు)


మాల్దీవుల్లో కాజల్ గ్లామర్ ట్రీట్.. ఫ్యామిలీ కలిసి (ఫొటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబరు 06)
అంతర్జాతీయం

‘ఎడ్యుకేట్ గాళ్స్’కు ‘మెగసెసే’ అవార్డు
మనీలా: మనదేశంలో బాలికల విద్యకోసం పనిచేస్తున్న ప్రముఖ ఎన్జీవో ‘ఎడ్యుకేట్ గాళ్స్’ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే–2025 అవార్డును గెలుచుకుంది. ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయ సంస్థగా రికార్డు సృష్టించింది. ‘ఎడ్యుకేట్ గాళ్స్ ద్వారా మారూమూల ప్రాంతాల్లోని బాలికలు, యువతులకు విద్యనందిస్తోంది. వారిలోని నైపుణ్యాలను వెలికి తీసి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని నింపుతోంది. ఎంతో నిబద్ధత, అంకితభావంతో ఈ పని చేస్తున్న సఫీనా హుస్సేన్ ఆసియాలో అత్యున్నత గౌరవానికి ఎంపికైంది’రామన్ మెగసెసే అవార్డ్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన మాల్దీవులకు చెందిన షాహినా అలీ, ఫిలిప్పీన్స్కు చెందిన ఫ్లావియానో ఆంటోనియో ఎల్ విల్లానుయేవా కూడా ఈ అవార్డును దక్కించుకున్నారు. నవంబర్ 7న మనీలాలోని మెట్రోపాలిటన్ థియేటర్లో జరిగే అవార్డు ప్రదానోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ అవార్డు ఎడ్యుకేట్ గాళ్స్కే కాదు.. మొత్తం దేశానికే చారిత్రాత్మకమైదని సంస్థ వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్ అన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన సఫీనా హుస్సేన్ 2007లో ఎడ్యుకేట్ గాళ్స్ను స్థాపించారు. అప్పటివరకూ శాన్ఫ్రాన్సిస్కోలో పనిచేసిన ఆమె..మహిళల నిరక్షరాస్యతపై పనిచేయాలని భారత్కు తిరిగొచ్చారు. రాజస్థాన్లో తన సేవను ప్రారంభించారు. చదువుకోని లేదా బడి బయట ఉన్న బాలికలను తరగతి గదిలోకి తీసుకొచ్చారు. లక్షలాది మంది యువతులకు ఉన్నత విద్యతోపాటు, ఉపాధి కల్పించే విద్యనందించేందుకు కృషి చేస్తున్నారు. ఆసియా నోబెల్గా పిలుచుకునే రామన్ మెగసెసే అవార్డు ప్రజలకు నిస్వార్థ సేవలందించిన, సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు, సంస్థలకు అందజేస్తారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం 1957లో అవార్డును నెలకొల్పారు. రామన్ మెగసెసే పతకం, ప్రశంసా పత్రంతోపాటు నగదు బహుమతిని అందజేస్తారు. భారత్ నుంచి గతంలో రామన్ మెగసెసే అవార్డును గెలుచుకున్న వారిలో మదర్ థెరిసా (1962), జయప్రకాష్ నారాయణ్ (1965), చిత్రనిర్మాత సత్యజిత్ రే (1967), జర్నలిస్ట్ రవీష్ కుమార్ (2019), పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ (2018), అరవింద్ కేజ్రీవాల్ (2006), ఆర్టీఐ కార్యకర్త అరుణా రాయ్ (2000), కిరణ్ బేడి (1994) జర్నలిస్ట్ అరుణ్ శౌరి (1982) ఉన్నారు.

బంధం బలోపేతమే లక్ష్యం
తియాంజిన్: గల్వాన్ ఘటన తర్వాత ఉద్రిక్తతకు నిలయంగా మారిన సరిహద్దు సమస్యను పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ముందుకొచ్చాయి. షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సన్నాహక భేటీలో భాగంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తియాంజిన్ తీరనగరంలో దాదాపు 60 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘భారత్, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువురం కంకణబద్దమయ్యాం. సమష్టిగా వాణిజ్యం, పెట్టుబడులను మరింతగా విస్తరించి అంతర్జాతీయ వాణిజ్య సుస్థిరతలో మన రెండు ఆర్థికవ్యవస్థలు ఎంతటి కీలకమో చాటి చెబుదాం. సరిహద్దు వెంట ఉద్రిక్తత పొడచూపినా సరే ప్రస్తుతం శాంతి, సుస్థిరత కొనసాగడం సంతోషదాయకం. సరిహద్దు వివాదాల పరిష్కారంలో మన ఇరుదేశాల ప్రతినిధి బృందాలు ఉమ్మడి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాయి. భారత్, చైనా మధ్య నేరుగా విమానసర్వీసులను సైతం పునరుద్దరించాం. మన ద్వైపాక్షిక సహకారం అనేది ఇరుదేశాల్లోని 280 కోట్ల మంది ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో మన బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. షాంఘై సహకార సంస్థకు అధ్యక్ష బాధ్యతలు అద్బుతంగా పోషిస్తున్న మీకు నా అభినందనలు. కజాన్ నగరంలో మన చివరి భేటీ ఇరుదేశాల ద్వైపాక్షిక బంధంలో పురోగతికి బాటలువేసింది’’అని జిన్పింగ్తో మోదీ అన్నారు. భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 50% టారిఫ్ల భారం మోపిన వేళ ఎస్సీఓ వేదికగా భారత్, చైనా మైత్రీబంధం బలపడటం వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలకు దర్ప ణం పట్టింది. దాదాపు ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం విశేషం. భేటీ తర్వాత మోదీ చైనా కమ్యూనిస్ట్పార్టీ పాలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాయ్క్వీని కలిశారు. జిన్పింగ్తో ఉమ్మడి నిర్ణయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చేలా సాయపడాలిన కాయ్క్వీని మోదీ కోరారు. ఎన్నెన్నో అంశాల్లో ఏకతాటి మీదకు ద్వైపాక్షిక వాణిజ్యం మొదలు పెట్టుబడులు, వాణిజ్య లోటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై మోదీ, జిన్పింగ్ చర్చలు జరిపారు. భేటీ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలోపేర్కొంది. ‘‘భారత్, చైనాలు రెండూ అభివృద్ధి భాగస్వాములేనని మోదీ, జిన్పింగ్ పునరుద్ఘాటించారు. విబేధాలు వివాదాలుగా మారొద్దని ఇరునేతలు అభిలషించారు. నేరుగా విమాన సర్వీసులు మొదలు వీసా జారీ వంటి ఇతరత్రా సదుపాయాల ద్వారా ఇరుదేశాల ప్రజల మధ్య సంబందబాంధ్యవాల పెంపును ఇరునేతలు ఆశిస్తున్నారు. వాణిజ్య బంధం పెంపు, వాణిజ్యలోటు తగ్గింపునకు రాజకీయ వ్యూహాత్మక మార్గంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఇరునేతలు గుర్తించారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనేది ఇరు దేశాలకు ఉంది. ఇందులో మూడో దేశం జోక్యాన్ని అస్సలు అనుమతించకూడదని ఇరునేతలు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా భారత్లో వచ్చే ఏడాది జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు విచ్చేయాలని జిన్పింగ్ను మోదీ సాదరంగా ఆహ్వానించారు. ఆహ్వానించినందుకు మోదీకి జిన్పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భారత బ్రిక్స్ సారథ్యానికి జిన్పింగ్ మద్దతు ప్రకటించారు’’అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఏనుగు, డ్రాగన్ డ్యాన్స్: జిన్పింగ్తియాంజిన్లో మోదీ, జిన్పింగ్ కరచాలనం ట్రంప్కు కంటగింపుగా మారింది. ఇరుగుపొరుగు వైరిదేశాలు టారిఫ్ల మోత కారణంగా మళ్లీ సత్సంబంధాల దిశ గా అడుగులేస్తూ.. సుంకాల సుత్తితో మోదినంత మా త్రాన అంతా అయిపోలేదని పరోక్ష హెచ్చరికలు చేశా యి. ఈ సందర్భంగా జిన్పింగ్ మాట్లాడారు. ‘‘చైనా కు భారత్ చక్కని మిత్రదేశంగా మారుతోంది. ఇరుదేశాల బంధాన్ని వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా కొనసాగించాలి. చైనా, భారత్ బంధాన్ని కేవలం సరిహద్దు అంశం నిర్ణయించకూడదు. సరిహద్దు కోణంలో బంధాన్ని చూడకూడదు. ఆసియాలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు పరస్పర వాగ్దానాలతో ముందుకు సాగాలి. అక్కడ విరోధానికి తావివ్వకూడదు. ప్రపంచం ఇప్పుడు శతాబ్దానికొకసారి సంభవించే కీలక మలుపులో ఉంది. అంతర్జాతీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. తూర్పున ఉన్న చైనా, భారత్ ప్రాచీన నాగరికతతో భాసిల్లింది. మనవి ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశాలు. దక్షిణ ధృవ ప్రపంచంలో మనమే పాత సభ్యులం. ఈ తరుణంలో పొరుగు దేశాలమైనం మనం మిత్రులుగా మెలగాలని నిర్ణయించుకోవడం సరైన ఎంపిక. డ్రాగన్(చైనా), ఏనుగు(భారత్) కలిసి నృత్యం చేయాల్సిన సమయం వచ్చింది. ఎదుటి దేశాన్ని మన అభివృద్దికి అవకాశంగా భావించాలి. అంతేగానీ ప్రమాదకారిగా భావించకూడదు. బహుళధృవ ప్రపంచం కోసం పాటుపడదాం. అంతర్జాతీయ సంస్థల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేద్దాం. ఆసియాసహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్తాపనకు మనవంతు కృషిచేద్దాం’’అని మోదీతో జిన్పింగ్ అన్నారు.గ్రూప్ ఫొటోలో జిన్పింగ్, పుతిన్ పక్కపక్కనే ద్వైపాక్షిక భేటీ తర్వాత జిన్పింగ్ షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) విందు కోసం సభ్యదేశాల అగ్రనేతలను ఆహ్వానించారు. ఇందుకోసం తొలుత ఒక్కో నేతలను వేదిక మీదకు ఆహ్వానించి విడివిడిగా ఫొటో దిగారు. తర్వాత నేతలందరితో కలిసి సతీసమేతంగా గ్రూప్ ఫొటో దిగారు. ఇందులో జిన్పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ ముందు వరసలో మధ్యలో నిల్చున్నారు. జిన్పింగ్కు కుడివైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిల్చున్నారు. మరో ఇద్దరు నేతల తర్వాత ప్రధాని మోదీ సైతం ముందు వరసలో నిల్చుని గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జూ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు ముందు వరసలో నిల్చున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ అగ్రనేతలు ఇలా ఒక అంతర్జాతీయ వేదికపై కనిపించడం ఇదే తొలిసారి. కజక్స్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్సహా పలు దేశాల అగ్రనేతలు పర్యవేక్షక, దౌత్య భాగస్వామి, అతిథులుగా ఎస్సీఓ విందులో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి, ఆసియాన్ వంటి సంస్థలు సైతం ఎస్సీఓ చర్చల్లో పాల్గొననున్నాయి. జిన్పింగ్ మెచ్చిన కారు మోదీ కోసం రెండ్రోజుల పర్యటన నిమిత్తం చైనాకు విచ్చేసిన ప్రధాని మోదీ అక్కడ ఎక్కడికి వెళ్లాలన్నా ప్రభుత్వ వాహనంలోనే వెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం మోదీ కోసం ప్రత్యేకంగా హాంగ్క్వీ కారును తెప్పించారు. ఈ మోడల్ కారు అంటే జిన్పింగ్కు మహా ఇష్టం. 2019లో మహాబలిపురంలో జిన్పింగ్ పర్యటించినప్పుడ ఇదే యాంగ్క్వీ ఎల్5 కారులో కలియతిరిగారు. ఈ కారును రెడ్ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. మేడిన్ ఇండియాలాగే ఈ కారు మేడిన్ చైనా అన్నమాట. కమ్యూనిస్ట్ పార్టీ చైనా అగ్రనేతల పర్యటన కోసం 1958లో చైనా ప్రభుత్వరంగ ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ సంస్థ ఈ మోడల్ కారును తొలిసారిగా రూపొందించింది. ఇక తియాంజిన్లో ఉన్నంతసేపూ పుతిన్ రష్యా తయారీ ఆరస్ మోడల్కారులో తిరగనున్నారు. పాతతరం మోడల్లో ఈ కారు ఉంటుంది. రష్యాకు చెందిన ఆరస్ మోటార్స్ సంస్థ ఈ కారును తయారుచేసింది. చైనా తయారీ నంబర్ప్లేట్ను తగిలించి పుతిన్ ఈ కారులో ప్రయాణిస్తున్నారు. జిన్పింగ్ నోట పంచశీల మాట భారత్, చైనాల మధ్య శాంతి, సుస్థిరతలు పరిఢవిల్లాలంటే దశాబ్దాలనాటి ‘పంచశీల’ఒడంబడిక సూత్రాలను అవలంభిస్తే సబబుగా ఉంటుందని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. మోదీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా జిన్పింగ్ తన మనసులో మాట బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఆనాటి పంచశీల ఒడంబడిక అంశం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పంచశీల సూత్రాల ఉనినికి గతంలో ఎన్నో ఒప్పందాల సందర్భంగా భారత్, చైనా గుర్తించాయి. ‘‘పంచశీల సూత్రాలను 70 ఏళ్ల క్రితం నాటి చైనా, భారత్ దిగ్గజ నాయకులు రూపొందించారు. ఇవే సూత్రాలు ఇప్పుడూ అనుసరణీయమే’’అని జిన్పింగ్ అన్నారు. ఏమిటీ పంచశీల ఒప్పందం? 1954 ఏప్రిల్ 29వ తేదీన భారత్, చైనా అనుసరించాల్సిన విధానాలను ఐదు సూత్రాల నియమావళిగా రూపొందించారు. వీటిని పంచశీల సూత్రాలు అంటారు. అవి.. 1. తోటి దేశ ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వాన్ని పూర్తిస్తాయిలో గౌరవించడం 2. ఆ దేశంపై దురాక్రమణకు పాల్పడకపోవడం 3. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం 4. ఇరుదేశాల మధ్య సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాల కోసం కృషిచేయడం 5. శాంతియుత సహజీవనానికి బాటలు వేయడంఆంక్షలపై పోరాడుతాం: పుతిన్ ట్రంప్ విధించిన వివక్షాపూరిత ఆంక్షలపై చైనా, రష్యా పోరాడుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. ఎస్సీఓ సదస్సు కోసం తియాంజిన్ సిటీకొచ్చిన ఆయన చైనా అధికారిక వార్తాసంస్త జిన్హువాతో మాట్లాడారు. ‘‘అంతర్జాతీయ సవాళ్లను బ్రిక్స్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా కీలక మౌలికసదుపాయాల ప్రాజెక్టుల నిర్వహణకు చైనా, రష్యా అదనపు వనరుల సమీకరణలో తలమునకలయ్యాయి. సామాజికఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారినఅమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు చైనా, రష్యా సమష్టిగా పోరాడుతున్నాయి’’అని పుతిన్ అన్నారు. మోదీ, జిన్పింగ్ భేటీ ‘పది’నిసలు → రష్యాలో బ్రిక్స్ సదస్సు తర్వాత తొలిసారిగా భేటీ అయిన మోదీ, జిన్పింగ్లు ఇకమీదటైనా ద్వైపాక్షిక ఒప్పందాల్లో పురోగతిని సాధించాలని నిర్ణయించారు → భారత్, చైనా మధ్య నేరుగా పౌరవిమానయాన సర్వీసులను విస్తరించాలని నిర్ణయించారు → కైలాస్ మానససరోవర్ యాత్ర కోసం భారతీయులకు యాత్రా వీసాలు ఇచ్చేందుకు చైనా ముందుకొచ్చింది → పరస్పర వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూనే మూడో దేశం జోక్యాన్ని ఏమాత్రం సహించకూడదని నిర్ణయించుకున్నారు → సరిహద్దు వెంట బలగాల ఉపసంహరణతో శాంతి స్థాపన సాధ్యమైందని నేతలు పునరుద్ఘాటించారు → భారత్, చైనా ఎప్పటికీ మిత్రులుగా, మంచి పొరుగుదేశాలుగా మెలగాలని జిన్పింగ్ అభిలషించారు → ఇరుదేశాల బంధాన్ని కేవలం సరిహద్దు వివాదం కోణంలో చూసే ధోరణిని విడనాడాలని నిర్ణయించుకున్నారు. వాణిజ్య, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేయాలని కోరుకున్నారు → చైనా కంపెనీలకు భారత్లో అవకాశం ఇవ్వడం ద్వారా భారత్లో విద్యుత్వాహన రంగం సైతం వేగంగా విస్తరిస్తుందని ఇరునేతలు ఆశించారు → ఇటీవల చర్చల నిర్ణయాలకు అనుగుణంగా మూడు సరిహద్దుల గుండా సరకు రవాణా, వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని మోదీ, జిన్పింగ్ నిర్ణయించారు → అధిక టారిఫ్లతో చెడిన అమెరికా బంధానికి బదులు పరస్పర బంధాన్ని బలపర్చుకుని అంతర్జాతీయంగా వాణిజ్యరంగంలో ఎదగాలని ఇరునేతలు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

మీ బోర్డర్ దాటి వస్తున్న పాక్ టెర్రరిస్టుల సంగతేంటి?
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. ఇందులో చైనా సరిహద్దుల నుంచి భారత్లోకి చొరబడుతున్న పాక్ టెర్రరిస్టుల అంశాన్ని కూడా ప్రధాని మోదీ.. జిన్పింగ్ వద్ద ప్రస్తావించారు. అయితే దీనికి చైనా తన సంపూర్ణ మద్దతును భారత్కు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ‘ జిన్పింగ్ వద్ద పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను కూడా మోదీ ప్రస్తావించారు. ఇందుకు చైనా సానుకూలంగా స్పందించింది. టెర్రర్ కార్యకలాపాల వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని జిన్పింగ్ అన్నారు. ఎటువంటి ఉగ్రవాద చర్యల నిర్మూలనకైనా తమ మద్దతు ఉంటుందని జిన్పింగ్ అన్నారు. ఇరుదేశాలకు ప్రమాదంగా మారిన ఉగ్రవాద అంశాన్ని జిన్పింగ్ కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత్కు తమ వంతు సహకారం అందిస్తామన్నారు’ అని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. టియాంజిన్ నగరంలో ఎస్సీవో సదస్సులో పాల్గొన్న మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయ శాంతి, ఆర్థిక స్థిరత్వం, సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపు, సాంకేతిక రంగాల్లో సహకారం పెంచుకునే వంటి అంశాలపై చర్చలు జరిగాయి.వాణిజ్య, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్-చైనా మధ్య స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతాయి అని ప్రధాని మోదీ తెలపడంతో ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడానికి అడుగులు పడ్డాయి. ఈ పర్యటన ద్వారా భారత్ తన ప్రాంతీయ ప్రాబల్యాన్ని చాటింది. ఇది భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది.

‘అసలు ట్రంప్కు బుర్ర ఉందని అనుకోవడం లేదు’
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఫుల్ స్టాప్ పడ్డ పలు ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా మోదీ.. చైనాలో అడుగుపెట్టారు. ఎప్పట్నుంచో భారత్తో సంబంధాల కోసం ఎదురుచూస్తున్న చైనా కూడా మోదీ పర్యటనకు ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంచితే, భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ సుంకాలను 50 శాతం పెంచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై చైనాకు చెందిన అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు ఎయిమర్ టాన్జెన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నానని చెప్పుకుంటున్న ట్రంప్కు కనీసం బుర్ర ఉంటే భారత్పై ఆ విధంగా సుంకాలు విధించే వాడు కాదంటూ మండిపడ్డారు. ప్రపంచ మార్కెట్ పరంగా చూసినా, కార్మికుల పరంగా చూసినా భారత్ అతి పెద్దదని, అటువంటి దేశంపై ట్రంప్ విజ్ఞత లేకుండా వ్యవహరించి తప్పు చేశాడన్నారు . ట్రంప్ తన బెదిరింపులతో లొంగదీసుకోవాలనుకోవడం, అందులోనూ భారత్ లాంటి దేశంపై సుంకాలతో కాలు దువ్వడం వంటిది అమెరికాకే మంచిది కాదన్నారు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్పింగ్-మోదీల మధ్య జరుగుతున్న చర్చలతో మరో కొత్త శకం ఆరంభం కానుందన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ను బలవంతంగా లొంగిపోయేలా చేయాలనుకున్నారు. రష్యా ఆయిల్ కొంటే సుంకాలు విధించడం ఏంటి?,. భారత్ లాంటి దేశాన్ని తక్కువ చేసి చూడటం సమంజసం కాదనేది నా అభిప్రాయం. తెలివైన వారు ఎవరూ కూడా ఇలా వ్యవహరించరు. ట్రంప్ చర్య సరైనది కాదు. భారత్కు బెదిరింపులకు ఎదురొడ్డి నిలబడే శక్తి ఉంది.. అవకాశం కూడా ఉంది’ అని ఎయిమర్ టాన్జెన్ స్సష్టం చేశారు. ఇదీ చదవండి: భారత్లోకి మళ్ళీ టిక్టాక్?: మొదలైన నియామకాలు
జాతీయం

సెప్టెంబర్లోనూ భారీ వర్షాలు
న్యూఢిల్లీ: సెప్టెంబరు నెలలోనూ దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఏటా సెప్టెంబరులో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని, అయితే ఈ ఏడాది ఈ నెలలో సాధారణం కంటే 109 శాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడి జనజీవనం స్తంభించే ముప్పు ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్లో నదులు ఉప్పొంగి కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలకు దారితీయవచ్చని, దక్షిణ హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్లలో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగిస్తాయని హెచ్చరించారు. 1980 నుంచి ఏటా సెప్టెంబరులో భారత్లో వర్షపాతం పెరుగుతోందని ఆయన తెలిపారు. అయితే 1986, 1991, 2001, 2004, 2010, 2015, 2019 సంవత్సరాల్లో సెప్టెంబరు నెలల్లో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. సెప్టెంబరులో పశ్చిమ మధ్య, వాయవ్య, దక్షిణ భారత్లోని చాలా ప్రాంతాల్లో నెలవారీ సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో, సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చని మోహపాత్రా తెలిపారు. ఇక, తూర్పు మధ్య భారత్, తూర్పు, ఈశాన్య, వాయవ్య భారత్లోని పలు ప్రాంతాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ స్థాయుల్లో ఉండొచ్చని వెల్లడించారు.3నెలలూ సాధారణం కంటే అధిక వర్షపాతం‘జూన్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య దేశంలో 743.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది దీర్ఘకాలిక సగటు 700.7 మి.మీ కంటే దాదాపు 6 శాతం ఎక్కువ. జూన్ నెలలో సాధారణం కంటే దాదాపు 9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూలై నెలలో 294.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే దాదాపు 5 శాతం ఎక్కువ. ఆగస్టులో 268.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 శాతం ఎక్కువ. ఇప్పటివరకు వర్షాకాలం మూడు నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది’ అని మోహపాత్రా వివరించారు.

ఎన్ఆర్ఈజీఎస్ ‘అధిక ఖర్చులపై’ విచారణకు కేంద్రం ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో ‘అధిక ఖర్చు’గా గుర్తించిన పనులపై రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరపాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో ఆడిట్లు, ఫీల్డ్ ఇన్స్పెక్షన్లు నిర్వహించిన కేంద్రం, తొలిసారి రాష్ట్రాలే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేయాలని సూచించింది. ఈ మేరకు ఏప్రిల్లోనే రాష్ట్రాలకు ఒక సలహా జారీ చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, కొన్ని పనుల్లో ఖర్చులు ఎందుకు ఎక్కువయ్యాయనే విషయంపై విశ్లేషణను కూడా పంపింది. దీనిపై సాంకేతిక, పరిపాలనా అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నివేదికలు సమర్పించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ అంశంపై ఇప్పటికే త్రిపుర, జార్ఖండ్, మిజోరం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు తాత్కాలిక నివేదికలు సమర్పించగా, మిగతా రాష్ట్రాలు స్పందించలేదు. దీంతో జూలై 14, 15 తేదీల్లో జరిగిన 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి పనితీరు సమీక్ష కమిటీ (పీఆర్సీ) సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. నివేదికల సమర్పణలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించిన కేంద్ర అధికారులు, వెంటనే పూర్తి వివరాలతో నివేదికలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. 2030 వరకు పథకాన్ని కొనసాగించేలా.. ప్రతీ ఏడాది సుమారు రూ.1 లక్ష కోట్ల వరకు వ్యయం అయ్యే ఎన్ఆర్ఈజీఎస్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.86 వేల కోట్ల కేటాయింపులు చేసింది. ఇప్పటివరకు ఈ పథకంపై మొత్తం రూ.11.57 లక్షల కోట్ల వ్యయం చేశారు. కాగా 2006లో యూపీఏ–1 ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా, 2008–09 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేశారు. కరోనా సమయంలో (2020–21) 7.55 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఈ పథకంలో పనిచేసి రికార్డు సృష్టించాయి. ఆ తరువాత డిమాండ్ క్రమంగా తగ్గుతూ 2024–25 నాటికి 5.79 కోట్ల కుటుంబాలకు పడిపోయింది. ఇక, ఈ పథకాన్ని 2029–30 వరకు కొనసాగించేందుకు రూ.5.23 లక్షల కోట్ల వ్యయంతో కొత్త ప్రతిపాదనను కేంద్రం వ్యయ ఆర్థిక కమిటీ (ఈఎఫ్సీ)కు పంపింది. అయితే.. పశ్చిమ బెంగాల్లో 2022 మార్చి నుంచి ఈ పథకం నిలిపివేశారు.

ఈసారి వరి మరింత సాగు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రధాన ఆహార పంట వరి ఈ ఏడాది ఖరీఫ్లో సాధారణానికి మించి సాగైంది. ఖరీఫ్లో వరి సాగు సగటు విస్తీర్ణం 4.03 కోట్ల హెక్టార్లుగా ఉండగా, ఈ సీజన్లో ఇప్పటివరకు 4.20కోట్ల హెక్టార్లలో సాగైంది. గత ఏడాది ఇదే సమయంలో 3.90 కోట్ల హెక్టార్లలో మాత్రమే వరి సాగయ్యింది. అంటే దాదాపు 8 శాతం పెరుగుదల నమోదయిందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఒడిశా, పశి్చమ బెంగాల్, బిహార్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వర్షపాతం అనుకూలంగా ఉండటం, కనీస మద్దతు ధర హామీ, ప్రభుత్వ కొనుగోలు విధానాలు రైతుల ఉత్సాహానికి కారణమయ్యాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. మరోవైపు ఈ సీజన్లో దేశవ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా పెరిగింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 10.74కోట్ల హెక్టార్లలో పంటలు వేశారు. ఇది గతేడాది ఇదే సమయంలో ఉన్న 10.38కోట్ల హెక్టార్ల కంటే ఎక్కువ. అంటే మొత్తమ్మీద 3% పెరుగుదలతో 0.35 కోట్ల హెక్టార్ల పెరుగుదల నమోదైంది. పంటల వారీగా చూస్తే వరి, మొక్కజొన్న పంటలు విస్తీర్ణం పెరగ్గా, సోయా, పత్తి సాగు తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. పెరిగిన మొక్కజొన్న.. తగ్గిన సోయాబీన్ఈ ఏడాది మొక్కజొన్న సాగు గతేడాదితో పోలిస్తే 12 శాతం పెరిగి 93.34 లక్షల హెక్టార్లకు చేరింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మొక్కజొన్న విస్తీర్ణం పెరుగుదల గణనీయంగా నమోదైంది. తక్కువ పెట్టుబడి ఖర్చులు, వర్షాభావానికి తట్టుకునే లక్షణం, పశుగ్రాసం, స్టార్చ్, బయోఫ్యూయెల్స్ పరిశ్రమల్లో పెరుగుతున్న డిమాండ్ ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొన్నారు. రాగి, ఇతర చిరు ధాన్యాల సాగు కూడా 10% పైగా పెరుగుదల చూపించాయి. అదే సమయంలో సోయాబీన్ సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది 1.24కోట్ల హెక్టార్లలో సాగవగా, ఈసారి 1.20 కోట్ల హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. అంటే 4.77 లక్షల హెక్టార్లలో సాగు తగ్గింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో రైతులు స్థిరమైన ఆదాయం కోసం సోయా నుంచి మొక్కజొన్నకు మారినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. దీనివల్ల దేశీయ ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా పప్పుధాన్యాల విస్తీర్ణంలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఈ ఏడాది 1.12 కోట్ల హెక్టార్లలో సాగవగా, గత ఏడాది ఇది 1.11 కోట్ల హెక్టార్లలో సాగింది. అందులో మినుము 7% పెరిగి 0.21 కోట్ల హెక్టార్లు చేరుకుంది. అయితే కందుల సాగు 2% మేరకు తగ్గింది. పత్తి సాగుకు వెనుకడుగుకీలక వాణిజ్య పంట అయిన పత్తి ఈ సీజన్లో క్షీణతను చవిచూసింది. 2024లో 1.11కోట్ల హెక్టార్లలో సాగవగా, ఈసారి 1.08 కోట్ల హెక్టార్లలో మాత్రమే రైతులు వేశారు. అంటే 2.92 లక్షల హెక్టార్లు తగ్గింది. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. వర్షపాతం లోటు, అధిక ఇన్పుట్ ఖర్చులు, పురుగుల బెడద, అలాగే బియ్యం, మొక్కజొన్న వంటి పంటల నుంచి వచ్చే మెరుగైన ఆదాయం దీనికి కారణమని అధికారులు విశ్లేíÙస్తున్నారు. పత్తి తగ్గుదల వల్ల దేశీయ వస్త్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని నిపుణుల అభిప్రాయం. నూనెగింజలు తగ్గుదల నూనెగింజల విస్తీర్ణం మాత్రం తగ్గింది. గతేడాది 1.87 కోట్ల హెక్టార్లలో సాగవగా, ఈసారి అది 1.82కోట్ల హెక్టార్లకు పడిపోయింది. ముఖ్యంగా సోయా 4% తగ్గగా, నువ్వులు 6%, సన్ ఫ్లవర్ 9% తగ్గుముఖం పట్టాయి. అయితే ఆముదాల సాగు మాత్రం 30% మేర పెరగడం గమనార్హం. అదే సమయంలో చెరుకు సాగు వృద్ధి సాధించింది. గత ఏడాది 0.55 కోట్ల హెక్టార్లలో సాగగా, ఈ సీజన్లో అది 0.57 కోట్ల హెక్టార్లకు పెరిగింది. ఖరీఫ్ 2025 గణాంకాలు మిశ్రమ సంకేతాలు ఇస్తున్నాయి. బియ్యం, మొక్కజొన్న విస్తీర్ణం పెరగడం దేశ ఆహార భద్రతకు సానుకూలంగా ఉన్నప్పటికీ సోయా, పత్తి సాగు విస్తీర్ణం తగ్గుదల దేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వర్షపాతం, ప్రభుత్వ కొనుగోలు వ్యూహాలు, అంతర్జాతీయ మార్కెట్ ధరలు రైతుల భవిష్యత్ లాభనష్టాలను నిర్ణయించనున్నాయి.సగటు సాగు 4.03కోట్ల హెక్టార్లు ఈ దఫా 4.20కోట్ల హెక్టార్లలో వరి నాట్లు గతేడాది కంటే 29.60లక్షల హెక్టార్లు అధికం పప్పు ధాన్యాల సాగులో గణనీయ పెరుగుదల

అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు బంద్
న్యూఢిల్లీ: అమెరికా కస్టమ్స్ శాఖ తాజాగా ప్రకటించిన నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ ప్రకటించింది. 100 డాలర్లకంటే ఎక్కువ విలువైన బహుమతులను అమెరికా భూభాగంలోకి డెలివరీ చేసేందుకు తొలుత ఇండియాపోస్ట్ తాత్కాలిక విరామం ఇవ్వగా తాజాగా అన్ని కేటగిరీల పార్శిళ్లను అమెరికాకు డెలివరీ చేయడం ఆపేసింది. ‘‘ఆగస్ట్ 22న జారీచేసిన బహిరంగ నోటీస్ ప్రకారమే అమెరికాకు పార్శిళ్ల డెలివరీను ఆపేశాం. అయితే అమెరికా కస్టమ్స్ శాఖ విడుదలచేసిన తాజా నిబంధనల్లో స్పష్టత కొరవడింది. ఇలాంటి అస్పష్ట పరిస్థితుల్లో అమెరికాకు లేఖలు, డాక్యుమెంట్లు, బహుమతుల వంటి ఎలాంటి వస్తువులను పంపడం సమర్థనీయం కాదు. అందుకే అన్నిరకాల పార్శిళ్లను అమెరికాకు పంపడం నిలిపేస్తున్నాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. అమెరికా విభాగాల స్పందనకు అనుగుణంగా వీలైనంత వరకు త్వరగా సేవల పునరుద్ధరణకు కట్టుబడిఉన్నాం’’అని ఇండియాపోస్ట్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఎన్ఆర్ఐ

లగ్జరీ కారులో పేరెంట్స్ను సర్ప్రైజ్ చేసిన భారతీయ యువతి
బాగా చదువుకోవాలి..మంచి ఉద్యోగం సంపాదించాలి అమ్మానాన్నల్నికారులో తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలి. లేదంటే.. తొలిసారి వాళ్లని విమానం ఎక్కించాలనే కలను సాకారం చేసుకోవాలి. ఇలాంటి కలలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే సగటు భారతీయ ఉద్యోగులకు సర్వ సాధారణం. అలా ఒక భారతీయ యువతి ఖరీదైన కారులో తల్లిదండ్రులను షికారుకు తీసుకెళ్లిన వీడియో ఒకటి నెట్టింట్ పలువుర్ని ఆకట్టుకుంటోంది.ఇండియాకు చెందిన అపూర్వ బింద్రే తన తల్లిదండ్రులను డ్రైవర్ లేని కారులో శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవ్కు తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోతో పాటు తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్ల ఆమెను, ఆమె తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేస్తూ, బింద్రే “నా తల్లిదండ్రులను శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లెస్ కారు వేమోలో తీసుకెళ్లా.. వావ్, నైస్ ఫీలింగ్! ఇది మాన్యువల్ డ్రైవర్ కంటే సురక్షితంగా, స్మూత్గా అనిపించింది. అందుకే వెంటనే ఇంకో రైడ్ కూడా బుక్ చేసుకున్నాం. మా అమ్మా నాన్న చెప్పాల్సింది చాలా ఉంది అది త్వరలోనే’’ అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 94 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు View this post on Instagram A post shared by Apurva Bendre (@apurva_bendre)‘‘ఈ రైడ్తో మీ పేరెంట్స్ పూర్తిగా థ్రిల్ అయి ఉండాలి!” అని ఒకరు, “చాలా సరదాగా ఉంది! వారి స్పందన ఏమిటి?” అని మరొకరు దీనిని “ఒక తరాల ప్రయాణం” అని ఇంకొకరు అభివర్ణించారు. చాలా గర్వంగా ఉంది. మీరు మీ తల్లిదండ్రుల కలను నెరవేర్చడం సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అనే కమెంట్లు కూడా చూడొచ్చు.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు

ఎవరీ కృషాంగి మేష్రామ్? అతి పిన్నవయస్కురాలైన సొలిసిటర్గా..
భారత సంతతి అమ్మాయి అసాధారణమైన ఘనతను సాధించింది. అతి చిన్న వయసులోనే ఇంగ్లాండ్, వేల్స్లలో సొలిసిటర్ అయ్యారు. అతి చన్ని వయసులోనే ఈ ఘనతను సాధించి..అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరంటే..ఆ అమ్మాయే పశ్చిమ బెంగాల్కి చెందిన కృషాంగి మేష్రామ్. కేవలం 21 ఏళ్ల వసులోనే సొలిసిటర్ అయ్యింది. 15 ఏళ్లకే మిల్టన్ కీన్స్ ది ఓపెన్ యూనివర్శిటీలో తన లా చదువును ప్రారంభించి.. న్యాయశాస్త్రంలో ఫస్ట్క్లాస్ ఆనర్స్ డిగ్రీని పొందింది. అయితే కృషాంగి మాత్రం 15 ఏళ్లకే ఓపెన్ యూనివర్సిటీలో చదివే అవకాశం లభించడం వల్లే ఈ ఘనత సాధించగలిగానని ఆనందంగా చెప్పుకొచ్చింది. తనకు న్యాయశాస్త్ర పట్ల ఉన్న ప్రగాఢమైన అభిరుచే ఈ విజయానికి కారణమని అంటోందామె. ఓపెన్యూనివర్సిటీ ద్వారా లాగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మరీ ఈ విజయాన్ని అందుకుందామె. ఎవరీ కృషాంగి మేష్రామ్ అంటే..పశ్చిమ బెంగాల్లో జన్మించి కృషాంగీ ఇస్కాన్ మాయాపూర్ కమ్యూనిటీలో పెరిగింది. 15 ఏళ్ల వయసుకే మాయాపూర్లోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో మాధ్యమిక విద్యను పూర్తి చేసింది. తర్వాత ఒపెన్ యూనివర్సిటీ(ఓయూ)లో మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేసి న్యాయ పట్టా పొందింది. అలా 18 ఏళ్లకే న్యాయశాస్త్రంలో ఫస్ట్క్లాస్ ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రురాలైందామె. 2022లో ఒక అంతర్జాతీయ న్యాయసంస్థలో ప్రాక్టీసు కూడా ప్రారంభించింది. అలాగే ఆమె హార్వర్డ్ ఆన్లైన్లో గ్లోబల్ ప్రోగ్రామ్లు కూడా చేసింది. పైగా సింగపూర్లో వృత్తిపరమైన అనుభవాన్ని సంపాదించింది. ప్రస్తుతం యూకే, యూఏఈలలో చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తోంది. ఇక కృషాంగికి చట్టపరంగా ఫిన్టెక్, బ్లాక్చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీలునామాలు, ప్రొబేట్ వంటి ప్రైవేట్ క్లయింట్ తదితర సేవలపై ఆసక్తి ఎక్కువ. (చదవండి: Gaurav Kheterpal: భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?)

బెర్లిన్లోని చారిత్రాత్మక బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద భారత్ పరేడ్
ఇండియన్ నేషనల్ డేస్ కల్చరల్ కమిటీ (INDCC), బెర్లిన్లోని వివిధ భారతీయ సంఘాల సహకారంతో, ఆగస్టు 16, 2025న చారిత్రాత్మక బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద భారత్ పరేడ్ (ఇండియన్ నేషనల్ డే పరేడ్)ను విజయవంతంగా నిర్వహించింది. ఇండో-జర్మన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని INDCC అధ్యక్షుడు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.భారతదేశం - జర్మనీ మధ్య సామరస్యం, స్నేహం మరియు సాంస్కృతిక మార్పిడికి ప్రతీకగా బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద కవాతు ప్రారంభమై శాంతి స్థూపం వరకు కొనసాగింది.జర్మనీకి భారత రాయబారి శ్ అజిత్ వినాయక్ గుప్తే , ప్రీతి గుప్తే ఈ వేడుకల్లో పాల్గొని భారతీయ సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం భారతీయ సంఘాలు, సాంస్కృతిక బృందాలు, కళాకారులు మరియు సమాజ సభ్యుల విస్తృత శ్రేణిని ఒకచోట చేర్చింది. కుటుంబాలు, పిల్లలు మరియు స్వచ్ఛంద సేవకులు సహా 5,000 మందికి పైగా పాల్గొన్నవారు రంగురంగుల భారత్ పరేడ్లో పాల్గొన్నారు. సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, ధోల్లు, దేశభక్తి గీతాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు భారతదేశపు శక్తివంతమైన వైవిధ్యాన్ని ప్రదర్శించాయి, బెర్లిన్ హృదయాన్ని "భిన్నత్వంలో ఏకత్వం" అనే స్ఫూర్తితో నింపాయి.తెలంగాణ/తెలుగు సమాజం బతుకమ్మ - తెలంగాణ పూల పండుగ - మరియు అందమైన కూచిపూడి శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించడం ద్వారా ప్రత్యేక సహకారాన్ని అందించింది, ఈ రెండూ ప్రేక్షకులను ఆకర్షించాయి మరియు వేడుకలకు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక రుచిని జోడించాయి. ఈ వేడుకను గొప్పగా విజయవంతం చేయడంలో అవిశ్రాంతంగా సహకరించిన అన్ని భారతీయ సంఘాలు, స్వచ్ఛంద సేవకులు, స్పాన్సర్లు మరియు శ్రేయోభిలాషులకు INDCC హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతుంది.బెర్లిన్లో జరిగిన భారత్ పరేడ్ ఇండో-జర్మన్ సంబంధాలను బలోపేతం చేసిన మరియు జర్మనీలోని భారతీయ ప్రవాసుల ఐక్యత మరియు గర్వాన్ని హైలైట్ చేసిన చారిత్రాత్మక క్షణంగా గుర్తుండిపోతుందని కమిటీ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా, TAG ఉపాధ్యక్షుడు వెంకటరమణ బోయినెపెల్లి, శ్రీమతి అలేఖ్య భోగా (జర్మనీ తెలంగాణ అసోసియేషన్ కార్యదర్శి), మరియు శ్రీ శరత్ కమిడి (జర్మనీ తెలంగాణ అసోసియేషన్ సాంస్కృతిక కార్యదర్శి) ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.

డాలస్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాలస్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. "దేశ స్వాతంత్ర్య సముపార్జనలో, సర్వసం త్యాగం చేసి అసువులు బాసిన సమరయోధులకు, గాంధీ, నెహ్రు, వల్లభ భాయ్ పటేల్, నేతాజీ శుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి నాయకుల కృషి ఎంత కొనియాడినా తక్కువే అన్నారు. డా. తోటకూర భారత పతాక ఆవిష్కరణ చేసి, శుక్రవారం పనిరోజు అయినప్పటికీ, ఉదయమే ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయలు హాజరుకావడం వారి మాతృ దేశభక్తిని చాటు తుందని అంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి డబుల్ హార్స్ వారు ఇండియా నుంచి పంపిన అందరికీ ప్రీతి పాత్రమైన తెలుగింటి సున్నిండలు అందరి ముఖాలలో చిరునవ్వులు చిందించాయి. బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, మహేందర్ రావు, రాజేంద్ర వంకావాల, తిరుమల్ రెడ్డి కుంభం, జస్టిన్ వర్గీస్, భారతి మిశ్రా, కళయ్ కృష్ణమూర్తి తదిర నాయకులు హాజరైనారు.(చదవండి: బ్రూనై తెలుగు సంఘం 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు)
క్రైమ్

చెప్పులో పాముకాటుకు ఐటీ ఇంజినీరు బలి
బెంగళూరు: మృత్యువు ఒక్కోసారి ఎలా కబళిస్తుందో ఎవరూ ఊహించలేరు. బెంగళూరులోని ఓ ఐటీ ఇంజినీరుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అనూహ్యంగా పాము రూపంలో మృత్యువు కాటేసింది. చెప్పులో పాముందని తెలీక వాటిని వేసుకున్న అతను దాని కాటుకు బలయ్యాడు. ఈ సంఘటన బెంగళూరులో బన్నేరుఘట్టలోని రంగనాథ లేఔట్లో జరిగింది. వివరాలివీ.. మంజు ప్రకాష్ (41) శనివారం మధ్యాహ్నం తన చెప్పులను వేసుకుని బయటకెళ్లి వచ్చాడు. ఇంట్లోకి రాగానే మత్తుగా ఉందంటూ పడుకున్నాడు. సుమారు గంట తరువాత కుటుంబ సభ్యులు ఇంటి వాకిలి ముందు ప్రకాష్ చెప్పులో చనిపోయిన రక్తపింజర పాము పడి ఉండడాన్ని చూశారు. వెంటనే అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా ప్రకాష్ నోట నుంచి నురగలు కక్కుతూ స్పృహతప్పి ఉన్నాడు. ఓ పాదం నుంచి రక్తం కారడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. ఏడేళ్ల కిందట ప్రకాష్ కాలుకు తీవ్రగాయం కావడంతో అప్పటినుంచి ఆ కాలికి స్పర్శ తక్కువ అని, అందువల్లే పాము కరిచినా తెలుసుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక సంఘటన జరిగిన బన్నేరుఘట్ట అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటుందని.. ఇక్కడ పాముల బెడద ఎక్కువని తెలుస్తోంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏపీకే ఫైల్స్
సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. మోసం చేయడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా..తమదైన స్టయిల్లో రెడీ అవుతున్నారు. తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తమ మోసాలకు అనుగుణంగా మార్చుకున్నారు. రైతులే లక్ష్యంగా ఈ తరహా కొత్త మోసానికి తెరతీశారు. వాట్సాప్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట మెసేజ్లు పంపుతూ వాటిలో కొన్ని లింక్లు పెట్టి ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ)ఫైల్స్ పంపుతున్నట్టు పోలీసులు హెచ్చరించారు.ఇలాంటి అనుమానాస్పద మెసేజ్లలోని లింక్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సైతం ఈ మేరకు కొన్ని సూచనలు చేసింది. సోషల్ మీడియా, ఇతర ప్లాట్ఫామ్లలో వ్యాప్తి చెందుతున్న నకిలీ సందేశాలు, లింక్ల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.పీఎం కిసాన్ వాట్సాప్ స్కామ్ అంటే ఏమిటి? ఈ స్కామ్లో సైబర్నేరగాళ్లు పీఎం కిసాన్ శాఖ నుంచి ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ వాట్సాప్లో సందేశాలు పంపుతారు. పథకంలో కొత్తగా నమోదు చేసుకునేందుకు, మీ ఖాతాలో జమైన డబ్బుల వివరాలు పొందేందుకు ఆ సందేశంలోని లింక్పై క్లిక్ చేసి కొన్ని వివరాలు నమోదు చేయాలని సూచిస్తారు. దీనిని నమ్మి లింక్పై క్లిక్ చేయగానే మన ఫోన్ను హ్యాక్ చేస్తారు. ఆ తర్వాత ఆధార్, పాన్కార్డు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతారు.ఆ తర్వాత ఓటీపీ వస్తుంది. సైబర్ నేరగాళ్లు ఆ సమాచారం, ఓటీపీ పొందిన తర్వాత మన బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ పొందుతారు. ఫలితంగా ఆర్థిక మోసం జరుగుతుంది. మన వ్యక్తిగత సమాచారం, ఫోన్ గ్యాలరీలోని ఫొటోలు తీసుకొని డేటా థెప్్టతోపాటు మన ఫొటోలు, వీడియోలు మారి్ఫంగ్ చేసి ఆన్లైన్ వేధింపులకు గురిచేస్తూ డబ్బు డిమాండ్ చేసే ప్రమాదమూ ఉంది. ఈ జాగ్రత్తలు మరవొద్దు ⇒ ప్రభుత్వ లోగో లేదా సీల్తో అవాంఛిత సందేశాలు వచ్చినా..మన వ్యక్తిగత వివరాలు అడుగుతూ ఎస్ఎంఎస్లో పేర్కొన్నా, అది సైబర్ నేరగాళ్ల పని అని అనుమానించాలి. ⇒ అనుమానాస్పద మెసేజ్లలోని ఏ లింక్పై క్లిక్ చేయొద్దు లేదా ఏ అటాచ్మెంట్ను డౌన్లోడ్ చేయొద్దు. ⇒ సందేశం చట్టబద్ధంగా అనిపించినా, మన వ్యక్తిగత సమాచారం లేదా ఓటీపీలను షేర్ చేయొద్దు. ⇒ ఏ సమాచారం కోసమైనా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి నిర్ధారించుకోవాలి. ⇒ ఇలాంటి అనుమానాస్పద లింక్లు మనకు తెలిసిన నంబర్ల నుంచి వచ్చినా వాటిని నమ్మి, లింక్లపై క్లిక్ చేయొద్దు. ⇒ నకిలీ లింక్లు లేదా ఏపీకే ఫైల్స్ను డౌన్లోడ్ చేయడం వల్ల ఫోన్ హ్యాకింగ్ అవడంతోపాటు డేటా దొంగతనం జరిగే ప్రమాదం ఉందని మరవొద్దు.

‘ప్రొఫైల్ ’ నకిలీ.. ‘సైబర్’ మకిలి
నకిలీ ప్రొఫైల్, సైబర్ వేధింపులు, ప్రొఫైల్ హ్యాకింగ్.. తీరు ఏదైనా సైబర్ నేరాల సంఖ్య భారత్లో ఏటా పెరుగుతూనే ఉంది. జనం డిజిటల్కు పెద్ద ఎత్తున మళ్లుతుండడం, అదే సమయంలో పూర్తిగా అవగాహన ఉండకపోవడం.. సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ , సామాజిక మాధ్యమాల వేదికగా నకిలీ ఆన్ లైన్ ఖాతాలు తెరిచి చేస్తున్న మోసాలే ఎక్కువగా ఉంటున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఇతర వ్యక్తులు, బ్రాండ్, సంస్థలా కనిపించడానికి నకిలీ ఆన్ లైన్ ఖాతా తెరిచి చేస్తున్న మోసాలు దేశంలో అధికంగా ఉంటున్నాయి. అక్రమంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వివరాలను ఉపయోగించి సైబర్ నేరస్తులు ఇతరులను మోసం చేస్తున్నారు. గతేడాది ఇలాంటి ఘటనలు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn) ద్వారా 39,846 నమోదయ్యాయి. నాలుగేళ్లలో ఈ తరహా మోసాలు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ సీఆర్పీ వేదిక ద్వారా సైబర్ వేధింపుల ఫిర్యాదులు మూడున్నర రెట్లు పెరిగి 39,077కు చేరాయి. ప్రొఫైల్ హ్యాకింగ్, గుర్తింపు చోరీ ఘటనలు మూడింతలకుపైగా అధికమై 38,295కు పెరిగాయి. ఆన్ లైన్ జాబ్, మ్యాట్రిమోనియల్ మోసాలు కూడా పెరుగుతూ ఉన్నాయి.కేసులు ఎన్నోరెట్లు..అధికారిక లెక్కల ప్రకారం గతేడాది దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా సైబర్ సెక్యూరిటీ ఘటనలు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఆన్ లైన్ , సామాజిక మాధ్యమాల ద్వారా మోసాలు 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు మూడింతలయ్యాయి. మహిళలు, పిల్లలపై జరుగుతున్న సైబర్ నేరాల సంఖ్య రెండింతలకుపైగా పెరిగి గత ఏడాది 48,475కు చేరాయి. సైబర్ నేరస్తులు ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వారు ఉపయోగించిన ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్లను బట్టి తెలుస్తోంది. సైబర్ క్రిమినల్స్ చాలా సందర్భాల్లో తప్పుడు లొకేషన్ , గుర్తింపుతో తప్పుదోవ పట్టిస్తున్నట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు గుర్తించాయి.కేటాయింపులు మూడింతలు..పౌరులు, వ్యాపారాలు, ప్రభుత్వానికి సురక్షిత సైబర్స్పేస్ను నిర్మించడానికి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ (ఎన్ సీఎస్పీ)ని కేంద్రం తీసుకొచ్చింది. అలాగే దేశంలోని సైబర్స్పేస్ను జల్లెడ పట్టేందుకు, సైబర్ భద్రతా ముప్పులను గుర్తించడానికి నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్ సీసీసీ) ఏర్పాటు చేసింది. డేటా సంరక్షణ కోసం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం–2023 తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ సైబర్ సెక్యూరిటీ మౌలిక వసతుల కోసం కేటాయించిన నిధులు 5 ఏళ్లలో మూడింతలకుపైగా పెరగడం గమనార్హం.

ఆన్లైన్ బెట్టింగ్కు అడ్డదారులు
గోదావరిఖని/చెన్నూర్: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఒకసారికాదు.. అనేకసార్లు అదే ఆట ఆడి డబ్బు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బు సంపాదించేందుకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐలో క్యాషియర్గా పనిచేస్తున్న నరిగె రవీందర్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కోసం 402 గోల్డ్లోన్లకు సంబంధించిన 25.17కిలోల బంగారం, రూ.1.10 కోట్ల నగదు చోరీ చేశాడు. రీజియన్ మేనేజర్ రితేశ్కుమార్గుప్తా ఆగస్టు 23న ఇచ్చిన ఫిర్యాదుతో చోరీ విషయం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు వారంలో రోజుల్లోనే కేసు ఛేదించారు.రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చోరీపై పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదివారం తన కార్యాలయంలో ఆ వివరాలు వెల్లడించారు.75 శాతం బంగారం రికవరీ చేశారు. ప్రధాన నిందితుడు బ్యాంకు క్యాషియర్ నరిగె రవీందర్..బ్యాంక్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్లతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డాడు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు కేసు విచారణ జరిపి ఛేదించారు. రూ.40 లక్షల నష్టాన్ని పూడ్చుకునేందుకు.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్తో రూ.40 లక్షలు కోల్పోయిన రవీంద ర్.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అదే బెట్టింగ్పై దృష్టి సారించాడు. దీనికి బ్రాంచ్ మేనేజర్ మనోహర్, ఔట్సోర్సింగ్ ఉద్యో గి సందీప్తో కలిసి బంగారం, నగదుకు పక్కా ప్రణాళిక వేశాడు. పదినెలలుగా.. పకడ్బందీగా.. ఏడాది క్రితం చెన్నూర్ బ్రాంచ్–2 ఎస్బీఐ క్యాషియర్గా బదిలీపై వెళ్లిన రవీందర్.. బ్యాంక్లో కుదువ పెట్టిన బంగారాన్ని తీసి వేరే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందాడు. ఆ సొమ్మును బెట్టింగ్కు వెచ్చించాడు. గతేడాది అక్టోబర్ నుంచి గోల్డ్లోన్ చెస్ట్ నుంచి బంగారం తీసి తన స్నేహితులకు ఇచ్చి, ఆ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టాడు. ఆ డబ్బును తమ బ్యాంకు ఖాతాల్లో జమచేసిన స్నేహితులకు కొంత కమీషన్ కూడా ముట్టజెప్పేవాడు. ఇలా 10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపెనీలు (ఎస్ఎఫ్సీ, ఇండెల్మనీ, ముత్తూట్ఫైనాన్స్, గోదావరి అర్బన్, మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ కార్ప్, ముత్తూట్ మినీ) 44 మంది పేర్లపై 142 గోల్డ్లోన్లు తీసుకున్నాడు.బంగారం లేకుండానే.. గోల్డ్లోన్లు.. నరిగె రవీందర్ బంగారం లేకుండానే గోల్డ్ లోన్లు తీసుకున్నాడు. తన భార్య, బావమరిది, స్నేహితుల పేర్లతో 42 గోల్డ్లోన్లు మంజూరు చేసి 4.14 కిలోల బంగారం పేరుతో రూ.1.58 కోట్లు కాజేశాడు. ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే సమయంలో కూడా డబ్బు అపహరించేవాడు. ఈ కేసులో 15.23 కిలోల బంగారం రికవరీ చేశారు. గోల్డ్లోన్ మేనేజర్ల పాత్రపై విచారణ జరుగుతోంది.15.237 కిలోల బంగారం రికవరీ చోరీ కేసులో ప్రధాన నిందితుడు రవీందర్, మేనేజర్ మనోహర్తోపాటు మరో 42 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి నుంచి 15.237 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.61 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.44 మంది నిందితుల అరెస్ట్.. ప్రధాన నిందితుడు నరిగె రవీందర్, బ్యాంకు మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, లక్కాకుల సందీప్, ఎస్బీఎఫ్సీ సేల్స్ మేనేజర్ కొంగొంటి భీరే‹Ù, కస్టమర్ రిలేషన్ మేనేజర్ కోదాటి రాజశేఖర్, సేల్స్ ఆఫీసర్ బొల్లి కిషన్కుమార్తోపాటు మరో 38మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్వల్ప వ్యవధిలోనే కేసును ఛేదించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, చెన్నూర్ సీఐ దేవేందర్రావు, రూరల్ సీఐ బన్సీలాల్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ తదితరులను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.
వీడియోలు


AP, TS: సెప్టెంబర్ నెలలోనూ దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు


ఆడబిడ్డ ఏడుపు మీకు కనిపించట్లేదా ? సుగాలి ప్రీతి కేసుపై ఎక్కడ?


తిరుమల సన్నిదానం క్యాంటీన్ అక్రమాలపై భూమన సంచలన నిజాలు


CM Revanth: రాజకీయాలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపిద్దాం


Vellampalli Srinivas: వరద బాధితుల పై లాఠీ ఛార్జ్ చేసిన ఘనత మీదే..


కాళేశ్వరం విచారణ CBIకి అప్పగించడంపై స్పందించిన ఈటల


విజయవాడలో భారీ వర్షం


రైతులకు ఎరువులు అందేవరకు మా పోరాటం ఆగదు


అరకు కాఫీ గింజలతో వినాయక విగ్రహం


లోకల్ రిజర్వేషన్ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు