ప్రధాన వార్తలు
భారత్ మహిళా క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: ఐసిసి మహిళల ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్కి చేరిన భారత మహిళా జట్టుకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడాన్ని ఆయన అభినందించారు. ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మహిళా జట్టు ఫైనల్ లో కూడా అలాగే రాణించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
‘నా కుమార్తె చనిపోయిందన్న కనికరంలేదు వీళ్లకి.. లంచం పేరుతో కాల్చుకు తిన్నారు’!
సాక్షి,బెంగళూరు: గుండెను మెలిపెట్టే ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషాద ఘటనలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉన్నత ఉద్యోగి ఒక్కగానొక్క కుమార్తె మరణించిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు లంచాలు ఇచ్చారు. అంబులెన్స్ డ్రైవర్ నుంచి ఉన్నతస్థాయి పోలీసు అధికారి వరకు ఎలా లంచాలు అడిగారో? అందుకు తాను లంచాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో?లింక్డిన్ పోస్టులో సుదీర్ఘంగా వివరించారు. ఆ పోస్టును కొద్దిసేపటికే డిలీట్ చేశారు. అప్పటికే ఆ పోస్టు వైరల్గా మారింది.ఆ లింక్డిన్ పోస్టులో..బెంగళూరులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)కె.శివకుమార్ కుమార్తె అక్షయ శివకుమార్(34). కంప్యూటర్ సైన్స్లో బీటెక్, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ పెట్టుబడుల సంస్థ గోల్డ్మన్ సాచ్స్ ఎనిమిదేళ్లు పనిచేశారు. ఇతర సంస్థల్లో మూడేళ్లు పనిచేశారు.అయితే ఈ క్రమంలో వర్క్ఫ్రమ్ హోమ్లో విధులు నిర్వహిస్తున్న అక్షయ గతనెల సెప్టెంబర్ 18 మెదడు రక్తస్రావం కారణంగా ఇంట్లోనే మరణించారు. అక్షయ మరణించిన తర్వాత అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. ఆ సమయంలో పలువురు తన వద్ద నుంచి లంచం డిమాండ్ చేశారని, మరికొందరు తనపట్ల దారుణంగా వ్యవహరించారని వాపోయారు. https://t.co/yJRWH989TU— DCP Whitefield Bengaluru (@dcpwhitefield) October 30, 2025 ‘నా కుమార్తె మరణం తర్వాత..అవసరమైన ఫార్మాలటీస్లను పూర్తిచేసేందుకు అవసరమైన పత్రాలను పొందడానికి అంబులెన్స్ ఆపరేటర్ నుంచి పోలీసు అధికారుల వరకు..శ్మశానవాటిక నుంచి బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) కార్యాలయ సిబ్బంది వరకు దాదాపు అందరికీ లంచాలు చెల్లించాల్సి వచ్చింది.పోలీస్ స్టేషన్లో కూడా తనను నగదు రూపంలో చెల్లించమని బలవంతం చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్,పోస్టుమార్టం నివేదిక కాపీని ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పోలిస్స్టేషన్ చుట్టూ నాలుగు రోజులు తిరిగాం. పనికాలేదు. పోలీసులు స్టేషన్లోని బహిరంగంగా నన్ను లంచం డిమాండ్ చేశారు. ఆ లంచాన్ని కూడా పోలిస్ స్టేషన్లోనే ఇచ్చారు. నేను నా ఏకైక బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉంటే.. ఈ సమాజం సానుభూతి లేకుండా నన్ను లంచం పేరుతో కాల్చుకు తిన్నది. ఇది దారుణం. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను చెల్లించాను. మరి పేదల పరిస్థితి ఏంటి?నా కుమార్తె భౌతికకాయాన్ని కసవనహళ్లిలోని ఓ ఆస్పత్రి నుంచి కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. ఇందుకోసం అంబులెన్స్ డ్రైవర్ రూ.3వేలు డిమాండ్ చేశాడు. పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాపట్ల కుమార్తె చనిపోయిందన్న కనికరం కూడా చూపించలేదు పోలీసు అధికారులు లంచం అడిగారు. అసభ్యంగా మాట్లాడారు. ‘(తన గురించి మాట్లాడుతూ..)ఒక వ్యక్తి ఇప్పటికే మానసికంగా కుంగిపోయి, భావోద్వేగంగా తల్లడిల్లుతున్న సమయంలో పోలీసులు డబ్బులు డిమాండ్ చేయడం,నిర్లక్క్ష్యంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం. వాళ్లకు కుటుంబం లేదా? వారికి బావోద్వేగాలు ఉండవా? ఇది అక్కడితో ఆగలేదు. బీబీఎంపీ నుంచి డెత్ సర్టిఫికెట్ పొందడానికి చాలా ఇబ్బంది పడ్డా. డెత్ సర్టిఫికెట్ కోసం బీబీఎంపీ కార్యాలయానికి ఐదురోజుల పాటు కాళ్లరిగేలా తిరగా. కొనసాగుతున్న ‘కుల సర్వే’ కారణంగా ఎవరూ అందుబాటులో లేరు. చివరికి బీబీఎంపీ సీనియర్ అధికారిని సంప్రదించిన తర్వాతే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందుకోసం సదరు అధికారి నా వద్ద నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన రుసుము కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిలో.. ఈ అరాచకం నుంచి బెంగళూరును రక్షించగలరా? నారాయణ మూర్తి, అజీమ్ ప్రేమ్జీ, మజుందార్ షాలు బిలియన్ల కొద్దీ డబ్బున్న పెద్దలు ఈ నగరాన్ని రక్షించగలరా? వారు చాలా మాట్లాడతారు కానీ...అని ముగించారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు వైట్ఫీల్డ్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. శివకుమార్ ట్వీట్లో పేర్కొన్న సంఘటనకు సంబంధించి, బెల్లందూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ పీఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అసభ్యకరమైన లేదా అనుచితమైన ప్రవర్తనను సహించదు’అని పోలీసులు తెలిపారు.
'పదేళ్లైనా ఎక్కడా తగ్గలేదు'.. రాజమౌళి స్పీచ్ వైరల్
దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్లో సందడి చేశారు. బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ షో సందర్భంగా ఆడియన్స్ను ఉద్దేశించి మాట్లాడారు. బాహుబలి రిలీజై పదేళ్లయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదన్నారు. ఇదంతా మీవల్లే సాధ్యమైందని కామెంట్స్ చేశారు. మహిస్మతి రాజ్యంలోని ప్రజలంతా బాగున్నారా? అంటూ అభిమానులను పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మీ అందరి ప్రేమ వల్లే మరోసారి మీ ముందుకు తీసుకొస్తున్నామని రాజమౌళి అన్నారు. పదేళ్లుగా మీరు ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జై మహిస్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. కాగా.. బాహుబలి రెండు పార్టులను కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాహుబలి ది ఎపిక్(Baahubali: The Epic) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. THE DIRECTOR addressing the audience at @PrasadsCinemas PCX screen!! It’s SHOW TIME.. #BaahubaliTheEpic #Baahubali pic.twitter.com/1dY6hj7cYE— Baahubali (@BaahubaliMovie) October 30, 2025
ఒంటినిండా నగలు ధరిస్తే.. రూ. 50వేలు జరిమానా!
బంగారు నగలు ఉంటే.. ఎవరికైనా ధరించుకోవాలని, ఓ నలుగురికి చూపించుకోవాలని ఉంటుంది. అయితే ఇలాంటి ఆడంబరాలకు స్వస్తి పలకడానికి.. ఉత్తరాఖండ్లోని జౌన్సర్-బావర్ గిరిజన ప్రాంతంలోని కంధర్ గ్రామ నివాసితులు ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఉల్లంఘించిన వారికి రూ. 50వేలు జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.ఆడంబరాలను అరికట్టడానికి మాత్రమే కాకుండా.. ఆర్ధిక అసమానతలను తగ్గించడానికి గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి మహిళలు కూడా స్వాగతించారు. ఇకపై అక్కడి మహిళలు వివాహాది శుభకార్యాలకు వెళ్లినా.. కేవలం చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలి. ఇవి కాదని ఎవరైనా ఇతర బంగారు నగలను ధరిస్తే.. వారికి రూ. 50,000 జరిగిమానా విధించనున్నట్లు గ్రామపెద్దలు హెచ్చరించారు.బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. డబ్బున్నవారు గోల్డ్ కొనుగోలు చేస్తారు. పేదరికంలో ఉన్నవారికి ఇది సాధ్యం కాదు. బంగారం కొనాలని అప్పులు చేస్తే.. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో అప్పులు పెరుగుతాయని కంధర్ గ్రామపెద్దలు.. కొత్త నిర్ణయం తీసుకున్న సందర్భంగా వివరించారు.వివాహం అనేది ఒక పవిత్రమైన ఆచారం. అది ప్రదర్శించడానికి వేదిక కాదు. ఆడంబరాలు/ప్రదర్శనలు అనే గోడలను కూల్చివేసినప్పుడే.. నిజమైన సమానత్వం సాధించబడుతుందని అక్కడి నివాసితులు నమ్ముతున్నారు. కొత్తగా తీసుకున్న నిర్ణయం.. ధనిక & పేద కుటుంబాల మధ్య పోల్చుకోవడం కొంత తగ్గుతుంది. అనవసరమైన ఖర్చులను అరికట్టవచ్చు. ఇది సామాజిక ఐక్యతను పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి
దారుణం.. బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన వైద్యులు
సాక్షి, మహబూబాబాద్: వైద్యం కోసం వచ్చిన రోగిని ఆధార్ కార్డు లేదనే నెపంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఆసుపత్రి ఆవరణలో రోగి.. వైద్యం కోసం రెండు రోజుల పాటు పడిగాపులు కాస్తూ నిరీక్షించి నీరసించడంతో సిబ్బంది మృతి చెందాడనే అనుమానంతో మార్చురీలో భద్రపరిచిన అమానవీయ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వి.రవి మూత్ర పిండాల వ్యాధితో ఇబ్బంది పడుతూ మూడు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చాడు. రోగికి తోడుగా ఎవ్వరు ఉండక పోవడంతో పాటు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించారు. దీంతో రోగి 2 రోజుల పాటు ఆస్పత్రి ఆవరణలో పడిగాపులు పడి.. నీరసించి ఆ చేతనంగా మారిపోయాడు. రోగి మృతి చెందాడనే అనుమానంతో వైద్య సిబ్బంది ఆసుపత్రిలోని మార్చూరికి తరలించి భద్ర పరిచారు.మరుసటి రోజు మార్చురిని శుభ్ర పరచడానికి వచ్చిన స్వీపర్లు.... రోగి కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని రోగిని వైద్యం చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఇంత దారుణం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు.. మానవత్వం మంటగలిపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Bihar Elections: కుమారుల పోటీపై రబ్రీ సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇంతలో ఆర్జేడీ చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి తన కుమారుల పోటీపై వ్యాఖ్యానించారు. తన కుమారుడు, జనశక్తి జనతాదళ్ (జేజేడీ)అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆమె మాట్లాడుతూ, ఆయనను పోటీ చేయనివ్వాలని, ఆయన తన ప్రాతినిధ్య స్థానం నుంచే పోటీ చేస్తున్నారని అన్నారు.ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాన్ని అమ్మేసిందని, డబ్బంతా ప్రధాని మోదీ ఇంటికి చేరిందని రబ్రీదేవి వ్యాఖ్యానించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ. 70 వేల కోట్ల మోసానికి పాల్పడ్డారని, కానీ దానిపై ఎక్కడా చర్చ జరగలేదన్నారు. లాలూ ఎలాంటి తప్పు చేయలేదని, తాము కోర్టులో కేసును ఎదుర్కొంటామన్నారు. తన మరో కుమారుడు, మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ విజయంపై రబ్రీ దేవి నమ్మకం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. #WATCH | Raghopur East, Bihar | #BiharElection2025 | RJD leader Rabri Devi says, "Nitish Kumar will not become the Chief Minister of Bihar..."On her son and Janshakti Janata Dal (JJD) Chief Tej Pratap Yadav contesting elections, she says, "It is fine, let him contest, he is… pic.twitter.com/Uo7C55up3e— ANI (@ANI) October 30, 2025రఘోపూర్ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తేజస్వి యాదవ్ను బీహార్ ముఖ్యమంత్రిని చేస్తారని రబ్రీ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రఘోపూర్ను అభివృద్ధి చేస్తామన్నారు. కాగా మహాకూటమి తాజాగా ‘బీహార్ కా తేజస్వి ప్రాణ్’ అనే పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. దానిలో ప్రజలకు పలు హామీలనిచ్చింది. బీహార్లో నవంబర్ 6, 11 తేదీలలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నారు.ఇది కూడా చదవండి: కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలో మృతి
మార్గదర్శి కేసు.. ఉండవల్లికి సుప్రీం కోర్టు కీలక సూచన
సాక్షి, ఢిల్లీ: మార్గదర్శి కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ఆర్బీఐ నిబంధనలను ఆ కంపెనీ ఉల్లంఘించిన అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించాలని మాజీ ఎంపీ, అడ్వొకేట్ ఉండవల్లి అరుణ్కుమార్కు సుప్రీంకోర్టు గురువారం సూచింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఇవాళ వాదనలు వింది. వర్చువల్గా విచారణకు హాజరైన ఉండవల్లి ‘‘ఇది డిపాజిట్ల కలెక్షన్, పేమెంట్స్కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించిందని.. దీనిపైన విచారణ జరగాలని’’ కోరారు. అయితే.. ఈ అంశాలన్నీ హైకోర్టు ముందున్న ప్రధాన పిటిషన్ విచారణ సందర్భంగా వినిపించాలని ఆయనకు ధర్మాసనం సూచించింది. ప్రస్తుతం తాము కేసు మెరిట్ లోకి వెళ్లడం లేదని.. హైకోర్టు స్టే ఇవ్వనన్న అంశంపై మాత్రమే విచారణ చేస్తున్నామని స్పష్టం చేసింది. ఇక.. ఈ కేసులో ఉండవల్లి అసలు ప్రతివాది కాదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఆ సమయంలోనూ తాము ఎలాంటి వ్యాఖ్యానం చేయదలచుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. మార్గదర్శి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదిస్తూ.. తాము చెల్లించాల్సిన 2,300 కోట్ల రూపాయల డిపాజిట్లలో సింహభాగం చెల్లించామని, ఎస్క్రో ఖాతాలో 5.43 కోట్ల రూపాయలు ఉన్నాయని.. డిపాజిట్ల మెచ్యూరిటీ ఆధారంగా వాటిని చెల్లించాలని కోరారు.
కారు బానెట్పై ఈడ్చుకెళ్లి.. ప్రాణం తీసిన టీచర్
గాంధీనగర్: ఓ టీచర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. బైక్ను ఢీకొట్టి, దానిపై ఉన్న వారిని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. ఆపై ప్రాణం తీశాడు. ఈ ఘటన గుజరాత్లోని మోడస లునావాడ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే టీచర్ అతడి సోదరుడు పూటుగా మద్యం సేవించారు. కన్ను మిన్ను కానరాకుండా రెచ్చిపోయి మరీ డ్రైవింగ్ చేశారు. మద్యం తాగి ఒళ్లు తెలియని మైకంలో కారు నడుపుతోన్న టీచర్ ఓ బైక్ను ఢీకొట్టాడు. ఆపై బైక్ను ఢీకొట్టిన విషయాన్ని గుర్తించడకుండా బానెట్పై పడిన వ్యక్తిని అలాగే 1.5 కి.మీ మేర ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత మితిమీరిన వేగం దాటికి బానెట్పై ఉన్న బాధితుడు కిందపడ్డాడు. ఈ హిట్ అండ్ రన్ కేసు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొంతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదానికి సంబంధించిన సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియో ఆధారంగా ఈ దుర్ఘటన మహిసాగర్ జిల్లాలోని మోడాసా-లునావాడ నేషల్ హైవే 48లో జరిగినట్లు గుర్తించారు. హిట్ అండ్ రన్ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మనీశ్ పటేల్, మెహుల్ పటేల్గా పోలీసులు గుర్తించారు. ఇక గాయపడిన ఇద్దరు బాధితులను లునావాడాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. #Mahisagar: મોડાસા લુણાવાડા રોડ પર હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના આવી સામે, કાર ચાલકે બાઈક ચાલકને અકસ્માત સર્જી બચાવવાની જગ્યાએ ૩-૪ કિલોમીટર સુધી કાર ઉપર ઢસડીને લઈ ગયો.. અન્ય કારચાલકો દ્વારા કારચાલકને રોકી પોલીસના હવાલે કર્યો..#Gujarat #ViralVideo pic.twitter.com/7H5HUQYlFW— 🇮🇳Parth Amin (@Imparth_amin) October 29, 2025
Sudan: ఉపగ్రహ చిత్రాల్లో సామూహిక రక్తపాత దృశ్యాలు
న్యూఢిల్లీ: అంతర్యుద్ధంలో దెబ్బతిన్న సూడాన్లో భారీగా రక్తపాతం జరిగినట్లు అంతరిక్షం నుండి వెలువడిన దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన హ్యుమానిటేరియన్ రీసెర్చ్ ల్యాబ్ (హెచ్ఆర్ఎల్) విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో గత వారంలో ఎల్ ఫాషర్ను స్వాధీనం చేసుకున్న తర్వాత తిరుగుబాటు సంస్థ సామూహిక హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.రెండు సంవత్సరాలకు పైగా సాగుతున్న అంతర్యుద్ధంలో సూడాన్ అతలాకుతలమైంది. సుడానీస్ ఆర్మీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) మధ్య యుద్ధం 2023 ఏప్రిల్లో మొదలయ్యింది. గతంలో అధికారాన్ని పంచుకున్న ఈ రెండు యూనిట్లు ప్రజాస్వామ్యం వైపు మళ్లే సమయంలో, తమ బలగాలను ఏకీకృతం చేసే ప్రణాళికల విషయంలో విఫలమయ్యాయి. అక్టోబర్ 26న, ఉత్తర డార్ఫర్లోని ఎల్-ఫాషర్ నగరంలోని ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్ఎస్ఎఫ్ తెలిపింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) తెలిపిన వివరాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో దాదాపు 40 వేల మంది మృతి చెందారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 🚨HUMAN SECURITY EMERGENCY🚨 El-Fasher has fallen to RSF. HRL finds evidence of mass killings including door-to-door clearance operations and objects consistent with reported bodies on berm entrapping El-Fasher.#KeepEyesOnSudan🛰️@AirbusSpace @Maxarhttps://t.co/1HApllgNL5 pic.twitter.com/yrCbM5HxeP— Humanitarian Research Lab (HRL) at YSPH (@HRL_YaleSPH) October 27, 2025సూడాన్లో సగం మందికిపైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాధులు చుట్టుముట్టాయి. సోమవారం ప్రచురితమైన ఒక నివేదికలో ఎల్-ఫాషర్లోని దరాజా ఔలా పరిసరాల్లో వ్యూహాత్మకంగా మోహరించిన ఆర్ఎస్ఎఫ్ వాహనాలను హెచ్ఆర్ఎల్ గమనించింది. చిత్ర విశ్లేషణలో ఆర్ఎస్ఫ్ వాహనాల దగ్గర నేలపై పడివున్న మానవ శరీరాల పరిమాణానికి అనుగుణంగా ఉన్న వస్తువులు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఐదు ఎర్రటి రంగులో కనిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎఫ్ సెప్టెంబర్ 19న డ్రోన్లతో దాడి చేసి దాదాపు 78 హత్య చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం యేల్ హెచ్ఆర్ఎల్.. ఎల్-ఫాషర్ నుండి పారిపోతున్న సమయంలో పౌరులు మరణించడాన్ని కూడా కనుగొంది. ఈ ప్రాంతం పూర్తిగా ఆర్ఎస్ఎఫ్ ఆధీనంలో ఉంది. వారి కార్యకలాపాల స్థావరంగా దీనిని ఉపయోగిస్తున్నారని యేల్ తన నివేదికలో పేర్కొంది. ఇది కూడా చదవండి: Varanasi: ఉమ్మినా.. కుక్క మలాన్ని కడగకున్నా..
నాపై కాంగ్రెస్ వాళ్లే తప్పుడు ప్రచారం: రాజగోపాల్ రెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పు అంటూ తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం, రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపుదిద్దబోతున్నాం. చౌటుప్పల్ చెరువుకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరద నీటిని డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని తెలిపారు.పార్టీ మార్పుపై.. పార్టీ మారుతున్నానని సొంత పార్టీ వాళ్లు, బయట పార్టీ వాళ్లు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు దుష్ప్రచారాలను ఎవరు నమ్మవద్దు. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటిస్తాను. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను, ఎమ్మెల్యేను.. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తాను. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటా. నా ముందు మునుగోడు అభివృద్ది తప్ప, మరో ఆలోచన లేదు. నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దు అంటూ కామెంట్స్ చేశారు.
భారత్ మహిళా క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
వజ్రాల మెడతో రష్మిక.. కలర్ఫుల్ శారీలో వితికా శేరు!
ఘనంగా 'ఆటా' 19వ మహాసభల కిక్ ఆఫ్ వేడుక
ఆసియా యూత్ గేమ్స్లో భారత్ పతకాల మోత..
ఎస్కేప్ ఎపిసోడ్: ఆర్థిక నేరస్తుడిని తప్పించిన ఎస్ఐ సస్పెండ్
కార్పొరేట్ ఆర్ధిక ఫలితాలు ఇలా..
‘నా కుమార్తె చనిపోయిందన్న కనికరంలేదు వీళ్లకి.. లంచం పేరుతో కాల్చుకు తిన్నారు’!
మహేశ్ బాబు మాస్ యాక్షన్ మూవీ.. మళ్లీ వచ్చేస్తోంది
అజారుద్దీన్కు మంత్రి పదవి రాకుండా బీజేపీ కుట్ర: భట్టి
జాక్పాట్ కొట్టిన నల్లగొండ దంపతులు
జైస్వాల్ కీలక నిర్ణయం
బంగారం ధరల తుపాను! తులం ఎంతంటే..
'ఫౌజీ'లో జూనియర్ ప్రభాస్గా ప్రముఖ హీరో కుమారుడు ఎంట్రీ
మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సూత్రాలు
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవమర్యాదలు.. ఆకస్మిక ధనలాభం
బంగారం జాక్పాట్! తులం ఎంతకు తగ్గిందంటే..
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
ఆస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. ఖర్చులు ఎవరు భరిస్తారో తెలుసా?
ఇన్ని సుంకాలు వేసి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా ఇంకా మీ మాట ఎందుకు వింటుంది సార్!
Viral Video: దటీజ్ కోబ్రా.. దాని పౌరుషం చూస్తే.. గుండె గుభేల్
..ఆగవయ్యా! వరద అంచనా కోసం వచ్చాం.. ఆదుకోవడానికి కాదు!
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
సాక్షి కార్టూన్ 29-10-2025
ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు
‘బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి’ అన్నారు: రాజమౌళి
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశం
బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు!
మహ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం..
భారత్ మహిళా క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
వజ్రాల మెడతో రష్మిక.. కలర్ఫుల్ శారీలో వితికా శేరు!
ఘనంగా 'ఆటా' 19వ మహాసభల కిక్ ఆఫ్ వేడుక
ఆసియా యూత్ గేమ్స్లో భారత్ పతకాల మోత..
ఎస్కేప్ ఎపిసోడ్: ఆర్థిక నేరస్తుడిని తప్పించిన ఎస్ఐ సస్పెండ్
కార్పొరేట్ ఆర్ధిక ఫలితాలు ఇలా..
‘నా కుమార్తె చనిపోయిందన్న కనికరంలేదు వీళ్లకి.. లంచం పేరుతో కాల్చుకు తిన్నారు’!
మహేశ్ బాబు మాస్ యాక్షన్ మూవీ.. మళ్లీ వచ్చేస్తోంది
అజారుద్దీన్కు మంత్రి పదవి రాకుండా బీజేపీ కుట్ర: భట్టి
జాక్పాట్ కొట్టిన నల్లగొండ దంపతులు
జైస్వాల్ కీలక నిర్ణయం
బంగారం ధరల తుపాను! తులం ఎంతంటే..
'ఫౌజీ'లో జూనియర్ ప్రభాస్గా ప్రముఖ హీరో కుమారుడు ఎంట్రీ
మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సూత్రాలు
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవమర్యాదలు.. ఆకస్మిక ధనలాభం
బంగారం జాక్పాట్! తులం ఎంతకు తగ్గిందంటే..
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
ఆస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. ఖర్చులు ఎవరు భరిస్తారో తెలుసా?
ఇన్ని సుంకాలు వేసి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా ఇంకా మీ మాట ఎందుకు వింటుంది సార్!
..ఆగవయ్యా! వరద అంచనా కోసం వచ్చాం.. ఆదుకోవడానికి కాదు!
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
సాక్షి కార్టూన్ 29-10-2025
ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు
‘బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి’ అన్నారు: రాజమౌళి
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశం
బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు!
మహ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం..
తెలుగు టైటాన్స్కు చావో రేవో మ్యాచ్.. ఓడితే పరిస్థితి ఏంటి?
సినిమా
కేజీఎఫ్ హీరో టాక్సిక్పై రూమర్స్.. నిర్మాతలు ఏమన్నారంటే?
కేజీఎఫ్-2 తర్వాత యశ్ నటిస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ కోసం యశ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్-2 రిలీజై ఇప్పటికే మూడేళ్లు దాటిపోయింది. దీంతో టాక్సిక్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆతృతగా ఉన్నారు. అయితే ఈ మూవీపై కొన్ని రోజులుగా నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. టాక్సిక్ రిలీజ్ వాయిదా పడనుందని తెగ టాక్ నడుస్తోంది. దీంతో యశ్ ఫ్యాన్స్ కాస్తా నిరాశకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మేకర్స్ స్పందించారు. తమ సినిమాపై వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టాక్సిక్ను వాయిదా వేసే ప్రసక్తే లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇంకా 140 రోజులే.. వచ్చే ఏడాది మార్చి 19న టాక్సిక్ సందడి చేయనుందని వెల్లడించారు. తరణ్ ఈ ప్రకటనతో గత కొద్ది కాలంగా వస్తున్న వాయిదా రూమర్స్కు ఫుల్ స్టాప్ పెట్టేశారు.కాగ.. టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నుంచే పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా వీఎఫ్ఎక్స్ పనులు ప్రారంభమమైనట్లు తెలుస్తోంది. మరో వైపు యశ్ ప్రస్తుతం ముంబయిలో రామాయణ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. టాక్సిక్ సినిమాకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు టాక్. ఈ సినిమా కన్నడతో పాటు ఇంగ్లీష్లోనూ తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.140 days to go…His Untamed Presence,Is Your Existential Crisis.#ToxicTheMovie releasing worldwide on 19-03-2026 https://t.co/9RC1D6xLyn— KVN Productions (@KvnProductions) October 30, 2025
మిరాజ్ మూవీ రివ్యూ: ఇది ట్విస్ట్ ల మిస్టరీ!
సినిమా పరంగా ఓ కథను ప్రేక్షకుడికి ఆకట్టుకునేలా చెప్పాలంటే గట్టి పట్టున్న స్క్రీన్ ప్లే ఎంతైనా అవసరం. మామూలు రొటీన్ ఫార్ములాతో వచ్చే సినిమాలు నేటి ప్రేక్షకులకు అంతగా రుచించట్లేదు. చెప్పే కథను ఊహకందని ట్విస్టులతో చూపిస్తే ఆ సినిమా హిట్టే. అదే కోవకు చెందిన సినిమా మిరాజ్(Mirage). ఈ సినిమా మాతృక మళయాళమైనా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సోనీ లివ్ లో లభ్యమవుతోంది. అపర్ణ రాసిన ఈ కథకు ప్రముఖ మళయాళ దర్శకులు జీతూజోసెఫ్ దర్శకత్వం వహించారు. సుప్రసిద్ధ మళయాళ నటులు ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి ఈ సినిమాకు ప్రధాన తారాగణం. ఈ మధ్య కాలంలో ఆసాంతం సూపర్ ట్విస్టులతో సాగిపోయే సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు. ప్రారంభంలో చాలా నెమ్మదిగా ప్రారంభమైనా శుభం కార్డు వరకు ట్విస్టులతో ప్రేక్షకుల మతిని పోగొడుతుందీ సినిమా. అయితే ఈ సినిమాలో అక్కడక్కడా కొంచం రీరికార్డింగ్ నిరాశపరుచవచ్చు. కాని సినిమా ట్విస్టుల పరంగా చూస్తే మాత్రం గడిచిన దశాబ్ద కాలంలో ఇటువంటి సినిమా రాలేదనుకోవచ్చు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. సినిమా ప్రారంభంలోనే ఓ ట్రైన్ యాక్సిడెంతో కథ మొదలవుతుంది. ఈ ట్రైన్ లో కిరణ్ అనే పాత్ర పరిచయమవుతుంది. అభిరామి, కిరణ్ ఒకే ఆఫీసులో పని చేస్తూ ఉంటారు. అంతేకాదు వాళ్ళిద్దరూ ప్రేమించుకుని త్వరలో పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటారు. ఇంతలో కిరణ్ ట్రైన్ యాక్సిడెంట్ గురించి అభిరామికి తెలిసి కుప్పకూలిపోతుంది. అభిరామిని ఓదార్చడానికి తన స్నేహితురాలైన రితిక వస్తుంది. ఆ తరువాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన అశ్విన్, పోలీస్ సూపరిండెంట్ ఆరుముగంతో పాటు ఆఫీసులో రాజకుమార్ మనిషి కూడా అభిరామి దగ్గరకు వస్తారు. వీళ్ళంతా అభిరామిని పరమార్శించడానికైతే కాదు, చనిపోయిన కిరణ్ దగ్గరున్న ఓ డేటా డ్రైవ్ కోసం వస్తారు. ఇంతకీ ఆ డేటా డ్రైవ్ లో ఏముంది, ఆఖర్లో అది ఎవరికి దక్కుతుంది అన్నది తెలుసుకోవాలంటే ఈ ట్విస్టుల మిస్టరీ మిరాజ్ ని చూడాల్సిందే. గమ్మత్తేమిటంటే ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర ఓ ట్విస్ట్ తోనే ఉంటుంది. అది కూడా ప్రేక్షుకుడి ఊహలకు అంచనాలు మించి ఉంటాయి ఈ ట్విస్టులు. మంచి థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ కనువిందనే చెప్పాలి. మస్ట్ వాచ్ మూవీ దిస్ మిరాజ్, సో గెట్ ట్విస్టెడ్ దిస్ వీకెండ్.-హరికృష్ణ ఇంటూరు
కాంతార చాప్టర్-1.. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 (Kantara Chapter1) బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ ప్రీక్వెల్.. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది.అయితే ఈ మూవీని కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీష్లోనూ రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా మరో దేశానికి చెందిన భాషల్లో కాంతార చాప్టర్-1ను విడుదల చేస్తున్నారు. స్పానిష్ భాషలోనూ ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా స్పానిష్ భాషలో కాంతార చాప్టర్-1 ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈనెల 31న కాంతార చాప్టర్-1 థియేటర్లలో సందడి చేయనుందని ట్విటర్లో పోస్ట్ చేశారు మేకర్స్. Una saga divina que comenzó en la India… ahora conquista el mundo. Estreno el 31 de octubre en cines de todo el mundo, en español. 🇪🇸❤️🔥 #KantaraChapter1 Spanish (Española) Trailer out now.▶️ https://t.co/AMQ74XYxpf#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab… pic.twitter.com/Ww5F82BNxF— Hombale Films (@hombalefilms) October 30, 2025
‘బాహుబలి: ది ఎపిక్’ ట్విటర్ రివ్యూ
ఇండియన్ సినిమా హిస్టరీలో ‘బాహుబలి’ ఒక చరిత్ర. ఈ మూవీ తొలిభాగం 2015లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడమే కాదు.. పాన్ ఇండియా చిత్రాలకు పునాదిని వేసింది. ఇక బాహుబలి 2 సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’(Baahubali: The Epic ) పేరుతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక్క రోజు ముందే విదేశాల్లో ఈ చిత్రం సందడి చేస్తోంది. ఓవర్సీస్లో ఈ చిత్రం ఈ రోజే రిలీజైంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.(చదవండి: ‘బాహుబలి’కి డిజాస్టర్ టాక్..నిర్మాత బలి అన్నారు: రాజమౌళి)బాహుబలి ది ఎపిక్' విజువల్ వండర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రీరిలీజ్ అయినప్పటికీ..తెరపై చూస్తుంటే ఒక కొత్త చిత్రం చూసినట్లుగానే ఉంటుందని చాలా మంది అంటున్నారు. రాజమౌళి చాలా అద్భుతంగా ఎడిట్ చేశారని..క్వాలిటీ అదిరిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాలో ప్రధానమైన సన్నివేశాలకు సంబంధించిన వీడియో క్లిప్పులను ఎక్స్లో షేర్ చేస్తూ ‘మిస్ కాకుండా చూడండి’ అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్.. తల నరికే సన్నివేశాలను బాగా వైరల్ చేస్తున్నారు. సూపర్స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.#MaheshBabu Son #GauthamGhattamaneni About #BaahubaliTheEpic 🔥#Prabhas pic.twitter.com/91tefgPyit— Karri Mohan (@Karrimohan_MB) October 30, 2025కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడో తెలుసుకోవడం కోసం ఇప్పుడు రెండేళ్లు వేచిచూడాల్సిన అవసరం లేదని... ఎడిట్ చేసిన తర్వాత ఈ చిత్రం మరింత అద్భుతంగా ఉందని గైతమ్ అన్నారు. ‘ప్రతి సెకనుకు గూస్బంప్స్ వస్తున్నాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ‘బాహుబలి: ది ఎపిక్’ని చూడడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం’ అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ చెప్పుకొచ్చాడు. Legendary stuff Man. Top tier movie experience. Metreon IMAX was screaming. The editing was so fire especially the entire 2nd half was perfect. Loved the new frames and scenes they added especially the Nassar dialogues in Shivudu entry to Mahishmathi🔥🔥 #BaahubaliTheEpic https://t.co/ukIDkWmT1i pic.twitter.com/3yFzmTtlxh— Telugu Smash (@SmashTelug20458) October 30, 2025Watching this scene gives me goosebumps all over my body @ssrajamouli & BB movie is Your best work till now in your movie career.Now I understand why you became no 1 director in Indian cinema.#Prabhas #SSRajamouli #BaahubaliTheEpic #BahubaliTheEpicpic.twitter.com/iMrcxh0X00— Chaitanya (@CallMeChai__) October 30, 2025👇🏻royal entry is reason enough to watch #BaahubaliTheEpic 🥵🔥I still remember when people first started using the term "Majestic Walk", it belonged only to #Baahubali 💥😎Majestic Walk= Baahubali. Always! 🥳#Prabhas absolutely justified that ✅💥🤩pic.twitter.com/9V4OkBAoTE— Manu (@Little_Heartzzz) October 30, 2025A movie that's going to transcend generations 🤙🏻Trimmed very well to make it extremely racy, surreal experience in IMAX, 10 years ayina adhe oopu, adhe high 🥵Every 10 years ilage rerelease chesthu vellandi, memu chusthu untam ❤️#BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/Z5bsO7NGjh— LoneBatman (@SampathGNV) October 30, 2025Extraordinary first half #BaahubaliTheEpic Imax version is 🥰❤️ lovable @BaahubaliMovie @ssrajamouli #bahubali #Prabhas pic.twitter.com/95TGBZ0SCE— mfaisall (@Moviesculturee) October 30, 2025Properly optimized for IMAX, no degradation in image or sound quality, doesn't look like a cheap rerelease cash grab. Thank you @ssrajamouli and team for presenting the world of Baahubali for us and the world, AGAIN 🙌🏻🤙🏻🔥#BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/y8OxKtkRmw— LoneBatman (@SampathGNV) October 30, 2025
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణలో విధ్వంసం సృష్టించిన ‘మోంథా’... ఉమ్మడి వరంగల్పై తీవ్ర ప్రభావం
ఏపీలో తీరం దాటిన మోంథా తుఫాను
కోస్తాకు ‘మోంథా’ తుపాను గండం..
కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు!
ముంచుకొస్తున్న సూపర్ సైక్లోన్
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు
విశాఖ అభివృద్ధి గురించి ఆలోచించింది జగనే..
ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా
క్రెడిట్ చౌర్యంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
క్రీడలు
భారత బౌలర్లను ఉతికారేసిన 22 ఏళ్ల ఆసీస్ బ్యాటర్
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా భారత్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. ఈ కీలక పోరులో 22 ఏళ్ల లిచ్ఫీల్డ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. భారత బౌలర్లను ఉతికారేసింది.దీప్తీ శర్మ వంటి స్టార్ స్పిన్నర్ను సైతం లిచ్ఫీల్డ్ విడిచిపెట్టలేదు. రివర్స్ స్వీప్, స్కూప్ షాట్లతో ఈ ఆసీస్ యువ సంచలనం అలరించింది. ఆమె పెర్రీతో కలిసి రెండో వికెట్కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన లిచ్ఫీల్డ్.. కేవలం 77 బంతుల్లోనే తన మూడో వన్డే సెంచరీ మార్క్ను అందుకుంది.ఆమెకు ఇదే తొలి వరల్డ్ కప్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్గా 93 బంతులు ఎదుర్కొన్న లిచ్ఫీల్డ్.. 17 ఫోర్లు, 3 సిక్స్లతో 119 పరుగులు చేసింది. దీంతో మహిళల వన్డే వరల్డ్కప్ నాకౌట్స్లో సెంచరీ చేసిన మూడో ఆసీస్ ప్లేయర్గా లిచ్ఫీల్డ్ నిలిచింది. ఆమె కంటే ముందు హీలీ, కరెన్ రోల్టన్ ఈ ఫీట్ సాధించారు.అదే విధంగా మహిళల వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్గా లిచ్ఫీల్డ్ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు హర్మన్ ప్రీత్ కౌర్ పేరిట ఉండేది. 2017 ప్రపంచకప్ సెమీస్లో ఆసీస్పై హర్మన్ 90 బంతుల్లో సెంచరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కేవలం 77 బంతుల్లోనే శతక్కొట్టిన లిచ్ఫీల్డ్.. హర్మన్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.WHAT A SHOT BY 22 YEAR OLD PHOEBE LITCHFIELD AGAINST DEEPTI SHARMA.🔥- Phoebe Litchfield & Ellyse Perry dominating Indian bowlers Kranti Gaud, Radha, Amanjot Kaur.🥶pic.twitter.com/WpHTXWA0AC— MANU. (@IMManu_18) October 30, 2025
టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ ఫెయిల్! అయినా భారీ స్కోర్
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎ, భారత్-ఎ మధ్య జరుగుతున్న మొదటి అనధికారిక టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆటలో భారత్పై సౌతాఫ్రికా బ్యాటర్లు పై చేయి సాధించారు. ప్రోటీస్ ఎ జట్టు డే వన్ ఆట ముగిసే సమయానికి 85.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. క్రీజులో షెపో మోరెకి(4), కుహ్లే సెలె(0) ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జోర్డాన్ హెర్మాన్(71), హంజా(66), రుబిన్ హెర్మాన్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ మార్క్స్ అకెర్మాన్(18) పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ముంబై స్పిన్నర్ తనీష్ కొటియన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మానవ్ సుత్తర్ రెండు, అన్షుల్ కాంబోజ్, ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.పంత్ రీ ఎంట్రీ..ఇండియా-ఎ జట్టుకు సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. గాయం కారణంగా వెస్టిండీస్తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పంత్.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ కాలి మడమకు గాయమైంది.దీంతో అతడు దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో భారత్-ఎ తరపున ఆడాలని రిషబ్ నిర్ణయించుకున్నాడు. రెండో అనాధికారిక టెస్టులో కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఆడనున్నారు.చదవండి: IND vs SA: లంచ్కు ముందే టీ బ్రేక్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి
IND vs SA: కోహ్లిని అవమానించిన రిషభ్ పంత్?!.. ఫ్యాన్స్ ఫైర్
టెస్టు క్రికెట్లో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. సంప్రదాయ ఫార్మాట్లో కెప్టెన్గా భారత్ను అగ్రస్థానంలో నిలిపిన కోహ్లి.. మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో జట్టును ఫైనల్కు చేర్చాడు.ఇక టీమిండియా తరఫున మొత్తంగా 123 టెస్టులు ఆడిన కోహ్లి.. 9230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు కూడా ఉన్నాయి. అయితే, అనూహ్య రీతిలో ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు ముందు తనకు ఇష్టమైన టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లి.భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గాఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ సందర్భంగా పంత్ భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం బెంగళూరు వేదికగా తొలి టెస్టు మొదలైంది.కోహ్లిని అవమానించిన పంత్?!.. ఫ్యాన్స్ ఫైర్ఈ మ్యాచ్లో పంత్ ‘18’ నంబర్ ఉన్న జెర్సీ ధరించడం కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కాగా 18 నంబర్ విరాట్ కోహ్లిది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘‘రిషభ్ పంత్ కావాలనే 18వ నంబర్ జెర్సీ ధరించి కోహ్లిని అవహేళన చేయాలని చూస్తున్నాడా?.. కోహ్లి అంటే పడని.. హెడ్కోచ్ గౌతం గంభీర్ దృష్టిలో పడి.. అతడిని ఆకట్టుకోవాలనే ఇలా చేస్తున్నాడా?అది కింగ్ కోహ్లి నంబర్. క్రీడా ప్రపంచంలో దిగ్గజ ఆటగాడు రిటైర్ అయిన తర్వాత అతడి గౌరవార్థం జెర్సీ నంబర్కు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలి’’ అంటూ తీవ్ర స్థాయిలో కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాగా ఇటీవల భారత్- ‘ఎ’ తరఫున ఇంగ్లండ్ లయన్స్తో మ్యాచ్లో పేసర్ ముకేశ్ కుమార్ కూడా 18 నంబర్ ఉన్న జెర్సీ ధరించగా ఇలాగే విమర్శలు వచ్చాయి.అసలు విషయం ఇదీ!ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘భారత్- ‘ఎ’ జట్టులో జెర్సీ నంబర్లు ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించబడవు. వాటిపై పేర్లు కూడా ఉండవు. కాబట్టి మ్యాచ్కు ముందు తమకు వచ్చిన జెర్సీలను ఆటగాళ్లు ధరిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రమే పర్టికులర్గా జెర్సీ నంబర్లకు ప్రాధాన్యం ఉంటుంది’’ అని తెలిపాయి.కాగా సౌతాఫ్రికా- ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో టాస్ గెలిచిన భారత్-‘ఎ’ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 79 ఓవర్లలో సౌతాఫ్రికా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్!?
లంచ్కు ముందే టీ బ్రేక్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్లు ఆడేందుకు భారత్కు రానుంది. తొలుత రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్.. ఆ తర్వాత మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. అయితే నవంబర్ 22 నుంచి 25 వరకు గౌహతి వేదికగా సౌతాఫ్రికా-భారత్ మధ్య జరగనున్న రెండో టెస్టులో సరికొత్త సంప్రదాయానికి తెరలేవనుంది.సాధారణంగా రెడ్ బాల్ (టెస్ట్) క్రికెట్ మ్యాచ్లలో మొదటి సెషన్ తర్వాత లంచ్, రెండో సెషన్ తర్వాత టీ బ్రేక్ తీసుకుంటారు. కానీ భారత్-సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్లో మాత్రం ఆటగాళ్లు తొలుత టీ బ్రేక్.. ఆ తర్వాత లంచ్ విరామానికి వెళ్లనున్నారు. నార్త్ ఈస్ట్లో సూర్యోదయం, సూర్యాస్తమయం త్వరగా ఉండటం కారణంగా.. రెడ్ బాల్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆటగాళ్లు లంచ్కు ముందు టీ బ్రేక్ తీసుకోనున్నారు.చరిత్రలో తొలిసారి..ఒక టెస్టు మ్యాచ్ ఆర్డర్ చాలా సింపుల్. తొలుత టాస్, ఆ తర్వాత ఆట ప్రారంభం, లంచ్ బ్రేక్, టీ బ్రేక్, స్టంప్స్. కానీ గౌహతీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరగనుంది.ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. బర్సపారా స్టేడియంలో ఆట ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. అంటే సాధారణ సమయం కంటే అరగంట ముందుగా మొదలు కానుంది. మొదటి సెషన్ ఉదయం 9 నుండి 11 గంటల వరకు జరుగుతుంది. తరువాత 20 నిమిషాల టీ విరామం ఉంటుంది.రెండవ సెషన్ ఉదయం 11:20 నుండి మధ్యాహ్నం 1:20 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆటగాళ్ళు 40 నిమిషాల భోజన విరామం తీసుకుంటారు. చివరి సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. రోజులోని 90 ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు అంపైర్లు ప్రయత్నించనున్నారు. అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఈ షెడ్యూల్ మార్పుపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా తొలి టెస్టు నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.చదవండి: IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్!?
బిజినెస్
ఏఐ ఎఫెక్ట్.. యూట్యూబ్ ఉద్యోగులకు ఎగ్జిట్ ప్లాన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాలలోని ఉద్యోగులను ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే లెక్కకు మించిన ఉద్యోగులు ఏఐ వల్ల ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పుడు తాజాగా.. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఈ జాబితాలోకి చేరింది. అయితే ఈ సంస్థ ఉద్యోగులను బలవంతంగా తొలగించడంలేదు, కానీ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ప్రకటించింది.ఏఐ టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో.. యూట్యూబ్లో తప్పకుండా కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ 'నీల్ మోహన్' ప్రస్తావించారు. కాగా పదేళ్ళలో మొదటిసారి తన ప్రొడక్ట్ డివిజన్లో మార్పులు చేస్తున్నారు.అమెరికాలో పనిచేస్తున్న యూట్యూబ్ ఉద్యోగులు.. స్వచ్చందంగా తమ ఉద్యోగాన్ని వదులుకుంటే, పరిహారం కింద వారికి నిష్క్రమణ ప్యాకేజీలను అందించనున్నట్లు వెల్లడించారు. కంటెంట్ క్రియేషన్, యూజర్ ఎక్స్పీరియన్స్ వంటి వాటిని ఏఐ ప్రభావితం చేయనుంది. కొత్త మార్పులు 2025 నవంబర్ 05 నుంచి అందుబాటులో రానున్నాయి.ఇదీ చదవండి: కొత్త రూల్: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం!యూట్యూబ్ మాతృ సంస్థ.. గూగుల్ తన ఉత్పత్తులు, సేవలలో కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేయడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ పునర్నిర్మాణం జరిగింది. ఏఐ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను పెంచాలని సీఈఓ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా తమ బృందాలను కోరారు.
8వ పేకమిషన్ ఛైర్పర్సన్గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన నిర్మాణంలో మార్పులను సమీక్షించి సిఫార్సు చేయడానికి ఉద్దేశించిన 8వ కేంద్ర వేతన సంఘం (CPC) ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నియామకానికి ఆమోదం తెలిపింది.దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల అలవెన్సులు, పింఛన్ల అంశాలను ఈ కమిషన్ సమీక్షిస్తుంది. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కమిషన్ తన తుది నివేదికను త్వరలో సమర్పించాలని భావిస్తున్నారు.జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్కేంద్ర వేతన సంఘం చరిత్రలో మహిళా ఛైర్పర్సన్గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులవ్వడం విశేషం.సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి 2014లో రిటైర్ అయ్యారు.ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి (UCC) ముసాయిదా కమిటీకి ఛైర్పర్సన్గా నేతృత్వం వహించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఉత్తరాఖండ్ యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది.జమ్మూ-కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ (Delimitation Commission)కు కూడా అధ్యక్షురాలిగా పనిచేశారు.ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI)కు ఛైర్పర్సన్గా సేవలు అందించారు.8వ పే కమిషన్8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు సంప్రదింపులు జరిపింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి త్వరగానే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.ఎవరిపై ప్రభావం?ఎనిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)కు తాజాగా ఆమోదం తెలిపింది. ఇది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.ఇదీ చదవండి: వీసా, మాస్టర్ కార్డుకు రూపే గట్టి పోటీ.. కారణాలు..
25 ఏళ్లు.. 3.5 కోట్లు: అమ్మకాల్లో యాక్టివా
ప్రముఖ టూ వీలర్ కంపెనీ హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI).. యాక్టివా 110, యాక్టివా 125, యాక్టివా-ఐలతో సహా దాని ప్రసిద్ధ యాక్టివా శ్రేణి.. మొత్తం 35 మిలియన్ (3.5 కోట్లు) అమ్మకాల మైలురాయిని సాధించింది. దీన్నిబట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో ఈ స్కూటర్లకు ఉన్న డిమాండ్ స్పష్టంగా అర్థమవుతోంది.హోండా మోటార్సైకిల్.. తన యాక్టివా శ్రేణి స్కూటర్లను 3.5 కోట్ల యూనిట్లను విక్రయించడానికి 25 ఏళ్ల సమయం పట్టింది. 2001లో యాక్టివా స్కూటర్ దేశీయ విఫణిలో ప్రారంభమైంది. 2015 నాటికి 10 మిలియన్ సేల్స్.. 2018 నాటికి 20 మిలియన్ సేల్స్, 2025 నాటికి 35 మిలియన్ సేల్స్ రికార్డ్ సాధ్యమైంది.యాక్టివా స్కూటర్ భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి.. అనేక అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో డిజైన్ అప్డేట్స్, అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కొనుగోలుదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉండటం చేత అమ్మకాలలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది.ఇదీ చదవండి: ఉన్న కారుకే.. రేంజ్ రోవర్ పేరు: నవ్వుకుంటున్న జనం!హోండా యాక్టివా వారసత్వాన్ని కొనసాగించడంలో భాగంగా.. కంపెనీ 2025 ఆగష్టులో యాక్టివా & యాక్టివా 125 యానివర్సరీ ఎడిషన్స్ లాంచ్ చేసింది. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడం మాత్రమే కాకుండా.. బలమైన డీలర్ నెట్వర్క్ను కూడా కలిగి ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో యాక్టివా ఈ, యాక్టివా క్యూసీ1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈపీఎఫ్వో భారీ మార్పునకు సన్నద్ధం! 11 ఏళ్ల తర్వాత..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) భారీ మార్పునకు సన్నద్ధమవుతోంది. ఈపీఎఫ్, ఈపీఎస్ అర్హత కోసం జీతం పరిమితిని పెంచే ప్రతిపాదనపై చర్చించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో సమావేశం కానుంది.ప్రస్తుతం, నెలకు బేసిక్ వేతనం రూ .15,000 వరకు (డీఏతో కలిపి) ఉన్న ఉద్యోగులు మాత్రమే తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పరిధిలోకి వస్తారు. ఈపీఎఫ్వో ఇప్పుడు ఈ పరిమితిని రూ .25,000 లకు పెంచాలని యోచిస్తోంది. ఇది 2014 అనంతరం అంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత భారీ మార్పు కాబోతోంది.ఇది అమల్లోకి వస్తే భారతదేశ శ్రామిక శక్తిలో చాలా మంది ఈపీఎఫ్ ఈపీఎస్ ప్రయోజనాలను పొందుతారు. అంటే ఇప్పుడు పదవీ విరమణ, పెన్షన్ భద్రత కోల్పోతున్న లక్షలాది మంది మళ్లీ వాటి పరిధిలోకి వస్తారు.ప్రస్తుత వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే.. ఉద్యోగి, యాజమాన్యం ఇద్దరూ ఉద్యోగి నెలవారీ బేసిక్ జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తారు. ఇక్కడ యాజమాన్యం వాటా మళ్లీ విభజిస్తారు. 3.67 శాతం ఈపీఎఫ్కు వెళుతుంది. 8.33 శాతం ఈపీఎస్కు కేటాయిస్తారు.ఇక నెలవారీ జీతంలో బేసిక్ పే రూ .15,000 దాటినవారికి ఈపీఎఫ్ కవరేజీ తప్పనిసరి కాదు. అంటే ఈపీఎఫ్ కవరేజీ కావాలంటే తీసుకోవచ్చు. వద్దనుకుంటే విరమించుకోవచ్చు.ఈపీఎఫ్ఓ ఇప్పటికే దేశవ్యాప్తంగా 7.6 కోట్ల క్రియాశీల సభ్యులతో రూ .26 లక్షల కోట్ల భారీ నిధిని నిర్వహిస్తోంది. ఈ మార్పు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. జీతాలతోపాటు ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో పాత నిబంధనలు నేటి వాస్తవికతకు సరిపోవు. కొత్త పరిమితి అమల్లోకి వస్తే మరింత మంది కార్మికులకు పదవీ విరమణ అనంతర రక్షణను పొందడానికి సహాయపడుతుంది.
ఫ్యామిలీ
కార్తీక దీపానికి భక్తకోటి కాంతులు
అవి ప్రతి యేటా జరిగే బ్రహ్మోత్సవాలు కాదు... సనాతనంగా నిర్వహించుకునే నవరాత్రులూ కాదు తరతరాలుగా చేసుకునే పండుగలో పర్వదినాలో కాదు అలాగని అది మునుపెన్నడూ చేయని క్రతువు కాదు. వేదాలు.. పురాణేతిహాసాలు అందించిన ఒక చిన్న వెలుగుకు కోటికాంతులు అద్దిన ఉత్సవం. కార్తికమాసానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన అద్భుతం. సుమారు పుష్కరకాలం క్రితం కార్తికమాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభం. అదే భక్తిటీవీ కోటి దీపోత్సవం. కార్తికమాసం వస్తోందనగానే ఆస్తికులందరికీ గుర్తుకువచ్చే అపురూప సంరంభం. భక్తిటీవీ కోటిదీపోత్సవం. చరిత్రలో మునుపెవ్వరూ చేయని విధంగా భక్తిటీవీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం కోటిదీపోత్సవం. 2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై... పుష్కరకాలానికి పైగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఎప్పటిలాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా.. ప్రాంగణంలో ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు, పూజాసామాగ్రి ఇలా ప్రతీది ఉచితంగా సిద్ధం చేస్తారు.సుమారు పుష్కరకాలం క్రితం... పదమూడేళ్లక్రితం శృంగేరీ దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు విజయ యాత్రలో భాగంగా భాగ్యనగరానికి విచ్చేశారు. ఈ సందర్భాన్ని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి దంపతులకు ఓ సంకల్పం కలిగింది. భక్తులందరి సమక్షంలో వారికి గురువందనం చేయాలని భావించారు. దానితోపాటు కార్తికమాసంలో శివస్వరూపమైన జగద్గురువులు స్వయంగా విచ్చేశారు గనుక.. వారి సమక్షంలో కార్తికదీపోత్సవం నిర్వహించాలని సంకల్పించారు. ఆ చిన్న సంకల్పానికి ప్రతిరూపమే 2012లో జరిగిన లక్షదీపోత్సవం. భక్తిటీవీ చేపట్టిన దీపయజ్ఞానికి నాంది అది. ఎన్టీఆర్స్టేడియం వేదికగా కైలాసాన్ని తలపించే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై శృంగేరి జగద్గురువులు దీపారాధన చేసి భక్తులను ఆశీర్వదించారు.ముక్కోటి దేవతలు ఒక్కటైనారు...కార్తికమాసంలో శంకరనారాయణులనే కాదు.. సమస్త దేవతలను కోటిదీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కల్యాణోత్సవాలను, విశేష పూజలను వీక్షించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీవైష్ణవ దివ్యదేశాలు ఇలా అనేకానేక విశిష్టధామాల నుంచి కోటిదీ΄ోత్సవ వేదికపై ఉత్సవమూర్తులు కొలువుదీరతాయి. ఆ ఉత్సవర్లను దర్శించడం సాక్షాత్తూ ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం. ఉజ్జయిని, అరుణాచలం, వేములవాడ, కాళేశ్వరం వంటి శైవ క్షేత్రాలు.. యాదాద్రి, శ్రీరంగం, కొండగట్టు తదితర వైష్ణవ క్షేత్రాలు... అలంపురం, కంచి, వారణాసి వంటి శక్తిపీఠాలు. ఇలా ఒకటేమిటి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ దేవతామూర్తులు కోటిదీ΄ోత్సవ వేదికపై కొలువుదీరతారు. కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు... పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం. ఎన్నో పూజలు – పరిణయోత్సవ వైభవ సమాహారం.గురుర్దేవో మహేశ్వరఃప్రతి ఏటా దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలి వస్తుంటారు. శివైక్యం చెందిన కంచికామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్రసరస్వతి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యానృసింహ భారతిస్వామి, ఉడిపి పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామి, ఆర్షవిద్యాగురుకులం శ్రీదయానందసరస్వతి వంటి మహామహులు కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించడం వీక్షకుల అదృష్టం. శృంగేరి శంకరాచార్య భారతీ తీర్థమహాస్వామి, పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి, జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానందస్వామి, ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గివాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ, సమతామూర్తి స్థాపకులు త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, కుర్తాళం పీఠాధిపతి శ్రీవిద్యాశంకరభారతిస్వామి, ధర్మస్థల క్షేత్రాధికారి వీరేంద్రహెగ్డే, అక్షయ΄ాత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీమధుపండితదాస, ఇస్కాన్ అంతర్జాతీయ అధ్యక్షులు జయపతాకస్వామి, పతంజలి యోగ బాబారామ్ దేవ్, కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతిస్వామి, రుషికేశ్ పరమార్థ్నకేతన్ చిదానంద సరస్వతి, కాశీ – శ్రీశైల జగద్గురువులతో పాటు ఎందరెందరో యోగీశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మాతాజీలు భక్తిటీవీ కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించారు. గురుదేవులే మహేశ్వరులై భక్తకోటిని అనుగ్రహించారు. ఈ ఏడాది సైతం శృంగేరి జగద్గురు విధుశేఖరభారతిస్వామివారు.. కంచి జగద్గురు విజయేంద్రసరస్వతి స్వామివారు విచ్చేయడం కోటిదీపోత్సవానికి సూర్యచంద్రుల ఆగమనం లాంటి శుభతరుణం. సువర్ణాక్షరాల ఘట్టాలు కోటిదీపోత్సవ చరిత్రలోనే కాదు... భక్తిటీవీ ప్రస్థానంలో సైతం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టాలు. కోటిదీపోత్సవం – 2023. కోటిదీపోత్సవం – 2024. రెండేళ్ల క్రితం మహాదేవునికి కోటిదీపాల నీరాజనం అర్పించేందుకు తుమ్మల నరేంద్రచౌదరి – రమాదేవి దంపతుల ఆహ్వానం మేరకు.. సాక్షాత్తూ దేశప్రధానమంత్రి నరేంద్రమోది విచ్చేయడం... దీపారాధన కార్యక్రమాన్ని ఆద్యంతం గమనించి.. తాను సాక్షాత్తూ కాశీలోనే ఉన్న భావన కలుగుతోందని ప్రశంసించడం ఓ అపూర్వ జ్ఞాపకం. గతేడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయడం మరో మరపురాని ఘట్టం. దేశ ప్రథమ ΄ పౌరురాలి చేతులమీదుగా కార్తికదీపం వెలిగింది. భక్తుల ఆనందం కోటిదీపాల కాంతులై మెరిసింది. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టమని ద్రౌపది ముర్ము పేర్కొనడం అద్వితీయం. సప్తహారతులు... మహానీరాజనాలు ఈ అపూర్వ వేడుకలో అన్నింటికీమించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే.. కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు.. ఈ కోటిదీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు.లక్ష కాదు.. కోటి 2013లో... మళ్లీ కార్తికమాసం రానే వస్తోంది. 2012లో జరిగిన వైభవం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. లక్షదీపోత్సవం కంటే మించినది ఏదైనా చేయాలని తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి – వారి కుమార్తె రచనా చౌదరిల సంకల్పం. ఆ సంకల్పానికి ప్రతిరూపమే అంతవరకూ ఎవరూ చేయని మహోత్సవం. నూతన ఆధ్యాత్మిక యుగానికి పునాదులు వేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవం. ఆనాడు వెలిగిన దీపజ్యోతి ఇంతింతై అన్నట్లుగా... పుష్కరకాలంగా కొనసాగుతోంది. అఖండదీపమై ప్రకాశిస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త హంగులతో వెలుగొందుతోంది. కోటిదీ΄ోత్సవానికి వస్తే సమస్త క్షేత్రాలకు వెళ్లినట్లే అనే భావన ప్రతీ భక్తుడికీ కలిగేలా కార్యక్రమ రూపకల్పన జరిగింది. నటరాజుకు కళాంజలి: జానపద కళలకు సైతం కోటిదీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కథకళి, కైకుట్టి, మోహినిఆట్టం, ఒడిస్సీ, మణిపురి, లావణి వంటి సంప్రదాయ నృత్యాలతో పాటు.. డోలుకుణిత, భాంగ్రా, కోలాటం వంటి అనేకానేక విభిన్న పదనర్తనలు కోటి దీ΄ోత్సవ వేదికపై కదం తొక్కనున్నాయి. ఇందుకోసం ప్రసిద్ధ కళాకారులు సైతం తరలివస్తారు. సద్గురు జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈశా ఫౌండేషన్ తరఫున బ్రహ్మచారులు చేసే అగ్నినృత్యం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుత ప్రదర్శనలు ప్రతిఏటా చోటుచేసుకుంటాయి.ఆ అపూర్వ యజ్ఞంమరోమారు...కార్తికమాసాన్ని పురస్కరించుకునినవంబరు1 నుంచి 13 వరకుహైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో...
పంచారామాలలో ప్రథమం అమరలింగేశ్వరాలయం
కృష్ణానదిలో స్నానం... అమరేశ్వరుని దర్శనం’ మోక్షదాయకం అన్నారు పెద్దలు. తెలుగునేల మీద ఉన్న పంచారామాలలో ప్రథమమైనదిగా భావించే అమరేశ్వర స్వామి ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కృష్ణానది ఒడ్డున వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్నది. ఇక్కడ వెలసిన బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామిని దర్శించి తరించటానికి భక్తజనం నిత్యం అమరావతిని సందర్శిస్తుంటారు. శ్రీశైలానికి ఈశాన్య భాగాన కృష్ణానది దక్షిణపు గట్టున ఉన్న ఈ క్షేత్రం దేవతలు, గంధర్వులు, ఋషులు సేవించిన మహిమ గల క్షేత్రంగా భక్తులు భావిస్తారు.దేవాలయంలో గల వివిధ శాసనాలు ద్వారా అమరేశ్వరుణ్ణి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి వివిధ రాజవంశీయులు సేవించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా పల్లవ, రెడ్డి, కోటకేతు రాజులు అమరేశ్వరుని సేవించినట్లు చరిత్ర చెపుతోంది.శ్రీ కృష్ణదేవరాయలు అమరేశ్వరుని దర్శించి తులాభారం తూగినట్లు, బ్రాహ్మణులకు దానాలిచ్చినట్లు ఆధారాలున్నాయి. అలాగే 18వ శతాబ్దంలో చింతపల్లిని రాజధానిగా చేసుకుని దక్షిణాంధ్రదేశాన్ని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఆలయాన్ని పునరుద్ధరించి, మూడు ప్రాకారాలతో 101 లింగాలను ప్రతిష్ఠించారు. నేటికీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులే అనువంశీక ధర్మకర్తలుగా స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అమరావతి క్షేత్రం హరిహర క్షేత్రంగా కూడా పిలవబడుతుంది.ఆలయంలో వేంచేసి ఉన్న వేణుగో΄ాల స్వామి క్షేత్ర΄ాలకునిగా విరాజిల్లుతూ శివ కేశవులకు భేదం లేదని చాటుతున్నాడు.ఏకశిలా రూపంగా దాదాపు 15 అడుగుల ఎత్తున, మూడు అడుగుల కైవారం కలిగిన ఈ లింగం జగద్విఖ్యాతం. ఓంకారానికి ప్రతిరూపంగా స్వామి వారి నుదుట మూడు చిన్న గుంటలు నేటికి దర్శనమిస్తాయి.శుక్రాచార్యుడి సందేహంఅసుర గురువు శుక్రాచార్యుడు తన గణాలతో వచ్చి భవిష్యత్తులో సహ్యాద్రి పర్వతం మీద కృష్ణవేణి అనే నది పుట్టి ఇటువైపుగా ప్రవహిస్తుంది కనుక దాని ప్రవాహానికి అమరేశ్వరుడు మునిగిపోవచ్చునేమో అనే సందేహం వెలిబుచ్చాడు. అందుకు బృహస్పతి సమాధాన మిస్తూ, అమరేశ్వరుడు వెలసిన దీన్ని క్రౌంచగిరి అంటారనీ, దీని అడుగు పాతాళం దాకా ఉందనీ, దానివల్ల ఈ లింగం స్థిరంగా ఉంటుందనీ, కృష్ణమ్మ ఈ గిరి పక్క నుంచి వంక తిరిగి పారుతుందే తప్ప ఎన్నటికీ దీనిని ముంచెత్తదనీ బదులు చెప్పాడు. దీనికి ఆధారంగా ఇప్పటికీ కృష్ణానది ఈ క్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంది.అమరలింగేశ్వరాలయ ప్రాముఖ్యత...ద్వాపర యుగం చివరిలో 5053 సంవత్సరాల క్రితం మరియూ కలియుగ ప్రారంభంలో సౌనకాది మహర్షి నారదుడిని మోక్షానికి ఉత్తమమైన మార్గాన్ని కోరినట్లు స్కాంద పురాణం పేర్కొంది. నారదుడు శౌనకాది మహర్షిని కృష్ణానదిలో రోజూ స్నానం చేసి, కృష్ణుడు సృష్టించిన నది ఒడ్డున, అమరేశ్వరుణ్ణి దర్శిస్తూ నివసించమని సలహా యిచ్చాడు.నారద మహర్షి సౌనకాది అమరేశ్వర ఆలయ కథను చెప్పాడు, తన భక్తులకు కోరికలు తీర్చడానికి శివుడు ఇక్కడ లింగం రూపంలో వెలిశాడని చెప్పాడు. అలాగే కష్ణానదిలో స్నానం చేసి ఇక్కడి ఆలయంలోని అమరేశ్వరుడిని పూజించిన వారికి పాపాలు తొలగిపోతాయని చెప్పారు. ఈ ప్రదేశంలో మూడు రోజులపాటు ఉండి భక్తిశ్రద్ధలతో శివపూజ చేసిన భక్తులు శివలోకాన్ని పొందుతారన్నారు. ఇక్కడ ఏ భక్తుడు మరణించినా శివుడు గ్రహిస్తాడు.అమరలింగేశ్వర ఆలయ ఉత్సవాలు...ఈ ఆలయంలో కార్తీక మాసం, మహా బహుళ దశమి, నవరాత్రి, మహా శివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయ సమయాలు...మామూలు రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది. ప్రస్తుత కార్తికమాసాన్ని పురస్కరించుకుని ఉదయం 5.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సా. 4 గంటల నుండి రాత్రి 8.30 వరకు గుడిని తెరచి ఉంచుతారు.కార్తీకమాసం పౌర్ణమి, సోమవారాలలో ఉ.3 నుండి రాత్రి 10 వరకు, ఆదివారాలలో ఉ. 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు.
రుచులదాత 'సుషీ'భవ..! భోజనప్రియులు ఇష్టపడే క్రేజీ వంటకం
జపాన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది ‘సుషీ’.. ఆ ఫుడ్ ఇప్పుడు ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఆదరణ పొందుతోంది. ఆ రుచి కొన్నేళ్లుగా నగరవాసులను ఆకట్టుకుంటోంది. దేశంలో సుషీ ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం మనది బియ్యం ఉత్పత్తి చేసే ప్రధాన దేశం కావడం. అలాగే చేపలు తినే సంస్కృతితో విస్తారమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉండటం అని ఎగ్జిక్యూటివ్ చెఫ్ స్వప్నదీప్ ముఖర్జీ చెప్పారు. 1990లలో ఆర్థిక సంస్కరణల సమయంలో మనం విదేశీ కంపెనీలకు తలుపులు తెరిచినప్పుడు, చాలా మంది జపనీస్, కొరియన్ ఇతర దేశాల నుంచి ప్రజలు మన దేశానికి వచ్చారు. ఇది మన దేశంలో అంతర్జాతీయ ప్రమాణాల జపనీస్ ఆహారం కోసం డిమాండ్ను పెంచింది. తద్వారా మరిన్ని జపనీస్ అవుట్లెట్లు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. నేటి ‘మన జపనీస్ వంటకాల అభిరుచులకు ఊపిరిలూదింది ఢిల్లీలోని మెట్రోపాలిటన్ హోటల్ స్పాలో ‘సకురా’ రెస్టారెంట్. తర్వాత అలా అలా అన్ని నగరాలకు విస్తరించింది. విస్తృత శ్రేణి భారతీయ పాలెట్ ప్రకారం సుషీ మార్పుచేర్పులకు లోనవుతోంది. ఆచారి సుషీ, పనీర్ టిక్కా సుషీ, జైన్ సుషీ, అరబిక్ సుషీ వంటి విభిన్న పేర్లతో మమేకమైంది. సుషీ కేవలం పచ్చి చేప మాత్రమే కాదని, ఇది చాలా సూక్ష్మంగా ఉండే క్రమశిక్షణ కలిగిన క్రాఫ్ట్ అని ప్రజలు అర్థం చేసుకోవడానికి పెరిగిన ఎక్స్పోజర్ సహాయపడింది. నగరానికి దశాబ్దాల క్రితమే పరిచయమై నానాటికీ డిమాండ్ పెంచుకుంటున్న వంటకం సుషి. సిటీలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగిన నేపథ్యంలో పుష్కలమైన ప్రోటీన్లను అందించేదిగా పేరున్న ‘సుషి’ డిమాండ్ కూడా ఊపందుకుంది. జపనీయులు ఆరోగ్య వంతులుగా ఉండటానికి అక్కడి వండేశైలి ప్రధాన కారణమనేది జగమెరిగిన సత్యం. రా ఫిష్, వెజిటబుల్స్, రైస్లతో కేవలం 30శాతం మాత్రమే కొవ్వు పదార్థాలు ఉండే సుషీ అధికంగా తినడం వల్లనే అక్కడ గుండె జబ్బులు ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలకన్నా చాలా తక్కువగా ఉన్నాయని, అలాగే రైస్, రాఫిష్తో కలగలిపిన సుషి కర్రీ.. లంగ్ కేన్సర్లు రాకుండా కూడా నివారిస్తోందని పాకశాస్త్ర నిపుణుల విశ్లేషణ. ఫినిష్.. అనారోగ్యం.. ఈ సంప్రదాయ జపనీస్ వంటకాన్ని ముడి చేప, బియ్యం, సాధారణంగా రెండు పదార్థాలతో తయారు చేస్తారు. దీనిలో వాడే వినెగర్డ్ రైస్ను సముద్ర ఆహారం, కూరగాయలు నుంచి మాంసం వరకు పలు పదార్థాలతో కలపవచ్చు. సుషి, టెంపురా, సాషి్మ.. వగైరా వంటకాల ద్వారా ప్రతి జపనీయుడు రోజుకు 100 గ్రాముల చేపల్ని ఆహారంలో భాగం చేస్తాడట. చేపల్లో ఉండే ఒమెగా–3 యాసిడ్స్ గుండెకు రక్షణ అందిస్తాయి. ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన ప్రొఫెసర్ టొషిరో ట్యాకెజకి ఏమంటారంటే.. ‘జపనీస్కి తాజా చేప అంటే చాలా ఇష్టం.. సుషిలో రాఫిష్ ప్రధాన భాగం. అందుకే యుకె లాగే ఇక్కడ కూడా బాగా పొగతాగే అలవాటు ఉన్నప్పటికీ లంగ్ కేన్సర్ మాత్రం అక్కడితో పోలిస్తే చాలా తక్కువగా ఉంది’ అని జపనీయులు పరిచయం చేసిన ఆహార పదార్థం సుషి. సిటీలో ఎక్కడంటే.. వండటం అనే ప్రక్రియకు చాలా వరకూ దూరంగా ఉంటుంది కాబట్టి ఇది దాదాపుగా రా డిష్ అనే చెప్పాలి. ఉడకబెట్టిన ఏదైనా రైస్ వెరైటీని సముద్రపు ఆకుల్లో చుట్టి ఫిష్, మటన్, చికెన్, రొయ్యలు లేదా కూరగాయలు గానీ కలిపి రోల్ చేస్తారు. (జపనీస్ కేవలం చేపలు మాత్రమే వినియోగిస్తారు) అనంతరం తగిన ఫ్లేవర్లు అద్ది సర్వ్ చేస్తారు. దీనికి సపోర్ట్గా సాసెస్ కూడా ఉంటాయి. సుషితో పాటు తరచూ సర్వ్ చేసే వ్యాసబీ అనే గ్రీన్ పేస్ట్లో ఉండే ఇసొతైసైనేట్స్ పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టి, రక్తం గడ్డకట్టుకుపోయే పరిస్థితుల్ని కూడా నివారిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. సుషికి అదనపు రుచిని అందించే ఫ్లేవర్లలో ఒకటైన అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సుషిని టేస్ట్ చేయాలంటే.. కోకాపేట్లోని కోకోకాయి. జూబ్లీహిల్స్లోని అర్బన్ ఏషియా, యూమీ, నోహో, హైటెక్ సిటీలోని కోకో, బంజారాహిల్స్లోని హిడెన్ లీఫ్, మాదాపూర్లోని మోషె, జూబ్లీహిల్స్లోని మాకో బ్రూ కేఫ్ అండ్ రెస్టారెంట్.. తదితర రెస్టారెంట్స్కు ఓ రౌండ్ కొట్టాల్సిందే. లేదా స్టార్ హోటల్స్లో ప్రత్యేకంగా ఏర్పాటయ్యే థాయ్, చైనీస్ రెస్టారెంట్లను సందర్శించాలి. (చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..)
మా ఆయన ప్రతీ అమ్మాయిని అదోలా చూస్తాడు? ఎందుకలా..?
నాకు పెళ్లి అయి 12 సంవత్సరాలు అవుతోంది. ఇద్దరు పిల్లలున్నారు. నా భర్త మంచివాడే, ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తనలో ఉన్న ఒక చిత్రమైన అలవాటు నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. అదేమంటే అతను రోడ్డు మీద వెళ్లే ప్రతి అమ్మాయిని అదోలా చూస్తుంటాడు. వారికి ఏదో ఒక పేరు పెడతాడు. తర్వాత నాతో వారి శరీర సౌష్టవం గురించి కామెంట్స్ చేస్తాడు. మా ఏకాంత సమయంలో ఆ పేర్లు కలవరిస్తూ ఉంటాడు. మొదట్లో అంతగా అనిపించలేదు కానీ పోను పోనూ ఆయన ప్రవర్తన నాకు కంపరంగా తయారైంది. దాంతో అతని మీద ఒకవిధమైన విముఖత ఏర్పడింది. ఒక్కోసారి అతన్ని వదిలేసి వెళ్ళి పోవాలనిపిస్తుంది కూడా! గట్టిగా అడిగితే అలా ఊహించుకోకుండా ఉండలేక పోతున్నానంటారు. ఇదేమైనా మానసిక సమస్య అంటారా! ‘మా సమస్యకేదైనా పరిష్కారముందా? – ఒక సోదరి, నంద్యాలమీ ఉత్తరం చదివి మీరు పడే క్షోభను అర్థం చేసుకోగలను. ఊహ అనేది మనిషికి మాత్రమే ఉన్న ఒక అద్భుత శక్తి. ఒక విజయం సాధిస్తానని ఊహించడం మనలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. అలాగే భార్యా భర్తల బంధం కొంచెం రొటీన్గా మారినప్పుడు ఇలా ‘ఫాంటసైజ్’ చేయడం కొందరికి కొత్త ఉత్సాహన్ని ఇస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఊహించుకోవడం మామూలే! ఇది పురుషుల్లో అధికంగా చూసినప్పటికీ, స్త్రీలు కూడా ఇలా ‘ఫాంటసైజ్’ చేసుకుంటారని పరిశోధనల్లో తేలిన విషయం. అమెరికాలో 90వ దశకంలో జరిపిన ఒక పరిశోధన ప్రకారం కొందరు స్త్రీ, పురుషులు తమ భాగస్వామితో ఉన్నప్పుడు, వేరే వారిని ఊహించుకుంటారని తెలిసింది. మనదేశంలో జరిపిన పరిశోధన లో కూడా కనీసం 35 శాతం మంది ఇలా వేరే వారిని ఊహించుకుంటారని తెలిసింది. పురుషులు ఎక్కువగా తెలియని వారిని, సెలబ్రిటీలను ఊహించుకుంటే, స్త్రీలు తమకు తెలిసిన వారినే ఎక్కువ ఊహించుకుంటారని తెలిసింది. దీనికి ప్రధానమైన కారణం మెదడులో, ‘డోపమిన్’ అనే రసాయనం చాలా తొందరగా తగ్గిపోడం, అలాంటప్పుడు ఇతర స్త్రీల మీద పురుషులు మోహం పెంచుకుంటారు. లేదా వాళ్ళని ఫాంటసైజ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని ‘సెవెన్ ఇయర్ ఇచ్’ అని కూడా అంటారు. మామూలుగా చాలామంది మగవారు వారి భాగస్వామికి తెలియకుండా ఇలా చేస్తారు. కొంతకాలానికి అదే సర్దుకుంటుంది. అయితే మీవారి విషయంలో ఈ ప్రవర్తన హద్దులు మీరిందంటే అది ఒక మానసిక సమస్యను సూచిస్తుంది. కాబట్టి తనకి పారాఫిలియా’ లేదా ‘కంపల్సివ్ సెక్యువల్ బిహేవియరల్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే మీరు బాధపడతారని కొంచెం కూడా తను ఎంపతీ చూపలేకపోతున్నాడు. కాబట్టి, పర్సనాలిటీ సమస్యలు కూడా ఉండి ఉండచ్చు. ఏమైనా మీరు సహనాన్ని కోల్పోకండి. అలాగని ఇంకా ఆలస్యం చేయకండి. ఇద్దరూ కలిసి ఒక మంచి సైకియాట్రిస్టుని లేదా అనుభవం కలిగిన క్లినికల్ సైకాలజిస్టుని సంప్రదించండి. వారు మీ ఇద్దరితోనూ వివరంగా మాట్లాడి, కూలంకషంగా ఆయన్ని పరీక్షించి ఆయనకు ఉన్న సమస్య ఏమిటనేదానిపై ఒక నిర్థారణకు వస్తారు. అప్పుడు అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్, మందులు, ఇతరత్రా సలహాలు ఇస్తారు. తప్పకుండా ఆయనలో మంచి మార్పు వస్తుంది. విష్ యు ఆల్ ది బెస్ట్.డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
ఫొటోలు
వెెకేషన్లో చిల్ అవుతోన్న హీరోయిన్ రాశి ఖన్నా (ఫోటోలు)
కజిన్ సిస్టర్ కూతురి పెళ్లిలో అనసూయ సందడి (ఫోటోలు)
మోంథా ఎఫెక్ట్: వరంగల్ అతలాకుతలం (ఫోటోలు)
జపాన్ మొబిలిటీ షో 2025: మైమరిపిస్తున్న కొత్త వాహనాలు (ఫోటోలు)
డైమండ్ నగల్లో మెరిపోతున్న రష్మిక మందన్నా (ఫోటోలు)
అన్న కూతురి పెళ్లిలో రాజీవ్ కనకాల- యాంకర్ సుమ సందడి (ఫోటోలు)
ఇట్స్ ఫ్యామిలీ టైమ్ అంటున్న ప్రియాంక చోప్రా (ఫోటోలు)
కార్తీకమాసంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
లేటు వయసు పెళ్లి.. ముచ్చటగా 365 రోజులు (ఫొటోలు)
పుట్టినరోజు వేడుకలో స్టార్ డైరెక్టర్ కూతురు (ఫోటోలు)
అంతర్జాతీయం
104 మందిని చంపేసి కాల్పుల విరమణ పాట!
డెయిర్–అల్–బాలాహ్(గాజా స్ట్రిప్): పెద్దన్న పాత్రలో డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉత్తదేనని తేలిపోయింది. బందీల మృతదేహాల అప్పగింత ఆలస్యమైందన్న సాకు చూపి ఇజ్రాయెల్ మళ్లీ గాజాపై భీకర స్థాయిలో దాడులతో తెగబడింది. సంధి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇజ్రాయెల్ మంగళవారం రాత్రి మొదలెట్టిన భూతల, గగనతల దాడుల్లో ఇప్పటిదాకా 104 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 10న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక ఈ స్థాయిలో దాడులు, ఇంతటి మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. దీంతో పశ్చిమాసియాలో హమాస్ సాయుధులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య విబేధాలు నివురుగప్పిన నిప్పులా అలాగే ఉన్నాయని స్పష్టమైంది. ఇష్టారీతిగా దాడులు చేసి 104 మందిని పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్ సైన్యం బుధవారం సాయంత్రం నుంచి మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకివచ్చిందని ప్రకటించడం గమనార్హం.
మోదీ గొప్ప వ్యక్తి.. కిల్లర్
టోక్యో/సియోల్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వాచాలత్వం ప్రదర్శించారు. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. మోదీ చాలా మంచి మనిషి, చక్కగా, అందంగా కనిపించే నాయకుడు అంటూనే ఆయనొక కిల్లర్, నరకం లాంటి కఠినమైన వ్యక్తి అంటూ ఆక్షేపించారు. మనం ఎలాంటి మంచి తండ్రి కావాలని కోరుకుంటామో సరిగ్గా అలా కనిపించే వ్యక్తి మోదీ అంటూ వ్యాఖ్యానించారు. మూడు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఉదయం జపాన్ నుంచి దక్షిణ కొరియాకు చేరుకున్నారు. గెయింగ్జూలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార(అపెక్) సీఈఓ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహ బాంధవ్యాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఆయన గొప్ప మిత్రుడు అంటూ ప్రశంసించారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని, అందుకోసం వాణిజ్యం అనే అస్త్రం ప్రయోగించానని మరోసారి వెల్లడించారు. భారత్–పాక్ మధ్య ఘర్షణ మొదలైన తర్వాత మోదీతో ఫోన్లో మాట్లాడానని, మీతో వాణిజ్య ఒప్పందం చేసుకొనే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పానని వివరించారు. పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభించారంటూ మోదీని మందలించానని అన్నారు. వాణిజ్య ఒప్పందం ఉండదని కచ్చితంగా చెప్పడంతో భారత్ దారికొచ్చిందని, పాక్పై దాడులు నిలిపివేసిందని స్పష్టంచేశారు. కొత్త, అందమైన యుద్ధ విమానాలు ధ్వంసం దక్షిణ కొరియాకు బయలుదేరడానికి ముందు ట్రంప్ జపాన్ రాజధాని టోక్యోలో వ్యాపారవేత్తలతో విందు కార్యక్రమంలో మాట్లాడారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేశానని చెప్పారు. ఆపరేషన్ సిందూర్లో భారత్కు నష్టం వాటిల్లిందని పరోక్షంగా స్పష్టంచేశారు. ‘‘ఏడు నూతన, అందమైన యుద్ధ విమానాలు నేలకూలాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య జరిగిన యుద్ధంలో అవి ధ్వంసమయ్యాయి’’ అని తెలిపారు.
ప్రభుత్వ వర్సిటీల్లో హెచ్–1బీని ఆపేయండి
న్యూయార్క్: స్థానిక అమెరికన్లకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ తరచూ ప్రసంగాలిచ్చే అమెరికా అధ్యక్షుడి బాటలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ పయనిస్తున్నారు. హెచ్–1బీ వీసాదారులకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వివిధ ఉద్యోగాల్లో నియమించుకునే పద్ధతికి స్వస్తి పలకాలని వర్సిటీలకు ఆయన సూచించారు. ఇప్పటికే ఈ మేరకు ఫ్లోరిడా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ను ఆదేశించానని ఆయన చెప్పారు. బుధవారం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో ఆయన ప్రసంగించారు. ‘‘ ఫ్లోరిడాలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో హెచ్–1బీ వీసాదారులు స్థానికులను తోసిరాజని అన్ని రకాల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. హెచ్–1బీ వీసాదారులంతా ఒకరకంగా వలస కూలీలు. మధ్యలో బ్రోకర్ల సాయంతో ఇక్కడికొచ్చి బాగా సంపాదిస్తున్నారు. ఇదంతా పెద్ద కుంభకోణం. వర్సిటీల ఆడిటింగ్లో ఎన్నో అంశాలు వెలుగుచూశాయి. వర్సిటీల్లో విదేశీయులు అధ్యాపకులుగా, నిపుణులుగా, చివరకు స్విమ్కోచ్ అసిస్టెంట్గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది. కనీసం స్విమ్కోచ్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా అమెరికన్ పనికిరాడా?. ఇకనైనా వర్సిటీలు ఉద్యోగాల్లో అమెరికన్లను నియమించుకోవాలి’’ అని డీశాంటిస్ అన్నారు.
మూడోసారి అవకాశం లేదట!
గ్వాంగ్జు (దక్షిణకొరియా): అమెరికా అధ్యక్ష పదవికి మూడోసారి కూడా పోటీపడాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలను సొంత పార్టీ నేతలే అసాధ్యమని తేల్చేయటంతో ఆయన తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. మూడోసారి పోటీకి అవకాశం లేకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. జపాన్ పర్యటన ముగించుకుని బుధవారం దక్షిణకొరియాకు వెళ్తూ తన ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా కాంగ్రెస్లోని దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్, రిపబ్లికన్ నేత మైక్ జాన్సన్ మంగళవారం వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. ట్రంప్ మూడోసారి పోటీ చేయటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. 22వ రాజ్యాంగ సవరణ ఏ అమెరికన్ పౌరుడు కూడా మూడోసారి అధ్యక్షుడు కావటాన్ని అనుమతించదని స్పష్టంచేశారు. ఒకవేళ ఆ రాజ్యాంగ సవరణను మళ్లీ సవరించి మూడోసారి అధ్యక్ష పదవికి అర్హత లభించేలా చట్టం చేయాలన్నా.. అది పదేళ్ల సుదీర్ఘ ప్రక్రియ అని పేర్కొన్నారు. మైక్ జాన్సన్ ప్రకటన గురించి మీడియా ప్రస్తావించగా ట్రంప్ నిర్వేదంగా మాట్లాడారు. ‘నేను చదివినదాన్ని బట్టి బహుషా నేను కొనసాగటానికి (మూడోసారి అధ్యక్షుడిగా) అనుమతి ఉండదట. ఇది చాలా దురదృష్టకరం. చూద్దాం ఏం జరుగుతుందో’ అని అన్నారు. కష్టమే కాదు.. అసాధ్యం మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగటానికి ఎవరికీ సాధ్యం కాదని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ స్పష్టంచేశారు. ‘నాకు తెలిసి అందుకు మార్గమే లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలో ఉన్న అడ్డంకులపై ఆయన (ట్రంప్)తో నేను చర్చించాను. ఈ విషయంలో ఇక వివాదాన్ని రాజేయలేం. ఆయనకు ఇంకా నాలుగేళ్ల సమయం (అధ్యక్షుడిగా) ఉంది’అని పేర్కొన్నారు. అయితే, తనకు మూడోసారి అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోయినా తన రిపబ్లికన్ పారీ్టలో ఆ పదవికి అర్హత ఉన్న అనేకమంది నేతలు ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో వంటివారు అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చని తెలిపారు. వచ్చేసారి ఉపాధ్యక్షుడిగా పోటీచేసి, తిరిగి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? అని అడగ్గా.. ‘అలా చేయటానికి అవకాశం ఉంది. కానీ నేను చేయను’ అని బదులిచ్చారు.
జాతీయం
’బార్క్’లో నకిలీ శాస్త్రవేత్త.. న్యూక్లియర్ డేటా చోరీ?
ముంబై: దేశంలోని ప్రముఖ అణు పరిశోధనా విభాగం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ కేంద్రంలో పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న ఒక నకిలీ శాస్త్రవేత్తను అరెస్టు చేయడానికి తోడు, అతని నుంచి అనుమానిత న్యూక్లియర్ డేటా, 14 మ్యాప్లను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలలో ఏదైనా గోప్యమైన న్యూక్లియర్ డేటా ఉన్నదీ లేనిదీ తెలుసుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించారు.అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేని అనే నకిలీ శాస్త్రవేత గత వారం ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో అరెస్టు అయ్యాడు. అతను వివిధ పేర్లతో శాస్త్రవేత్తగా నటిస్తూ వస్తున్నాడు. అతని నుండి పోలీసులు పలు నకిలీ పాస్పోర్ట్లు, ఆధార్, పాన్ కార్డులు, నకిలీ బార్క్ ఐడీలు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఐడీలో అతను అలీ రజా హుస్సేన్గా, మరొక దానిలో అతని పేరు అలెగ్జాండర్ పామర్ అని ఉందని పోలీసులు గుర్తించారు. హుస్సేని గత కొన్ని నెలలుగా పలు అంతర్జాతీయ కాల్స్ చేశాడని, అతని కాల్ రికార్డులను గుర్తించామని పోలీసు వర్గాలు తెలిపాయి. అనుమానిత న్యూక్లియర్ డేటాతో ముడిపడిన విదేశీ నెట్వర్క్లతో హుస్సేని సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.హుస్సేని తన గుర్తింపును మార్చుకుని మారువేషంలో చాలాకాలంగా ఉంటున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2004లో రహస్య పత్రాలు కలిగిన శాస్త్రవేత్తగా గుర్తించి, అతనిని దుబాయ్ నుండి బహిష్కరించారు. అయితే ఆ తర్వాత కూడా అతను నకిలీ పాస్పోర్ట్లను ఉపయోగించి దుబాయ్, టెహ్రాన్ తదితర దేశాలలో ప్రయాణాలు సాగించాడు. జార్ఖండ్లోని జంషెడ్పూర్కు చెందిన అఖ్తర్ హుస్సేని 1996లో తన పూర్వీకుల ఇంటిని విక్రయించాడు. అయితే తన పాత పరిచయాల సహాయంతో నకిలీ పత్రాలను రూపొందించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపధ్యంలోనే అతను హుస్సేని మొహమ్మద్ ఆదిల్, నసీముద్దీన్ సయ్యద్ ఆదిల్ హుస్సేని పేర్లతో రెండు నకిలీ పాస్పోర్ట్లను పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జంషెడ్పూర్ చిరునామాతో ఈ పాస్పోర్టులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: Madhya Pradesh: రహస్య కెమెరాలో పోలీసు అధికారిణి.. ఏం చేస్తూ దొరికారంటే..
2 గంటల టైం లేదా? ఇంకెందుకీ జీవితం?
అదొక మాల్లోని మల్టీప్లెక్స్ హాల్.. ప్రేక్షకులందరూ సినిమాను చూస్తున్నారు. అయితే ఒక్క మహిళ మాత్రం సీరియస్గా ల్యాప్ట్యాప్లో పని చేసుకుంటున్నారు. ఆమెను ఎవరో ఫోటో తీసి సోషల్మీడియాలో వైరల్ చేశారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు.. టెక్కీలకు కనీసం రెండుగంటలు సినిమా చూసేందుకు కూడా వీలు కాదా అని జాలితో హేళన చేశారు. బెంగళూరుకు చెందిన టెక్కీ డేటా సైన్స్లో పని చేస్తున్నాడు. ఇతనికి ఏడాదికి రూ. 48 లక్షల వేతన ప్యాకేజీ ఉంది. మరో కంపెనీలో రూ. 75 లక్షల ఆఫర్ వచ్చింది. అయితే పన్నుల భారం పెరుగుతుందని తిరస్కరించారు. పన్నుల భారం మాత్రం రూ. 12 లక్షల నుంచి రూ. 22 లక్షలు అవుతుందని, అందుకే దానిని వద్దన్నట్లు తెలిపారు. నెటిజన్లు అతనిని విమర్శించారు.నిఖిల్.. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఇతడి మృతదేహం అగర చెరువులో దొరికింది. అయితే ఇతడికి పని ప్రదేశంలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని సహోద్యోగి సామాజిక మధ్యమంలో పోస్టు చేశారు. ఈవీ స్కూటర్ కంపెనీలో ఇంజనీరు.. ఇంట్లో డెత్నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నాణేనికి మరో వైపు ఇది.సాక్షి, బెంగళూరు: పైన పేర్కొన్న దురంతాలు అనేకం. నేటి పరిస్థితుల్లో పని, జీవితం సమతూకం చేయడం సాధ్యమా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దూరపు కొండలు నునుపు అనే మాదిరిగా చాలామందికి ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే ఎంతో మక్కువ. దండిగా జీతం, సౌకర్యాలు లభిస్తాయని అనుకున్నారు. కానీ బెంగళూరులో ఎక్కువమంది ఐటీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి మధ్య తమ ఉద్యోగాల కొనసాగిస్తున్నారు. బిజీ జీవితం, పెరిగిన ఖర్చులు, ఈఎంఐలు, పనిలో టార్గెట్ల బెడద ఎక్కువగా ఉన్నట్లు తరచూ వాపోతుంటారు. కొత్త దారుల్లో నడక ఈ నేపథ్యంలో బెంగళూరులో కొందరు టెక్కీలు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఊహించని పనులు చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్లుగా, ట్యాక్సీ డ్రైవర్లు సేవలందిస్తూ రిలాక్స్ అవుతున్నట్లు తెలిపారు. పగలంతా ఉద్యోగంలో బిజీగా ఉండి, రాత్రి కాగానే కొత్త అవుతారం ఎత్తుతారు. మరికొందరు డబ్బు కోసమే చేస్తున్నారు. రాత్రి సమయాలో ఈ వృత్తుల్లోకి మారుతున్నారు. సంపాదిస్తున్న డబ్బులు సరిపోవడం లేదా? లేదా ఊరికే టైంపాస్ కోసం ఇలా చేస్తున్నారా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నం అవుతున్నాయి.ఖరీదైన సిటీలో బతకాలిగా ఇవే ప్రశ్నలను కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను ప్రశ్నిస్తే ఆశ్చర్యకరమైన సమాధానాలు తెలిపారు. బెంగళూరు రోజురోజుకి ఎంతో ఖరీదు అయిన నగరంగా మారుతోంది. అందులోనూ ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతాల్లో ఇంటి అద్దెలు, ఆహారం, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ప్రతి టెక్కీకి అందరూ అనుకున్నట్లుగా పెద్ద పెద్ద జీతాలు లభించడం లేదు. కొత్తగా కెరీర్ ప్రారంభించిన వారికి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వేతనం లభిస్తోంది. ఆ డబ్బు చాలక అదనపు మార్గాలను అన్వేíÙస్తున్నారు. పలువరు యువ ఇంజనీర్లు వారానికి రెండు రాత్రులు అయినా క్యాబ్ నడుపుతూ సంపాదిస్తారు.యాంత్రిక జీవనం ప్రస్తుతం బెంగళూరు టెక్కీలకు జీవితం ఒక యాంత్రికంగా మారిపోయింది. ఉదయాన్నే లేవడం, రెడీ కావడం, ఆఫీసుకు వెళ్లడం, అక్కడ రోజంతా ఒత్తిడిలో కష్టపడడం, టార్గెట్లు, తిరిగి ఇంటికి రావడం, పడుకోవడం ఇలా ఒక రొటీన్ జీవితానికి అలవాటు పడ్డారు. దీంతో జీవితంలో ఒంటరితనం పెరుగుతోంది. అలాగే మానసిక సమస్యలు, కోపం, ఉద్వేగాలు నియంత్రణలో లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి బయటకు వచ్చేందుకు తరచూ ట్రెక్కింగ్ వెళ్లడం, నైట్ పార్టీలకు వెళ్లడం చేస్తున్నారు. అయితే వీటి వల్ల ఆశించిన మేర వారికి ఫలితాలు రావడం లేదు. ఈ క్రమంలో ఒక మార్పు కోసం రాత్రి సమయాల్లో ఇతర వ్యాపకాలను అనుసరిస్తున్నారు.
పెళ్లిలో స్కాన్ చదివింపులు
ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. పదో పరకో చదివింపులు జరుగుతూనే ఉంటాయి. దగ్గరివారైతే కొంచెం ఎక్కువ.. దూరపు చుట్టాలైతే చిన్న చిన్న గిఫ్ట్లతో పని కానిచ్చేస్తూంటాం. అయితే ఇప్పటివరకూ నగదు, బహుమతులతో సాగుతున్న ఈ చదివింపుల తంతు కేరళలో కొత్త అవతారమెత్తింది. పేటీఎం బాట పట్టింది. ఎలాగంటే.. కేరళలోని ఒకానొక ఊళ్లో ఒక పెళ్లి. బంధుమిత్రుల కోలాహలం, వధూ వరుల అచ్చట్లు ముచ్చట్లు ఎన్ని ఉన్నా.. ఈ వేడుకలో హైలైట్ మాత్రం పెళ్లికూతురి తండ్రి. తెల్లటి షర్టు, పంచెతో కనిపించిన ఈయనగారి జేబుపై పేటీఎం క్యూఆర్ కోడ్ పిన్ చేసి ఉంది మరి. పెళ్లికి కాదుకానీ... మూడేళ్ల క్రితం పంజాబ్, బీహార్లలో శుభకార్యాల్లో బ్యాండ్ వాయించే వారికి డిజిటల్ చదివింపుల చేసిన వాళ్లు ఉన్నారు. డ్రమ్ముకు అతికించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నజరానాలు సమర్పించిన వాళ్లు కొందరైతే.. డ్రమ్ముపైనే క్యూఆర్ కోడ్ ముద్రించుకుని మరీ నగదు ప్రశంసలు పొందిన వారు ఇంకొందరు. దేశంలో 2017లో మొదలైన ‘భారత్ క్యూఆర్’తో డిజిటల్ పేమెంట్లు చాలా సులువైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ క్యూఆర్ కోడ్ పేమెంట్ వ్యవస్థ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మాస్టర్కార్డ్, వీసాలతో మొదలుపెట్టగా.. తరువాతి కాలంలో దీన్ని అందరూ వాడటం మొదలైంది. పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే వంటివి మూలమూలలకూ చేరిపోయాయి. గత ఏడాది దేశం మొత్తమ్మీద 35 కోట్లకుపైగా క్యూఆర్ కోడ్లు చెలామణిలో ఉన్నాయంటే ఇదెంత పాప్యులర్ అన్నది ఇట్టే అర్థమై పోతుంది.క్యూఆర్ కోడ్లు పెట్టుకుని భిక్షమెత్తుకునే వారిని మనం చూసే ఉంటాం కానీ ఇలా వెరైటీగా చదివింపుల కోసం క్యూఆర్ కోడ్ను తొలిసారి వాడింది మాత్రం ఈయనే కాబోలు!. ‘‘అయ్యలారా.. అమ్మలారా.. కూతురి పెళ్లికి బోలెడంత ఖర్చయిపోయింది... చేసే చదివింపులు ఏవో నాకూ కొంత ముట్టజెబితే... అదో తుత్తి’’ అన్నట్టుగా ఉంది ఆ తండ్రి వ్యవహారం. ఇన్స్టాగ్రామ్లో తెగవైరల్ అయిపోయింది ఈ వీడియో క్లిప్. కొంతమంది అతిథులు మొబైల్ఫోన్లతో స్కాన్ చేసి పేటీఎం చదివింపులు చేయించడమూ స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో పడిందే తడవు.. పలువురు పలు రకాల కామెంట్లూ చేస్తున్నారు. పెళ్లికూతురి తండ్రికి డిజిటల్ టెక్నాలజీపై ఉన్న మక్కువను, దేశంలో డిజిటల్ చెల్లింపులు సులువైన వైనాన్ని కొంతమంది బాగానే ప్రశంసించారు. మరికొందరు డిజిటల్ టెక్నాలజీ మన సంప్రదాయాలను మరుగున పడేలా చేస్తోందని నొసలు విరిచారు కూడా. ఏదైతేనేం.. ఆ పెళ్లికి వెళ్లిన వారందరూ ఆ తండ్రి చేష్టకు కాసేపు సరదాగా నవ్వుకున్నారు. ఇచ్చేదేదో ‘పే’ చేసేసి.. సుష్టుగా భోంచేసి మరీ వెళ్లిపోయారు. ఆశీర్వాదాలు వధూ వరులకు... క్యాష్ తండ్రికి అన్నమాట! View this post on Instagram A post shared by INDIA ON FEED (@indiaonfeed)
బాలభీముడు పుట్టగానే 4.5 కేజీలు
కర్ణాటక రాష్ట్రం: జిల్లాలో ఎస్ఎస్ పురం కస్తూర్భా ఆస్పత్రిలో 4.5 కేజీల బరువున్న శిశువు జన్మించాడు. ఔరా బాలభీముడని చూసినవారు ఆశ్చర్యపోయారు. తుమకూరు నివాసి రమ్య (32) కు నెలలు నిండడంతో ఆస్పత్రిలో చేరింది. ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా ఇదే ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యులు సూచనల మేరకు ఆహారం, వ్యాయామం, యోగా ఆచరించేవారని తెలిపారు. మంగళవారం సహజ ప్రసవం ద్వారా కొడుకు పుట్టాడు. వాస్తవానికి శిశువు బరువు ఎక్కువ ఉంటే సాధారణ కాన్పు కావడం చాలా కష్టమని, అయితే తల్లి సరైన ఆరోగ్య దినచర్యను పాటించడం వల్ల మామూలుగా కాన్పు జరిగినట్లు వైద్యులు తెలిపారు. బాలభీముడు వైరల్ అయ్యాడు.
ఎన్ఆర్ఐ
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం
ప్రపంచ శాంతికి, మానవతా విలువల పరిరక్షణకు కృషిచేస్తున్న గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం దక్కింది. సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరం ఈ నెల 19వ తేదీని “శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం”గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించేందుకు, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని, వివిధ మతాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించటం, సమాజాభివృద్ధికి కృషి చేయటం వంటి విషయాలలో గురుదేవుల చేసిన సేవకుగానూ ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడుతున్న మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, శాంతిదూత అయిన శ్రీశ్రీ రవిశంకర్ ఒత్తిడి లేని, హింస లేని సమాజం నెలకొల్పాలనే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో 8కోట్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసిందని సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్, వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ పేర్కొన్నారు. రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్మూలన శిబిరాలు, యువ నాయకత్వ శిబిరాలు, సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు అక్కడి ప్రజలలో మానసిక దృఢత్వం, సౌభ్రాతృత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడటమేగాక శాంతియుత వాతావరణం, మహిళా సాధికారికతను పెంపొందించాయన్నారు. చివరగా ఇక అంతకు ముందురోజైన అక్టోబర్ 18వ తేదీన వాంకోవర్ నగరం సైతం గురుదేవుల్ని ఇదే విధంగా సత్కరించి, అక్టోబర్ 18వ తేదీని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దినం గా ప్రకటించటం గమనార్హం.(చదవండి: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు)
న్యూజెర్సీ హైవే దత్తతలో నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్థులు
ఈస్ట్ విండ్సర్, న్యూజెర్సీ: భావితరంలో సామాజిక బాధ్యత పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా న్యూజెర్సీలో హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టి హైవేను శుభ్రం చేసింది. ఈస్ట్ విండ్సర్, న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో అడాప్ట్-ఎ-హైవే క్లీన్ అప్ ప్రోగ్రామ్ పేరుతో నాట్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ సభ్యులు, పలువురు తెలుగు విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రహదారి పరిసరాలను శుభ్రం చేశారు. ఇలా తెలుగు విద్యార్థులు నాట్స్ ద్వారా చేసిన ఈ సామాజిక సేవకు అమెరికా ప్రభుత్వం నుంచి వాలంటీర్ అవర్స్గా గుర్తిస్తుంది.. ఇది విద్యార్థుల కాలేజీ ప్రవేశాలకు ఉపకరిస్తుంది. నాట్స్ న్యూజెర్సీ నాయకులు ప్రశాంత్ కూచు నాయకత్వంలో కిరణ్ మందాడి, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి తదితరులు హైవే దత్తత పరిశుభ్రత కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.తెలుగు వాళ్లు అమెరికా సమాజానికి సేవ చేయగలగడం పట్ల సంతోషంగా ఉందని నాట్స్ అధ్యక్షుడు శ్రీ హరి మందాడి అన్నారు. శుభ్రమైన, పచ్చని వాతావరణం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ పని గంటలు విద్యార్థులకుతమ వాలంటీర్ అవర్స్గా పాఠశాలలో ఉపయోగపడతాయన్నారు. ఇకపై ప్రతీ రెండు నెలలకొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని తెలుగు విద్యార్ధులు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.నాట్స్ న్యూజెర్సీ బృందం నుంచి శ్రీనివాసరావు భీమినేని, కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, వంశీ వెనిగళ్ల, ప్రశాంత్ కుచ్చు, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి, శ్రీనివాస్ నీలం, సూర్య గుత్తికొండ, శంకర్ జెర్రిపోతుల, మల్లి తెల్ల, వెంకట్ గోనుగుంట్ల తదితరులు ఈ హైవే దత్తత, పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలుగు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంచే చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన న్యూజెర్సీ నాట్స్ టీమ్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.
మిస్సోరీలో నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్, ట్రోఫీలు
అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీ తెలుగువారి కోసం వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వరంలో ఫెంటన్ మిస్సోరీలోని లెగసీ వీటీసీలోఈ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు జరిగాయి. తెలుగు క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపుతూ సాగిన ఈ క్రీడా సంబరం తెలుగు క్రీడా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. చెస్టర్ఫీల్డ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు గ్యారీ చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ను నాట్స్ ప్రారంభించింది. ఈ టోర్నమెంట్లలో మొత్తం 25 జట్లు, 200 మందికి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్లు తెలుగువారి క్రీడా స్ఫూర్తిని, క్రీడల పట్ల ఉన్న మమకారాన్ని చాటి చెప్పాయి.నాట్స్ మిస్సోరీ విభాగం విశేష కృషిఈ క్రీడా పోటీలు విజయవంతం కావడానికి నాట్స్ ప్రముఖులు, మిస్సౌరీ ఛాప్టర్ నాయకత్వం, మిస్సోరీ నాట్స్ సభ్యులు విశేష కృషి చేశారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ పూర్వ అధ్యక్షులు ప్రస్తుత బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీస్ కొల్లిపరతో పాటు తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ మాజీ అధ్యక్షుడు సురేంద్ర బాచిన, మధుసూదన్ దద్దాల, మురళి బందరుపల్లి వంటి ప్రముఖులు ఈ పోటీల నిర్వహణను పర్యవేక్షించారు.నాట్స్ మిస్సోరీ ఛాప్టర్ బృందం తరుణ్ దివి, చైతన్య పుచకాయల, సంకీర్త్ కట్కం, రాకేష్ రెడ్డి మారుపాటి, సునీల్ స్వర్ణ, హరీష్ గోగినేని, నరేష్ రాయంకుల, నవీన్ కొమ్మినేని, శ్రీనివాస్ సిస్ట్ల తదితరులు ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి ఎంతో కృషి చేచేశారు. నాట్స్ వాలంటీర్లు కూడా ఈ టోర్నమెంట్ కోసం విలువైన సమయాన్ని, సేవలను వెచ్చించారు..విజేతలకు ట్రోఫీలు పంపిణీఐదు విభాగాలలో విజేతలు మరియు రన్నరప్లకు నాట్స్ ట్రోఫీలను పంపిణీ చేసింది.. క్రీడాకారుల అంకితభావం, ప్రతిభను ఈ సందర్భంగా నాట్స్ నాయకులు కొనియాడారు. నాట్స్ మిస్సోరి విభాగం వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను దిగ్విజయం చేయడంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
డల్లాస్ ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్
ఫ్రిస్కో, టెక్సాస్: భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ డల్లాస్ లో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫ్రిస్కో నగరంలోని మోనార్క్ వ్యూ పార్క్ వద్ద అడాప్ట్ ఏ పార్క్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొండ వెనుక భాగంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో మొక్కలు నాటి, వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా, సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ విభాగం సభ్యులు పిల్లలకు శుభ్రత, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించారు. సీతాకోకచిలుకల సంరక్షణకు అనుకూల వాతావరణం కల్పించడంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని పర్యావరణ పరిరక్షకులు తెలిపారు.గత ఆరు నెలలుగా నాట్స్ డల్లాస్ చాప్టర్ ఈ మొనార్క్ వ్యూ పార్క్ ను దత్తత తీసుకుని, అక్కడ తరచూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ కాలంలో విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తోంది. పార్క్ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ 2,000 కు పైగా మొక్కలను నాటిన ఘనతను నాట్స్ డల్లాస్ చాప్టర్ సాధించింది.నాట్స్ చేస్తున్న నిరంతర కృషిని సిటీ ఆఫ్ ఫ్రిస్కో ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న 25 మంది యూత్ వాలంటీర్లను గుర్తించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ విభాగం అధికారి క్రిస్టల్, ప్రకృతి పరిరక్షకులు రిక్, లారా హాజరయ్యారు. నాట్స్ తరపున ప్రతినిధులు బాపు నూతి, రాజేంద్ర మాదాల, రవి తాండ్ర, కిశోర్ నారె, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి, శివ మాధవ్ లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.నాట్స్ డల్లాస్ చాప్టర్ ఇలాంటి సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని ప్రతినిధులు తెలిపారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
క్రైమ్
ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ ఈఈ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విద్యుత్ ఈఈ రామారావు కాంట్రాక్టర్ వద్ద రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ మిషన్ల మెయింటనెన్స్ టెండర్ను యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఉపేందర్, సందీప్రెడ్డి గతేడాది రూ.10లక్షలకు దక్కించుకున్నారు. కానీ గత సంవత్సర కాలంగా వారికి బిల్లులు రావడం లేదు. దీంతో తమకు రావాలి్సన రూ.10లక్షల బిల్లులు ఇవ్వాలని ఉపేందర్, సందీప్రెడ్డి గత కొన్ని నెలలుగా ఈఈ రామారావును అడుగుతూ వస్తున్నారు. రూ.2లక్షలు ఇస్తేనే..అయితే రూ.10లక్షల బిల్లుల్లో రూ.2లక్షలు తనకు ఇవ్వాలని రామారావు డిమాండ్ చేశాడు. రూ.1.90లక్షలు ఇస్తామని ఉపేందర్, సందీప్రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని వారు ఏసీబీ అధికారుల దృష్టికి రెండు నెలల క్రితం తీసుకెళ్లారు. రామారావు వివిధ పనుల్లో బిజీగా ఉండి ఉపేందర్, సందీప్రెడ్డిని ఈ రెండు నెలలు డబ్బులు అడగలేదు. బు«ధవారం విధులు ముగించుకొని హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యలో రూ.1.90లక్షలు తీసుకుంటానని ఉపేందర్, సందీప్రెడ్డికి రామారావు చెప్పాడు. దీంతో వారు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలోని ఓ ఆస్పత్రి సమీపంలో ఉపేందర్, సందీప్రెడ్డి నుంచి రామారావు రూ.1.90లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో 9 నెలలు సస్పెండ్.యాదగిరిగుట్ట ఆలయంలో సురక్ష సిబ్బంది వద్ద ఈఈ రామారావు డబ్బులు తీసుకొని వారిని ఉద్యోగంలో పెట్టుకున్నారని గతేడాది ఆరోపణలు రావడంతో అప్పటి ఈఓ భాస్కర్రావు విచారణ చేసి రామారావును సస్పెండ్ చేశారు. 9 నెలలు సస్పెండ్కు గురైన తర్వాత పైరవీలు చేసుకొని తిరిగి ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన అక్రమ పద్ధతిలో ఉద్యోగం సంపాదించాడని, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద పనిచేసే సిబ్బందితో తన వ్యవసాయ బావి వద్ద పనులు చేయించుకునే వారని, వినకుంటే వ్యక్తిగతంగా దూషించి, ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించేవాడని సమాచారం. ఇక్కడ ఈఈ, మేడారంలో ఎస్ఈ..?ములుగు జిల్లా మేడారంలో వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క–సారక్క జాతర జరగనుండగా.. అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టుకు రామారావును ఇన్చార్జిగా రెండు రోజుల క్రితం నియమించినట్లు తెలుస్తోంది. విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న రామారావు.. సివిల్ విభాగంలో ఇన్చార్జి ఎస్ఈగా పదోన్నతి పొందడంపై స్థానిక ఆలయ ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. బుధవారం యాదగిరి క్షేత్రంలోని లక్ష్మీ పుష్కరిణిని సందర్శించేందుకు వచ్చిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్రాజుతో కలిసి ఇన్చార్జి ఎస్ఈ హోదాలో రామారావు పరిశీలించాడు. ఇంట్లో సోదాలుఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం ఆధ్వర్యంలో రామారావు ఇంట్లోతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాదగిరిగుట్ట ఆలయంలో రామారావు కార్యాలయంలో సైతం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు ఫైల్స్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సైడ్ మిర్రర్ను తాకాడని..
మెట్రో నగరం బెంగళూరులో మరో ఘాతుకం చోటు చేసుకుంది. తమ కారు సైడ్ మిర్రర్కు తాకిందని బైకర్తో గొడవపడి.. ఆపై ఆ యువకుడిని వెంటాడి కారుతో గుద్ది చంపారు ఇక్కడో జంట. ఈ షాకింగ్ ఘటనలో పోలీసులు వెల్లడించిన వివరాలు ఉన్నాయి. ఈ నెల 25న అర్ధరాత్రి దర్శన్ తన స్నేహితుడు వరుణ్తో కలిసి ఫుట్టనహెళిలోని శ్రీరామ లేఅవుట్ ప్రాంతంలో బైకుపై వెళ్తున్నారు. ఆ సమయంలో పక్కగా వెళుతున్న ఓ కారు సైడు మిర్రర్ను వీరి బైకు తాకింది. కారులో ఉన్న దంపతులు బైక్ నడుపుతున్న దర్శన్తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న బైకును దంపతులు కారులో రెండు కి.మీ. వెంబడించారు. వెనక నుంచి బైకును ఢీకొట్టి వెళ్లిపోయారు.#Bengaluru Road Rage Turns Deadly!A Kalaripayattu trainer & his wife were arrested for killing a delivery agent near JP Nagar: They rammed their car into his bike after its handle grazed their rear-view mirror. The pillion rider survived the crash.@timesofindia pic.twitter.com/IqlaIedTGt— TOI Bengaluru (@TOIBengaluru) October 29, 2025ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్లను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. దర్శన్ చనిపోగా.. వరుణ్ చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేపీనగర పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. యాక్సిడెంట్ తర్వాత కారు నుంచి విడిభాగాలు పడిపోతే ఆ జంట మాస్కులతో వెనక్కి వచ్చి మరీ వాటిని తీసుకెళ్లడం రికార్డైంది. ఈ క్రమంలో.. లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులకు నిందితుల ఆచూకీ లభ్యమైంది. నిందితులను భార్యాభర్తలైన మనోజ్, ఆరతిగా గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. విచారణలో తాము నేరానికి పాల్పడినట్లు వాళ్లు ఒప్పుకున్నారు. తొలుత బైక్తో ఢీ కొట్టడానికి ప్రయత్నించగా.. వాళ్లు తప్పించుకున్నారని, ఆపై యూటర్న్ తీసుకుని మరోసారి వెంబడించి మరీ ఢీ కొట్టామని ఈ దంపతులు పోలీసులకు తెలిపారు.
లాటరీలో భారీ జాక్పాట్.. కట్చేస్తే మృతదేహం అలా..
కోల్కత్తా: లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మాజీ తృణముల్ కాంగ్రెస్ నాయకుడు సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగాల్లోని కుల్తీ అసెంబ్లీ నియోజకవర్గంలోని లఖియాబాద్ అప్పర్ పారా ప్రాంతంలో కార్తీక్ బౌరి కుటుంబం నివసిస్తోంది. ఈ మధ్యే కార్తీక్ బౌరికి కోటి రూపాయల లాటరీ తగిలింది. ఇంతలోనే అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో, కార్తీక్ బౌరి తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన ఫిర్యాదులో మాజీ టీఎంసీ నాయకుడు బేబీ బౌరి, అమర్దీప్ బౌరి, సందీప్ బౌరి, జ్యోత్స్న బౌరిలే కార్తీక్ను హత్య చేసినట్లు ఆరోపించారు.అక్కడ మృతదేహాం.. కార్తీక్ బౌరి అచేతనంగా బేబీ బౌరి ఇంటి బయట ఉన్న మెట్లపై కనిపించాడు. అనంతరం, అతడి కుటుంబం అక్కడికి చేరుకుని వెంటనే కార్తీక్ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే కార్తీక్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో బేబీ బౌరిని కార్తీక్ కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. కార్తీక్ తన ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు. దొంగతనానికి వచ్చి ఇంటి గోడ దూకి పారిపోతుండగా కిందపడి మృతి చెందినట్టు చెప్పుకొచ్చాడు.అయితే, బేబీ బౌరి వ్యాఖ్యలను కార్తిక్ తల్లి తిరస్కరించింది. ఇటీవలే తన కొడుకు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నాడని, దొంగతనం చేయడానికి ఎటువంటి కారణం లేదని చెప్పింది. కార్తీక్ను ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు ఆరోపించారు. దీంతో, కార్తీక్ మృతి కేసులో మాజీ తృణమూల్ నాయకుడు బేబీ బౌరి, అమర్దీప్ బౌరిలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులు సందీప్ బౌరి, జ్యోత్స్న బౌరి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరినీ అసన్సోల్ కోర్టు ముందు హాజరుపరిచినట్టు వెల్లడించారు.
ఎందుకు వచ్చేశాడు? ఎవరిని కలిశాడు?
సాక్షి, హైదరాబాద్: నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) నమోదైన కేసులో వాంటెడ్గా ఉండి, గత వారం టాస్క్ ఫోర్స్ పోలీసుల కస్టడీ నుంచి ఎస్కేప్ అయిన సతీష్ ఉప్పలపాటి వ్యవహారంలో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని విచారిస్తున్న ఉన్నతాధికారులు పోలీసు బృందాలకి నేతృత్వం వహించిన సబ్–ఇన్స్పెక్టర్ కదలికల్ని అనుమానిస్తున్నారు. మరోపక్క పరారీలో ఉన్న నిందితుడు సతీష్తో పాటు ఆయన భార్య శిల్ప బండ కోసం సీసీఎస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహారం... ఘరానా మోసగాడు సతీష్ను పట్టుకోవడం నుంచి అతడు పారిపోవడానికి సహకరించడం వరకు ప్రతి అంశంలోనూ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించారు. ముంబైలో సతీష్ ఆచూకీ కనిపెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడి కోసం ఎస్ఐ నేతృత్వంలో బృందాన్ని గత గురువారం అక్కడకు పంపారు. గత గురువారం రాత్రి (23వ తేదీ) సతీష్తో పాటు ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారి వద్ద ఉన్న దాదాపు ఎనిమిది సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి నిందితుల్ని పోలీసులు తమ వాహనంలోనే తరలిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు వారి చేతికి అందనీయరు. టాస్్కఫోర్స్ ఎస్ఐ మాత్రం తన బృందం ఉన్న కారును వదిలి నిందితులతో కలిసి వాళ్ల కారు ఎక్కారు. ఫోన్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేశాడు. ఈ వాహనాన్ని నిందితుడి డ్రైవరే నడిపారు. రెండు గంటల ముందే వచ్చిన మరో కారు... వీరిది ఎస్యూవీ వాహనం కాగా పోలీసులది పాత ఇన్నోవా. దీంతో ఈ రెండు వాహనాల మధ్య దూరం దాదాపు 40 కి.మీలకు చేరింది. గురువారం రాత్రి షోలాపూర్లో నిందితులతో కలిసి భోజనం చేసిన ఎస్ఐ ఆ సమయంలోనూ తన బృందంతో మాట్లాడారు. వీరి వాహనం సదాశివపేట్ చేరడానికి రెండు గంటల ముందే నగరం నుంచి మరో కారు వచ్చి అక్కడ సిద్ధంగా ఉంది. గత శుక్రవారం (24వ తేదీ) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సతీష్, ఎస్ఐ తదితరులు ప్రయాణిస్తున్న వాహనం సదాశివపేట్లోని ఓ దాబా వద్దకు చేరింది. అప్పటికే అక్కడ ఉన్న నగరం నుంచి వచ్చిన కారులో ఎక్కిన నిందితులు కొల్హాపూర్ వైపు పారిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికి వెనుక వస్తున్న తన బృందానికి ఎస్ఐ సమాచారం ఇచ్చారు. బృందం రాకముందే హైదరాబాద్కు.. సాధారణ పరిస్థితుల్లో సదరు ఎస్ఐ అక్కడే ఉండిపోవడమో, సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా నిందితులు వెళ్లిన దారిలో గా లిస్తూ వెళ్లడమో చేస్తారు. అయితే ఇతను మాత్రం నిందితు డి కారులో, అతడి డ్రైవర్తో కలిసి హైదరాబాద్ పయనమ య్యా రు. కొద్దిసేపటికి దాబా వద్దకు చేరుకున్న బృందం ఎస్ ఐని సంప్రదించగా.. తాను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పాడు. అలా సిటీకి వచ్చేసిన సదరు ఎస్ఐ ఎక్కడెక్కడకు వెళ్లా డు? ఎవరెవరిని కలిశాడు? తదితర అంశాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎస్ఐతో పాటు సతీష్ కుటుంబీకులు ప్రయాణించిన కారు డ్రైవర్ను పోలీసులు ప్రశి్నస్తున్నారు. వాహనాలు మారుస్తూ ఏమారుస్తూ... సదాశివపేట్ దాబా వద్ద నుంచి సతీష్, అతడి కుటుంబం మహారాష్ట్రలోని కొల్హాపూర్ వరకు వెళ్లింది. అక్కడ నుంచి మరో కారు అద్దెకు తీసుకుని ముంబై రూట్లో ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిందితులను పట్టుకోవడానికి బుధవారం నుంచి సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. కేంద్ర మాజీ మంత్రిగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్గా పని చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడి ఫిర్యాదు మేరకు సతీష్ తదితరులపై సీసీఎస్లో నమోదైన కేసులో నిందితులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లిలోని న్యాయస్థానం దీనిపై గురువారం తీర్పు వెలువరించనుంది. అప్పటి వరకు దొరకొద్దని భావించిన సతీష్, శిల్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈలోపే టాస్్కఫోర్స్కు చిక్కడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు.
వీడియోలు
బాబు గారు సీఎంగా ఉంటే వస్తదా? ఎల్లో మీడియా వార్తలపై ఈశ్వర్ సెటైర్లు
Warangal: వరదలో చిక్కుకున్న 473 మంది బాలికలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
తుది దశకు భారత్-అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: శైలజానాథ్
కూటమి ప్రభుత్వం ఈ-క్రాప్ను పూర్తిగా నీరుగార్చింది: YS జగన్
Mahabubabad: బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన వైద్యులు
Cyclone Montha: ఖమ్మం టౌన్లోకి వస్తున్న వరద నీరు
హిందూపురంలో కల్తీ మద్యం తాగి... MLA బాలకృష్ణకు దీపికా అదిరిపోయే కౌంటర్
Vidadala: ఇది చిలకలూరిపేట రైతుల పరిస్థితి.. ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటే
Cyclone Montha: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణపై మహిళా రైతుల ఫైర్






